అతిరథ మహారథులు అంటే ఎవరు?
సాహితీమిత్రులారా!
అతిరథ మహారథులు అంటే ఎవరు? -
అనే వీరుల శ్రేణులను గురించి ఇక్కడ
తెలుసుకుందాం-
రాజన్ పి. టి. యస్ . కె గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
అతిరథ మహారథులు అంటే ఎవరు? -
అనే వీరుల శ్రేణులను గురించి ఇక్కడ
తెలుసుకుందాం-
రాజన్ పి. టి. యస్ . కె గారికి ధన్యవాదాలు
సాహితీమిత్రులారా!
మనకు ఎక్కువగా 60 సంవత్సరాలకు చేసుకునే శాంతిహోమాన్నే వింటుంటాం.
మరోవిషయం ఇది చాలమంది 60 సం.లకు చేసుకునే
పెండ్లి అని అనుకుంటారు కానీ కాదు అని తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తికి
కొన్ని వయసుల్లో కొన్నిరకాల అరిష్టాలుంటాయి వాటిని తొలగించుకుంటే
జీవితం సుఖంగా ఉంటుందని మన మహర్షులు సూచించారు.
ఇవి ప్రధానంగా రెండు రకాలుగా చెబుతారు ఒకటి 60 సం. నుండి ప్రారంభించేది
రెండవది 50 సం. నుండి ప్రారంభించేది
ఇక్కడ వాటిని గురించి వాటి పేర్లగురించి తెలుసుకుందాం
భట్టభాస్కరీయ మత ప్రకారం
వయసు చేయించుకోవాల్సిం శాంతి హోమం పేరు
50సం. వైష్ణవీ శాంతి
55సం. వారుణీ శాంతి
60సం. ఉగ్రరథ శాంతి
65సం. మృత్యుంజయ శాంతి
70సం. భౌ(భీ)మరధీ శాంతి
75సం. ఐంద్రీ శాంతి
80 సం. సహస్రచంద్రదర్శన శాంతి
85సం. రౌద్రీ శాంతి
90సం. కాలస్వరూప శౌరి శాంతి
95సం. త్య్రంబక మహారథి శాంతి
100సం. మహామృత్యుంజయ శాంతి
సాహితీమిత్రులారా!
కురుక్షేత్రంలో పాండవుల వైపు 7 అక్షౌహిణులు
కొరవులవైపు 11 అక్షొహిణులు సేనాబలం ఉన్నట్లు
మనం వింటుంటాం కదా అవి ఎవరెవరి బలాలు ఎంతెంత
అనే విషయం ఇక్కడ గమనిద్దాం-
మొదట పాండవుల వైపు చేరిన బలాలు
సాత్యకి - 1 అక్షౌహిణి
ధృష్టకేతుడు - 1 అక్షౌహిణి
మాగధ సహదేవుడు - 1 అక్షౌహిణి
కేకయ పతులు - 1 అక్షౌహిణి
ద్రుపదుడు - 1 అక్షౌహిణి
విరాటుడు
పార్వతీయ మహీపాలుడు - 1 అక్షౌహిణి
పాండ్యరాజు తక్కిన వారు - 1 అక్షౌహిణి
-----------
మొత్తం - 7 అక్షౌహిణులు
------------------
కౌరవుల పక్షం చేరిన రాజసైన్యాలు
భగదత్తుడు, కిరాత - 1 అక్షౌహిణి
భూరిశ్రవుడు, శల్యుడు - 1 అక్షౌహిణి
సుదక్షిణుడు - 1 అక్షౌహిణి
జయద్రథుడు, సౌవీర - 1 అక్షౌహిణి
నీలుడు - 1 అక్షౌహిణి
కృతవర్మ - 1 అక్షౌహిణి
విందాను విందులు - 2 అక్షౌహిణులు
తక్కిన రాజులు - 3 అక్షౌహిణులు
----------------------
మొత్తం - 11 అక్షౌహిణులు
----------------------
సాహితీమిత్రులారా!
