Friday, July 21, 2023

అభినయ సరస్వతి - బి.సరోజాదేవి

 అభినయ సరస్వతి - బి.సరోజాదేవి




సాహితీమిత్రులారా!

B.  Saroja Devi   is an Indian actress who has acted in Kannada, Tamil, Telugu and Hindi films. She acted in around 200 films for more than six decades. She is known by the epithets "Abhinaya Saraswathi"  in Kannada and "Kannadathu Paingili"  in Tamil. She is one of the most successful actresses in the history of Indian cinema. KiranPrabha narrates the life sketch of B.Saroja Devi in this talkshow.



Wednesday, July 12, 2023

దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ

  దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ




సాహితీమిత్రులారా!

గవరయ్య ఆ ఊళ్ళో ఓ వింతమనిషి. అకారం వికారం. ఎవ్వరితో మాట్లాడడు, ఎప్పుడూ నవ్వడు, బస్తీలో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించినా పైసా దానం చెయ్యడు. మున్సబు, కరణం ఎంత ప్రయత్నించినా అతడి వద్దనుంచి పైసా కూడా విరాళం తీసుకోలేకపోయారు. మొదటి భార్య కాలుజారి నూతిలో పడి చనిపోయింది. తనకంటే పదిహేనేళ్ళు చిన్నదైన అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎవ్వర్నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎలా జరిగిందో ఏమో, రెండో భార్య ఎదురింట్లో ఉండే దర్జీతో లేచిపోయింది. అప్పుడేం జరిగింది? అసలు గవరయ్య వింతప్రవర్తనకు కారణమేమిటి? తన పరిధిలో తను బ్రతికే గవరయ్య దుర్మార్గుడు కాదు కదా. ఐనా ఊళ్ళో వాళ్ళందరికీ అతనంటే ఎందుకంత ద్వేషం? ఇంతకీ అతడు 'దేవుణ్ణి చూసినవాడు '  ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్‌ప్రభ      



Sunday, July 9, 2023

తొలితెలుగు నవలలో కథ ఏముంది?

 తొలితెలుగు నవలలో కథ ఏముంది?




సాహితీమిత్రులారా!

రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Tuesday, July 4, 2023

అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న తొలి అమెరికన్ రచయిత | జాక్ లండన్

 అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న తొలి అమెరికన్ రచయిత | జాక్ లండన్



సాహితీమిత్రులారా!

Jack London (January 12, 1876 – November 22, 1916) was an American novelist, journalist and activist. A pioneer of commercial fiction and American magazines, he was one of the first American authors to become an international celebrity and earn a large fortune from writing. KiranPrabha narrates the interesting incidents in Jack London's life.




Saturday, July 1, 2023

ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం

 ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం



సాహితీమిత్రులారా!

ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగదేశాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాపరుద్రుడు. ఆయన పేరుతో నడిచే ఈ కథలో కీలక పాత్ర మాత్రం మహామంత్రి యుగంధరుడిది. వందలయేళ్ల క్రితం నాటి ఈ కథ జానపదుల నోళ్లలో నానుతూ, తరతరాలుగా ముందుకు సాగుతూ వచ్చింది. అలా వచ్చిన ఆ కథ తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన వేదం వేంకటరాయశాస్త్రి గారి చెవిన పడింది. అప్పుడాయనకు సుమారుగా ఎనిమిదేళ్లు. తన తండ్రి చెప్పగా విన్న ఆ కథ వేదంవారి హృదయలో నాటుకుపోయింది. ఆ తరువాత కాలంలో వేంకటరాయశాస్త్రిగారు పెరిగి పెద్దవారయ్యాక కథలోని పాత్రల్ని, సన్నివేశాల్నీ పెంచి 1897లో అంటే సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రీయం అనే పేరుతో నాటకంగా రచించారు. ఆ నాటకానికి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా పేర్కొనే ప్రతాపరుద్రీయం కథలోకి ప్రవేశిద్దాం

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Saturday, June 24, 2023

కూనలమ్మ ఎవరు? | ప్రాచీనమైన 8 కూనలమ్మ పదాలు

 కూనలమ్మ ఎవరు? | ప్రాచీనమైన 8 కూనలమ్మ పదాలు




సాహితీమిత్రులారా!

