Showing posts with label కవితావినోదము. Show all posts
Showing posts with label కవితావినోదము. Show all posts

Monday, May 2, 2016

కుక్షిచింత


కుక్షిచింత


సాహితీమిత్రులారా!

మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు తమ కవితావినోదము
(సంపుటము-1)లోనిది ఈవిషయం.

కుక్షిని గురించిన ఒక చక్కటి సుభాషితం
తమిళంలో అవ్వయ్యార్ అనే భక్తురాలు
తను ఒకమారు అరణ్యంలో పోతూ ఉన్నపుడు
ఆకలిగొన్న సమయంలో చెప్పినదట. సుభాషితం
ఇది.

ఒరునా ళుణవై యొడి యెండ్రా లొడియాయ్
ఇరునాళై క్కే లెండ్రా లేలాయ్
ఒరునాళు మేన్నో వరియాయ్
ఇడుం బైకూ రేన్ వయిరే
ఉన్నోడు వాడిద లగిదు

దీని భావం-
ఒక దినము  ఆహారమును విడిచిపెట్టమంటే విడిచిపెట్టవు.
రెండు దినములకు ఆహారం తీసుకోమంటే తీసుకోవు.
ఒక్కదినమైనా నా సంకటమును తెలిసికొనవు.
సంకటకారిణియైన ఓ కడుపా నీతో జీవనం చేయటం కష్టం.

ఇంత కమ్మని భావం మద్దుపల్లిగారికి తెలిసినంతలో
సంస్కృతంలో కనిపించలేదట. అందుకని
వారు తనే కవితావినోదచాపలంచేత 1-9-1947న
సంస్కృతీకరించారట.
ఆ శ్లోకం ఇది.

హేకుక్షే! తవ కిం బ్రవీమి చరితం? సర్వం విలక్షం, యథా
హ్యేకస్మిన్ జహి వాసరే2న్నమితిచే దేవం నహి త్యక్ష్యసి,
యద్వాప్రాప్తమితి ద్వివాసరమితం భుంక్ష్వేతి వా నో తథా
జానీషే న హి మే శ్రమం వద కథం జీవామి సాకంత్వయా?