పూర్వం మనదేశంలో యుద్ధాల్లో
ఎత్తుకు పై ఎత్తులు వేసి వ్యూహాలను పన్నేవారు
ఈ వ్యూహాల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే
ఎదుటి సైన్యాన్ని నాశనం చేయగలిగేవిధంగా సైన్యాన్ని నిలబెట్టడమే
చతురంగ బలాలలను నిల బెట్టడంలో చాలా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి.
ఏ వ్యూహం ఎదుటివారు వేస్తే మనం ఏవ్యూహం వేయాలో తెలిసుండాలి.
ఆ వ్యూహాల పేర్లను ఇక్కడ గమనిద్దాం-
కురుక్షేత్రంలో పన్నిన వ్యూహాలు-
మానుష వ్యూహం, చారు స్థానకం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, క్రౌంచ వ్యూహం, మండల వ్యూహం, కూర్మ వ్యూహం, సర్వతోభద్ర వ్యూహం, శకట వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం, పద్మ వ్యూహం, సూచీ వ్యూహం, అచల వ్యూహం, శ్యేన వ్యూహం, వజ్ర వ్యూహం, శృంగాటక వ్యూహం, దుర్జయ వ్యూహం - అని17 వ్యూహాలు
కౌటిల్యుని అర్థ శాస్త్రంలో ఇవికాక మరో 16 వ్యూహాలున్నాయి-
అవి- భోగ, దండ, అసంహత, స్థూలక్ణ, ప్రదర, దృఢక, అసహ్య, విజయ, విశాలవిజయ, సంజయ, చమూముఖ, ఝషస్య, సర్పసరి, అరిష్ట, అప్రతిహత, ఉద్యానక - అనేవి.
దండ వ్యూహాలు 17 అని, భోగవ్యూహాలు 56 అని హిందూ ఆధిక్యం అనే గ్రంథంలో చెప్పబడింది.
(పి రాజగోపాలనాయుడుగారి కురుక్షేత్రే ఆధారం)
సాహితీమిత్రులారా!
ఒక ప్రమాణాన్ని అతిక్రమించటానికి
దారులు వెదకడం మానవ నైజం.
ఇలాంటి దారులు మన ఇతిహాసాల్లో----
ఆపద్ధర్మంగా అబద్ధమాడటానికి ఇవి లైసన్స్ లు
ఇది ఆంధ్రమహాభారతం ఆదిపర్వం
మూడవ ఆశ్వాసంలోని ఘట్టం-
యయాతి మహారాజు శుక్రాచార్యుల
కుమార్తె దేవయానిని వివాహమాడాడు.
అలాగే విధివశంగా దేవయాని దాసీగా
ఉన్న వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠ
దాసీగా అయింది. దేవయాని దాసీ
కావున శర్మిష్ఠ కూడ యయాతి సొత్తే అయింది.
వివాహసమయంలో శుక్రాచార్యుల వద్ద చేసిన
ప్రమాణం ఉల్లంఘించం ఎలా? అని,
అబద్ధం ఆడటం ఎలా? అని బాధపడే సమయంలో
శర్మష్ఠ యయాతితో అన్న పలుకులు ఈ పద్యం చూడండి-
ఈ ఏడింటియందు నసత్యదోషము
లేదని ముని ప్రమాణంబు గలదు
చను బొంకగ బ్రాణాత్యయ
మున సర్వధనాపహరణమున వధగావ
చ్చిన విప్రార్థమున వధూ
జనసంగమమున వివాహసమయములందున్
(ఆదిపర్వం - 3-178)
.ప్రాణాపాయ సమయాన,
సమస్త ధనం అపహరించ
బడే సమయాన, వధించబడేందుకు
సిద్ధంగా ఉన్న బ్రాహ్మణుని రక్షించేందుకూ,
స్త్రీ సంగమ విషయానా, పెళ్ళివేళలందు
అసత్యమాడవచ్చు - అని భావం
ఇదే విషయాన్ని పోతన శ్రీమదాంధ్రమహాభాగవతం
వామన చరిత్రలో బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు
ఇలాంటి బోధనే చేస్తాడు -
వారిజాక్షులందు వైవాహిములందు
బ్రాణవిత్త మాన భంగమందు
చకితగోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము వొందడధిప
ఈ పద్యం ఆబాలగోపాలం విన్నదే-
సాహితీమిత్రులారా!