మనకు “కూనలమ్మ పదాలు” అనగానే ఆరుద్రగారే గుర్తుకు వస్తారు. కానీ నిజానికి ఈ కూనలమ్మ పదాలన్నవి చాలా ప్రాచీనమైనవి. జానపదులు వందల సంవత్సరాలుగా పాడుకుంటోన్న ఈ కూనలమ్మ పదాలలో మనకు దొరికినవి కేవలం 8 పదాలే. వీటిని సేకరించి తెలుగు జాతికి అందించిన మహనీయులు, పరిశోధనా పరమేశ్వరుడిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. ఆయన ఈ 8 కూనలమ్మ పదాలను 1930వ సంవత్సరంలో భారతి పత్రికలో బాలభాష అనే శీర్షిక క్రింద ప్రచురించారు. వాటిని ఆస్వాదించండి-


రాజన్ పి. టి. యస్. కె. గారికి ధన్యవాదాలు


Saturday, June 17, 2023

బసవ పురాణంలో ఏముంది?

బసవ పురాణంలో ఏముంది? 



సాహితీమిత్రులారా!

పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ బసవ పురాణం ఒక ద్విపద కావ్యం. ద్విపద అనేది మన తెలుగులో ఓ ఛందోరీతి. ఈ ద్విపద పద్యానికీ రెండే పాదాలుంటాయి. పాడుకోవడానికి చాలా హాయిగా ఉండే ఈ ద్విపదలకు కావ్య గౌరవం కల్పించిన కవి పాల్కురికి సోమనాథుడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మహాకవి శివ కవిత్రయంగా పేరుమోసిన ముగ్గురు కవులలో ఒకడు. మిగిలిన ఇద్దరూ నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే కావ్యాలు సోమనాథుని తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాయి. ఈ కవి మన తెలంగాణాలో వరంగల్లుకు సమీపంలో ఉండే పాల్కురికి అనే గ్రామంలో పుట్టాడు. సోమనాథుడు తెలుగులోనే కాదు కన్నడ, సంస్కృతాలలో కూడా రచనలు చేసిన మహాకవి. ఇక బసవపురాణం విషయానికి వస్తే.. ఇందులో బసవేశ్వరుని చరిత్రతో పాటూ బెజ్జమహాదేవి, కన్నప్ప, సిరియాళుడు మొదలైన ఎందరో శివభక్తుల కథలున్నాయి. బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక పురుషుడు. ఆ బసవేశ్వరుడు మరణించిన కొద్దికాలానికే పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. అందుకే బసవపురాణంలో విషయాలు అసలు చరిత్రకు చాలా దగ్గరగా ఉండవచ్చన్నది పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి మాట. ఇక కథలోకి వెళదాం.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు 

Monday, June 5, 2023

చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ

చిత్రకవితా సౌరభం - పుస్తకావిష్కరణ




సాహితీమిత్రులారా!


చిత్రకవిత్వంలో ఇటువంటి గ్రంథం ఇంతవరకు రాలేదనే చెప్పాలి

శబ్దచిత్రం మీద మాత్రమే పూర్తిగా విశదీకరించిన గ్రంథం

అనేక భాషలలోని చిత్రకవిత్వ విశేషాలను ఇందులో వివరించడం జరిగింది

ఇది ఏ4 సైజులో 400 పుటలతో కూర్చబడినది. ఈ పుస్తకం కావలసిన 

వారు పుస్తకావిష్కరణ రోజున కొంటే 50 శాతం రాయితీతో అందిస్తున్నాము

అవకాశం ఉపయోగించుకోగలరు. 

పుస్తకం వెల - రు. 500/- రాయితీతో రు.250/-

పోస్టల్ చార్జీలు అదనం. 

Tuesday, May 23, 2023

వాత్స్యాయన కామసూత్ర

 వాత్స్యాయన కామసూత్ర



సాహితీమిత్రులారా!

