Sunday, October 30, 2016

విద్యార్థులకు నేర్పేవిద్యా ఫలితాలు ఏవరివి?


విద్యార్థులకు నేర్పేవిద్యా ఫలితాలు ఏవరివి?



సాహితీమిత్రులారా!




భవభూతి ఉతర రామచరితంలోని
ఈ శ్లోకం చూడండి-
విషయం మీకే తెలుస్తుంది.
విద్యనేర్పేవరే ఉపాధ్యాయుని
బాధ్యత అని గతంలో అనేవారు.
నేడు దానికి విరుద్ధంగా మారింది.
ఏది ఏమైనా భవభూతిగారి మాటలను
ఈ శ్లోకంలో చూడండి-

వితరతి గురు: ప్రాజ్ఞే విద్యాం యధైవ తథా జడే
నహి ఖలు తయో ర్ఞానే వృద్ధిం కరో త్యపహంతి వా
భవతి త తయో ర్భూయా న్భేద: ఫలం ప్రతి తద్యథా
ప్రభవతి శుచిర్బింబ గ్రహే మణి ర్న మృదాంచయ:


గురువు తన శిష్యులలో తెలివి కలవానికి బోధించినట్లే
మందబుద్ధిగలవానికి కూడ బోధిస్తాడు. వారిలో ఎవరికీ
జ్ఞానాన్ని కొత్తగా తాను చేర్చడు. మరెవ్వరితెలివిని తగ్గించడు
అయినా ఫలితాల విషయంలో వారిలో పెద్ద భేదం కనిప్స్తుంది
దానికి ఉదాహరణగా ప్రిబింబాన్ని గ్రహించటానికి నిర్మలంగా
ఉన్న మణి సమర్థమైందిగాని మట్టిముద్ద తనపక్కనున్న వస్తువు
ప్రతిబింబాన్ని ఇవ్వదుకదా - అని శ్లోక బావం.

ఇందులో చురుకైన బుద్ధిని మణితోను,
మందబుద్ధిని మట్టిముద్దతోను కవి పోల్చాడు.
దీన్ని బట్టి ఉపాధ్యాయుడు ఎలాంటి వారికైనా
ఒకలానే బోధిస్తాడు కాని
ఆ వ్యక్తికిగల గ్రహణ ధారణశక్తిని బట్టే
ఫలితం ఉంటుందని తెలుస్తుంది.

No comments:

Post a Comment