తండ్రి తొడపై కూర్చో నివ్వలేదని చిన్నవయసులో అడవులకు పోయి
తపస్సు చేసిన ధృవునిలాంటివారు ఉన్నారా
తండ్రి మాటపై తల్లినే తల నరికిన పరశురామునిలాంటి వారున్నారా
తండ్రి మాకై రాజ్యాన్ని వదలి అడవుల కెళ్లిన రామునిలాంటివారున్నారా
తండ్రి వివాహానికై తను వివాహమాడకుండా భీషణ ప్రతిజ్ఞ చేసిన భీష్మునిలాంటివారున్నారా
తండ్రి కొరకై తన యవ్వనాన్ని తండ్రి ఇచ్చిన పూరువు వంటి వారున్నారా
వీరందరూ పితృభక్తి పరాయణులే కదా వీరిలో ఎవరు గొప్పనో చెప్పగలమా!
సాహితీమిత్రులారా!
మనం రామాయణం అనగానే మనకు వాల్మీకి రామాయణం గుర్తుకు వస్తుంది.
అది సంస్కృతంలో మొదటి కావ్యం మరియు దాని
ఆదికావ్యమని పేరు. దీనిలో వాల్మీకి శ్రీరాముని ఒక ఉదాత్తమైన మానవునిగా చిత్రించాడు.
అతని దివ్యత్వాన్ని నేపథ్యంలోనే ఉంచాడు. కారణం
ఈ లోకంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అనే అంశాన్ని విపులీకరించటానికి వాల్మీకి
ఆ విధంగా చేశాడు. మనం సామాన్యవ్యక్తులం కనుక మనకు అలా ప్రవర్తించటం
వీలుకాదనుకుంటాం. శ్రీరాముణ్ణి మానవునిగానే చిత్రీకరించటంచేత అతడు
ఆదర్శపురుషుడైనాడు. కాబట్టి జనసామాన్యానికి వాల్మీకి రామాయణం
ఆదర్శప్రాయమౌతుంది.
ఆధ్యాత్మరామాయణం బ్రహ్మాండపురాణంలో 61వ అధ్యాయంలో ఉంది.
దాన్ని వ్రాసింది వ్యాసుడు. దీనిలో శ్రీరాముడు భగవంతుని అవతారమని
అడుగడుగునా తెల్పబడుతూంది. సీతాపహరణం యథార్థ సీతాపహరణం
కాదనీ, మాయా సీతాపహరణం అనీ, కైకదయీ మందరలు కూడా
దైవప్రేరణచేతనే ఆ విధంగా ప్రవర్తించారని, రావణుడుకూడ శ్రీరాముడే
పరమాత్మ అని తెలిసి శ్రీరామునిచే వధింపబడి వైరభావంతో మోక్షం
సముపార్జించటానికే సీతాపహరణం చేశాడని ఆధ్యాత్మ రామాయణం
చెబుతుంది. దీన్ని ముముక్షువులు మోక్షసాధనకోసం ముక్తిని కాంక్షించి
ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేస్తారు.
(ఆధారం ఆధ్యాత్మరామాయణం పీఠిక)
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి-
రసవాదంబులు పెక్కు నేర్చిన,
మహారాజేంద్రులన్ గెల్చినన్
వెసతో మంత్రములుచ్ఛరించిన,
మహావిద్యల్ ప్రసంగించినన్
అసహాయంబగు శూరతం గనిన,
దా నంబోధి లంఘించినన్
నొసటన్ వ్రాసిన వ్రాలుకన్నఁ గలదా
నూఱేండ్లు చింతించినన్
రసవాదం అంటే పాదరసంతో బంగారు చేయగల విద్య నేర్చుకున్నా, గొప్పరాజులను గెలిచినా, ఎంతో ప్రయాసతో మంత్రాలు చదివినా, గొప్పవిద్యలను గురించిన ప్రసంగాలు చేసినా, అసహాయంతో శూరత్వాన్ని చూపించినా, సముద్రాన్ని లంఘించినా నొసటవ్రాసిన వ్రాతే గొప్పదిగాని వేరొకటి లేదని పద్యభావం.