“దృష్టం కిమపి లోకేఽస్మిన్ న నిర్దోషం న నిర్గుణమ్” అన్నది పెద్దలు చెప్పిన మాట. ఈ ప్రపంచంలో ఇది పూర్తిగా మంచిదీ అని గానీ ఇది పూర్తిగా చెడ్డదీ అనిగానీ ఏదీ లేదు. మంచితో పాటూ చెడూ, చెడుతో పాటూ మంచీ ఉంటూనే ఉంటాయి..  కత్తితో మనం ఎంత చెడు చెయ్యొచ్చో అంత మంచీ చెయ్యొచ్చు. కత్తి అమాయకుల్నీ చంపుతుంది, దుర్మార్గుల్నీ చంపుతుంది. అలానే  ప్రాణం తీసే విషం కూడా వైద్యంలో ప్రాణాలు నిబెట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ వస్తువైనా, పదార్థమైనా ఉపయోగించే విధానాన్ని బట్టే ఫలితాన్నిస్తుంది. అంతేకానీ ఒక వస్తువు చెడు కూడా చేస్తుందన్న భావనతో, దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తే.. ఆ వస్తువు వల్ల పొందాల్సిన మంచిని కూడా మనం పొందలేం. ఈ భావాన్ని మనసులో ఉంచుుని మనం వాత్స్యాయన కామసూత్రాలలోకి ప్రవేశిద్దాం.


 భార్యాభర్తల దాంపత్య జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవడానికి,  మనిషిలో ఉండే చెడు కామాన్ని తొలగించి, దాన్ని ధర్మబద్ధమైన పురుషార్థంగా వినియోగించుకోవడానికీ.. వాత్స్యాయన మహర్షి ఈ గ్రంథం రచించారు. ఇందులో ఆయన చెప్పదలుచుకున్న విషయాలను సుమారు 1700 సూత్రాలుగా వ్రాశారు. అందుకే ఈ గ్రంథానికి వాత్స్యాయన కామసూత్రాలనే పేరొచ్చింది. మహాకవి కాళిదాసు, మహా శాస్త్రవేత్త వరాహమిహిరుడు మొదలైనవారంతా వాత్స్యాయనుణ్ణి కీర్తించినవారే. వాత్స్యాయనుడికి పూర్వం కూడా దత్తకుడు, చారాయణుడు, కుచుమారుడు, సువర్ణనాభుడు మొదలైన కొంతమంది  కామశాస్త్ర గ్రంథాలు వ్రాశారు కానీ.. అవేవీ సమగ్రమైనవి కావు. అందుకే వాత్స్యాయనుడు ఏ కాలం స్త్రీ పురుషులకైనా ఉపయోగపడే విధంగా, చాలా క్లుప్తంగా ఉండే సూత్రాలతో, పరిపూర్ణత్వం ఉట్టిపడేలా ఈ కామశాస్త్ర గ్రంథాన్ని రచించాడు.


 సంభోగానికి మొదటి మెట్టయిన కౌగిళ్లలో ఉన్న నాలుగు రకాల గురించి, ఎనిమిది రకాల నఖ క్షతాల గురించి, అనేక రకాల దంత క్షతాల గురించి, 21 రకాల బంధనాల గురించి, కామోద్రేకం కలిగించే విధానాల గురించి, చుంబన రహస్యాల గురించి, భారతదేశంలో ఏ ప్రదేశానికి చెందిన స్త్రీ పురుషులు ఎటువంటి కోరికలను కలిగి ఉంటారో, వారిని రతి సమయాలలో ఆహ్లాదపరచడం ఎలానో మొదలైన విషయాల గురించి, సంభోగానికి ముందు చేయవలసిన పనులు, సంభోగానికి తరువాత చేయవలసిన పనుల గురించి, వశీకరణ రహస్యాలు, రతి విశేషాలు, గర్భనిరోధక విధానాలు ఇలా ఈ వాత్స్యాయన కామశాస్త్రంలో కామ సంబంధమైన ప్రతీ విషయం గురించీ సూత్రాలున్నాయి. వివాహమైన స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా ఈ శాస్త్రాన్ని కచ్చితంగా నేర్చుకునే తీరాలన్నాడు వాత్స్యాయనుడు. కామశాస్త్రం తెలియని దంపతులు ఔషధం ఎలా ఉపయోగించాలో తెలియని వైద్యులవంటి వారని కూడా అన్నాడు.



రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Friday, May 12, 2023

పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు

 పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు




సాహితీమిత్రులారా!

పండితుడిని కవిత్వంతో కొట్టిన నెరజాణ! - చాటువులు

ఆస్వాదించండి


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Tuesday, May 9, 2023

హాయిగా నవ్వించే ఇంకొన్ని చమక్కులు

 హాయిగా నవ్వించే ఇంకొన్ని చమక్కులు




సాహితీమిత్రులారా!

ప్రముఖుల చమత్కార విషయాలను

ఆస్వాదించండి-



Wednesday, May 3, 2023

క్రీడాభిరామం కథ

క్రీడాభిరామం కథ




సాహితీమిత్రులారా!

కొన్ని వందల సంవత్సరాలుగా ఎన్నో విమర్శలను తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడిన కావ్యం క్రీడాభిరామం.

ఈ క్రీడాభిరామం 295 పద్య గద్యాలతో ఒకే ఒక్క ఆశ్వాసంలో రచించబడిన ఓ వీథి నాటకం. దీనిని రచించింది వినుకొండ వల్లభరాయుడని కొందరు పండితులంటే, కాదు అతని పేరుతో శ్రీనాథుడే ఈ రచన చేశాడని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు. పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రిగారైతే.. ఈ కావ్యకర్త శ్రీనాథుడేనంటూ అందుకు ఎన్నో కారణాలు కూడా చూపించారు. 

ఇక ఈ క్రీడాభిరామం సుమారు 600 సంవత్సరాల క్రితం రచించబడిన కావ్యం. అప్పట్లో ఓరుగల్లు పట్టణం ఎలా ఉండేదో? అక్కడ ప్రజల ఆచార వ్యవహారాలు ఎటువంటివో? ఆ కాలంనాటి నమ్మకాలు, మూఢనమ్మకాలు, వినోదాలు ఇలా ఎన్నో విషయాలు ఈ కావ్యం మన కళ్లకు కట్టిస్తుంది. కాకపోతే.. ఇందులో శృంగారం పాళ్లు చాలా ఎక్కువ. అందుకే వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉత్తమ స్థాయి పండితులకు, పాఠకులకు, విమర్శకులకు తప్ప మిగిలిన వారికి ఇది అందుబాటులో ఉండటం అంత మంచిది కాదన్నారు. అయితే వాళ్ళకు మాత్రం ఈ కావ్యం అవసరం ఏముంది? అన్నవారికోసం ఆయనో మాట చెప్పారు. నాభి, ఉల్లిపాషాణం వంటి విష పదార్థాలు తెలిసి తీసుకున్నా, తెలియకుండా తీసుకున్నా ప్రాణాలు తీసేస్తాయి. కానీ అవే విషపదార్థాలను వైద్యంలో సరైన మోతాదులో వాడితే, దీర్ఘరోగాలను, ప్రాణాంతక రోగాలను తగ్గిస్తాయి. ఈ ప్రపంచంలో నిరుపయోగమైన వస్తువంటూ ఏదీ లేదు. కాకపోతే ఆ వస్తువును వినియోగించే మనిషిని బట్టి దాని ప్రభావం, ఫలితం మారిపోతాయి. ఈ క్రీడాభిరామం కావ్యం కూడా అటువంటిదేనన్నది ప్రభాకరశాస్త్రిగారి అభిప్రాయం. మనం కూడా శాస్త్రిగారి మాటను శిరసావహిస్తూ ఈ కావ్యంలోని వర్ణనల్ని విడిచిపెట్టి కేవలం కథను మాత్రమే చెప్పుకుందాం. మొత్తం క్రీడాభిరామం చదవాలనన్న ఆసక్తి ఉన్న పాఠకులకు ఈ కావ్య ప్రతి ఎలానూ ఇంటర్నెట్‌లో ఉచితంగా అందుబాటులో ఉండనే ఉంది.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు 

Monday, May 1, 2023

"రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి?