సాహితీమిత్రులారా!
భాగవతంలో భగవంతుని స్వరూపం ఎక్కడ ఏవిధంగా ఉందో
కౌశికసంహితలో ఈ విధంగా వివరించారు-
మొదటి స్కంధంలో శ్రీకృష్ణుని పాదాలనుండి మోకాళ్ళవరకు
ద్వితీయ స్కంధంలో కటి (మొల) పర్యంతం
తృతీయస్కంధంలో నాభి(బొడ్డు)
చతుర్థస్కంధంలో ఉదరభాగం
పంచమస్కంధంలో హృదయం
షష్ఠమస్కంధంలో కంఠం
సప్తమస్కంధంలో ముఖం
అష్టమస్కంధంలో కన్నులు
నవమస్కంధంలో బుగ్గలు కనుబొమలు
దశమస్కంధంలో బ్రహ్మరంధ్రము
ఏకాదశస్కంధంలో మనస్సు
ద్వాదశస్కంధంలో ఆత్మ
ఉన్నాయని వివరించింది
సాహితీమిత్రులారా!
నమస్కారం గొప్పదనాన్ని తెలియచేస్తూ
కువలయానందం అనే అలంకారశాస్త్రంలో
అప్పయ్య దీక్షితులవారు
ఈ పద్యం చెప్పారు గమనించగలరు-
వపుః ప్రాదుర్భావతః అనుమితమిదం జన్మని పురా
పురారే న క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్
నమన్ముక్తః సంప్రత్యహమతనుః అగ్రేప్యనతిమామ్
ఇతీశ క్షంతవ్యం తదిదం అపరాధ ద్వయమపి
ఓ పరమేశ్వరా! రెండు తప్పులను చేశాను క్షమించు.
గత జన్మలో నేను నమస్కరించకపోవడం వల్ల ఇప్పుడు
జన్మనెత్తాను. ఈ జన్మలో నేను నీకు నమస్కరిస్తే ఇక జన్మ
ఉండదు కనుక అపుడు నీకు నమస్కరించే అవకాశం
లేదు కదా కనుక నా తప్పులను క్షమించు - అని భావం
సాహితీమిత్రులారా!
ఏ పూవులను ఎవరి పూజకు ఉపయోగించాలో
ఇక్కడ కొంత విషయాన్ని తెలుసుకుందాం-
గణేశం తులసీ పత్రైః నవదుర్గాశ్చైవ దూర్వయా,
ముని పుష్పైః తథా లక్ష్మీకామో నచార్చయేత్
సంపదలపైన ఆపేక్షకలిగి దేవతలను పూజింపగోరేవారు తులసీ దళాలతో వినాయకుని, నవదుర్గలను, పార్వతిని పూజించరాదు. అవిశపూలతో సూర్యుని పూజింపరాదు అలా చేస్తే సంపదంతా పోయి ఏడేళ్ళు జ్యేష్టాదేవి ఇంటనిలుస్తుంది
జపా కుంద శిరీషైశ్చ యూధికా మాలతీ భవైః
కేతకీ భవ పుష్పశ్చ నై వార్చ్యః శంకర స్తథా
జపా, మొల్ల, దిరిసెన, మాలతీ, మొగలి పూలతో శివార్చన చేయరాదు
శిరీ షోన్మత్త గిరిజా, మల్లికా శాల్మలీ భవైః
అర్కజైః కర్ణికారశ్చ, విష్ణు నార్చ్యః సితాక్షతైః
దిరిసెన, ఉమ్మెత్త, కొండమల్లి, బూరుగు, జిల్లేడు, కొండగోగు - ఈ పూలతో మహావిష్ణువును పూజించరాదు. శూన్యఫలం. అంతేగాక తెల్లవిగాని, కుంకుమ, పసుపు కలిపిన అక్షతలు కూడ విష్ణువుకు ఉపయోగించరాదు. ఆ ఇంట లక్ష్మి ఉండదు. అపరిశుభ్రంగా, చేతులతో, గుడ్డలో కట్టుకు తెచ్చిన పూలు, భక్తిలేని అర్చనలు దైవానికి సమర్పితం కానేరవు.