 "రాజశేఖర చరిత్ర" నవలలో కథ ఏమిటి? 




సాహితీమిత్రులారా!

కందుకూరి వీరేశలింగం పంతులు గారి "రాజశేఖర చరిత్ర" నవల!

ఈ రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..

Rajan PTSK గారికి ధన్యవాదాలు

Friday, April 28, 2023

సోక్రటీస్ చెప్పిన 3 వడపోతల పరీక్ష

 సోక్రటీస్ చెప్పిన 3 వడపోతల పరీక్ష 




సాహితీమిత్రులారా!

సోక్రటీస్ చెప్పిన ఈ మూడు వడపోతల పరీక్ష ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా వర్తించేదే.

ఒకసారి సోక్రటీస్ దగ్గరకు అతని పరిచయస్థుడు ఒకడు వచ్చాడు. అతను వచ్చీ రావడంతోటే "ఇదిగో  సోక్రటీస్ నీకు ఈ విషయం తెలుసా! నీ స్నేహితుడి గురించి నేను ఒక మాట విన్నాను.." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. అప్పుడు సోక్రటీస్ అతడిని వారిస్తూ, "ఆగు ఆగు, ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు.. అంటూ 3 ప్రశ్నలు అడిగాడు. 

రాజన్ పి టి యస్ గారికి ధన్యవాదాలు

Sunday, April 23, 2023

కఠోపనిషత్తులో ఏముంది? యముడు - నచికేతుడు కథ

 కఠోపనిషత్తులో ఏముంది? 

యముడు - నచికేతుడు కథ 




సాహితీమిత్రులారా!

యమధర్మరాజుకీ, నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమవుతుందన్న విషయమైన జరిగిన సంవాదమే ఈ కఠోపనిషత్తు. ఈ కఠోపనిషత్తు రెండు భాగాలుగా, ఆరు అధ్యాయాలుగా ఉంటుంది. ఈ ఉపనిషత్తులో మొత్తం 119 మంత్రాలున్నాయి. శరీరమే రథం. ఆత్మే ఆ రథాన్ని అధిరోహించే రథికుడు. బుద్ధి సారథి. మనస్సు కళ్ళెం. ఇంద్రియాలే గుర్రాలు. విషయాసక్తులే ఆ గుర్రాలు పరుగు తీసే మార్గాలు.. ఇలా జీవుని గురించి చెబుతుంది ఈ ఉపనిషత్తు. అలానే పరమాత్మ అంగుష్ఠమాత్రుడై ప్రతీ జీవి హృదయంలోనూ ఉంటాడంటుంది. రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు, నాభి, మలమూత్ర ద్వారాలు, బ్రహ్మరంధ్రము ఇలా 11 ద్వారాలు గల కోట ఈ దేహమనీ, మరణసమయంలో ఈ ద్వారాలలో దేనినుండైన ఆత్మ నిష్క్రమించవచ్చనీ, అయితే ఆత్మ బ్రహ్మరంధ్రం గుండా నిష్క్రమించినప్పుడే ముక్తి లభిస్తుందనీ చెబుతుంది.   “లేవండి, మేల్కొనండి” అన్న వివేకానందుని ప్రబోధం ఈ కఠోపనిషత్తునుండే తీసుకొనబడింది. ఇక భగవద్గీతలోని కొన్ని శ్లోకాలకు ఈ కఠోపనిషత్తులోని మంత్రాలే ఆధారాలు.

ఇక ఈ ఉపనిషత్తులోని నచికేతుని కథలోకి వెళితే.. 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Thursday, April 20, 2023

రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక

 రాయలవారు మెచ్చిన పెద్దన గారి ఉత్పలమాలిక




సాహితీమిత్రులారా!