సాహితీమిత్రులారా!
జీవన్ముక్తుడు అంటే జీవించికూడా ముక్తి పొందినవాడు.
అలాంటివాణ్ణి శంకరభగవత్పాదులవారు ఇలా వర్ణిస్తారు-
క్వచిత్ బాలై సార్ధం కరతలగతావై సహిసితైః
క్వచి త్తారుణ్యాలంకృత నవవధూస్సహరమన్
క్వచిత్ వృద్ధైశ్చింతాకలిత హృదయైశ్చాపివిసన్
మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః
ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకుని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం,
కిలకిల నవ్వుతూ క్రీడా పరులైన బాలురతో ఆడడం, మరొకప్పుడు అలంకృతలైన
స్త్రీలతో చరిస్తూ ఉండడం, ఇంకొకప్పుడు సాంసారిక చింతాజాలంతో క్రుంగిపోయే
ముసలివాళ్ళతో కలిసి విచారించడం, ఇన్ని విధాల చరిస్తున్నా జీవన్ముక్తుడు అయిన
యతివరుడు జ్ఞానయోగదీక్షామహిమవల్ల దేహతాదాత్మ్య భ్రాంతిని పొందడు-
అని భావం
ఇలాంటి జీవన్ముక్తులు ఉన్నా మనం గుర్తించగలమా ఏమో
సాహితీమిత్రులారా!
మనం ఇప్పుడు చాలమంది వ్రాసేవాటిలో
ఒత్తులు వుండవలసినదానికి తీసివేసి లేనిదానికి
పెట్టడం గమనిస్తుంటాము
అలాంటి వాటిలో ఇదొకటి గమనించగలరు
సమాధానం / సమాదానం
సమాధానంలో ''ద'' కు వత్తు వుంది
సమాదానంలో ''ద'' కు వత్తు లేదు
సమాధానం అంటే అంగీకారం(సమ్మతి), ఉత్తరం అని అర్థాలు
సమాదానం అంటే ఇది బౌద్ధమతానికి చెందిన అర్థం
బౌద్ధులు నిత్యకృత్యమనీ, చక్కగా గ్రహించడమని అర్థాలున్నాయి
సంసారమార్గం అంటే
మిథ్యాజ్ఞానం, యోని అని రెండర్థాలు
సాహితీమిత్రులారా!
భారతదేశంలో పురుషులే ప్రదర్శనలో పాల్గొనే
నాట్యాల సాంప్రదాయాలు-
1. కర్ణాటకల - బయలాట, యక్షగానం
2. తమిళనాడు- భాగవతమేళా, కణ్ణియంకూత్తు, తెరుక్కూత్తు
3. కేరళ - కృష్ణాట్టం, కథాకళి
4. గుజరాత్ - భవాయి
5. రాజస్థాన్ - ఖయాల్
6. హర్యానా - స్వాంగ్
7. కాశ్మీర్ - బాండ్ జస్నా
8. ఉత్తరప్రదేశ్ - నౌటంకీ(ఆగ్రా), భారత్ (బ్రజ భూమి)
రాసలీల (వారణాసి), రామలీల (రామ్ నగర్)
9. బెంగాల్ - జాత్ర
10. మణిపూర్ - జాత్ర
11. అస్సాం - అంకియ నట్
12. పశ్చిమ బెంగాల్ - చావ్ (చౌ)
13. బీహార్ - చావ్ (చౌ)
14. ఒరిస్సా - చావ్ (చౌ), గోటిపువా
15. ఆంధ్రప్రదేశ్ - కూచిపూడి, తూర్పుభాగవతం, వీధిభాగవతాలు
సాహితీమిత్రులారా!
కొంతమంది మాట్లాడేప్పుడు నవరంధ్రాల్లో
మైనం పోస్తామని, నవరంధ్రాలు మూసుకు కూర్చో
అని రకరకాలుగా మాట్లాడుతుంటారు
అలాగే ఒక
తోలు తిత్తియిది
తూట్లు తొమ్మిది
తుస్సుమనుట ఖాయం
జీవా తుస్సుమనుట ఖాయం
అని పాడుతుంటారు
(తూట్లు అంటే రంధ్రాలు)
అసలు నవరంధ్రాలంటే ఏవి
మనిషి శరీరంలో 9 రంధ్రాలున్నాయి
అవి తలలోనే ఎక్కువున్నాయి
చెవులు - 2
కండ్లు - 2
ముక్కు రంధ్రాలు - 2
నోరు - 1
మిగిలినవి పొట్టకు దిగువన ఉంటే మలమూత్రద్వారాలు రెండు
వెరసి 9 రంధ్రాలు
మానవుని మరణం ఈ రంధ్రాలగుండా పోతుందని
వీటిలో
తలలోని రంధ్రాగుండా పోతే పుణ్యలోకాలకు పోతారని
మిగిలిన వాటిగుండా పోతే పుణ్యలోకాలకు పోరని
నమ్ముతారు.
సాహితీమిత్రులారా!
సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందని
చాలామంది భావిస్తుంటారు
దానికి సంబంధించిన విషయాన్ని
ఈ వీడియోలో ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
మహాభారతాన్ని గురించిన శాస్త్రీయ ఆధారాలను
Nilesh Oak గారు యూటూబ్ లో ఇచ్చిన వీడియో
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
దేవాలయ శిల్పాలలో మన పూర్వులు
జెనటిక్ డిఎన్ ల ప్రతిభను ఎలా ప్రదర్శించారో
ఈ వీడియోలో వీక్షించగలరు-
సాహితీమిత్రులారా!
మనం అనేక పదాలను వాటి అర్థాలను
పోగొట్టుకుంటున్నాము
అలాంటి పదాలలో
పదాలు కొన్ని
వీటిని గురించి తెలుసుకుందాం
పౌర్ణమి తిథి రెండు విధాలు
1. రాకా - రాత్రీ పగలూ మొత్తం అంతా పౌర్ణమి ఉంటే అది రాకా
2. అనుమతీ -పగటికాలం వరకే పౌర్ణమీతిథి ఉంటే అది అనుమతీ
అలాగే
అమావాస్య తిథి రెండు విధాలు
1. సినీవాలి- అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు
సూర్యోదయం వరకు ఉంటే అది సినీవాలి
2. కుహూ - అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు
సూర్యోదయం కన్న ఎక్కువ ఉంటే అది కుహూ
మనం మనభాషనే మరచిపోతున్న రోజులివి పదాలొక లెక్కా అంటే
నేను చెప్పలేను కానీ వీలైనంతైనా పదాలను గుర్తుంచుకుందామని నా అభిప్రాయం.
సాహితీమిత్రులారా!
సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం
మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం.
సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని.
స - నుండి ని - వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సంపాదించుకొన్న
గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు.
ఈ బిరుదుపొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే అయి ఉండాలి.
తరువాత కాలంలో సాని అనేది ఒకబిరుదుగా ఉండేది.
ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సివచ్చేది.
కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది.
పిల్లలమర్రిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన
బేతరాజు భార్యపేరు ఎర్రక్కసాని.
ఎరుకలసాని, మంత్రసాని, దొరసాని అనే పదాలు
గౌరవప్రదమైనవే కాని నీచమైనవికావు.
రానురాను ఈ పదం విశిష్టత అంతరించి కళంకాన్ని ఆపాదించే
నీచమైన అర్థంగా మారిపోయింది.
(ఈ సమాచారం డా. నటరాజు రామకృష్ణ గారి రుద్రగణిక నుండి.)