శ్రీకృష్ణదేవరాయలుచే పెద్దనగారికి స్వయంగా గండపెండేరము తొడిగించిన ఉత్పలమాలిక

ఒకసారి రాయలవారు తన సభ అయిన భువనవిజయానికి వస్తూ వస్తూ..  తనతో పాటూ ఒక బంగారపళ్ళెంలో పెట్టి ఉన్న గండపెండేరాన్ని కూడా తీసుకు వచ్చారు. సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమంగా కవిత్వం చెప్పగలిగిన కవిదిగ్గజానికి ఈ గండపెండేరాన్ని బహుమతిగా ఇస్తానన్నారట. అష్టదిగ్గజ కవులంతా తర్జనభర్జన పడుతున్నారు. అప్పుడు రాయలవారు 

“ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు బహూకరింపగ

నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో?” అన్నారట. 

అంటే.. నేను గండపెండేరాన్ని బహూకరిస్తున్నాను, తీసుకోండి అంటుంటే.. ఒక్కరూ తీసుకోరేమిటి అని అన్నమాట. రాయలవారు అన్న మాటలు ఉత్పలమాల వృత్తంలో 2 పాదాలలో ఉన్నాయి. అప్పుడు ఆంధ్రకవితాపితామహుడైన అల్లసాని పెద్దనగారు లేచి 

“పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని  నీ వెరుంగవే?

పెద్దన కీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్రుపా!” అంటూ మిగిలిన రెండు పాదాలనూ పూరించారు. 

అంటే ఓ రాజా! పెద్దన పోలిన పండితులు ఈ భూప్రపంచంలో లేరని నీకు తెలియనిదా. కనుక ఆ గండపెండేరం నాకే బహూకరించు అన్నారట. మరి అంటే సరిపోతుందా.. రాయలవారు అడిగినట్లుగా సంస్కృతాంధ్రాలలో కవిత్వాన్ని గుప్పించాలి కదా. అప్పుడు పెద్దన గారు అందుకున్నదే ఈ ఉత్పలమాలిక. ఉత్పలమాల ఛందస్సులో, పద్యంలా కేవలం నాలుగు పాదాలతో ఆపకుండా అంతకు మించి మాలికలా అల్లుకుంటూ పోయేదే ఉత్పలమాలిక. పెద్దన గారు చెప్పిన ఉత్పలమాలికేమిటో చూద్దాం.

 Rajan PTSK గారికి ధన్యవాదములు


Tuesday, April 18, 2023

కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ

 కాళిదాసు రచించిన "రఘువంశమ్" కథ




సాహితీమిత్రులారా!

కవులందరిలోకీ కాళిదాసు గొప్పవాడైతే.. కాళిదాసు రచనల్లోకెల్లా రఘువంశం గొప్పది. ఈ రఘువంశం 19 సర్గలున్న కావ్యం. ఇందులో మొత్తం 29మంది రఘవంశానికి చెందిన రాజుల చరిత్ర ఉంది. అయితే  22 చరిత్రలు విపులంగాను, ఏడుగురు రాజుల కథలు సంక్షిప్తంగానూ చెప్పాడు కాళిదాసు. 

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ"

అన్న ప్రార్థనా శ్లోకంతో రఘవంశ కావ్యాన్ని ప్రారంభించాడు కాళిదాసు. శబ్దము, అర్థము ఎలా అయితే ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొకటి ఉండలేవో అలా విడదీయరాని సంబంధం కలిగినటువంటివారును, ఈ జగత్తుకు తల్లిదండ్రులును అయినటువంటి పార్వతీపరమేశ్వరులను శబ్దార్థాల జ్ఞానం కొరకు ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక కథలోకి వెళితే..

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Saturday, April 15, 2023

షేక్స్‌పియర్ 'రోమియో జూలియట్ '

 షేక్స్‌పియర్ 'రోమియో జూలియట్ '




సాహితీమిత్రులారా!

షేక్స్‌పియర్ విషాదాంత నాటకాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధి చెందిన నాటకం రోమియో జూలియట్. ఈ రోమియో, జూలియట్‌ల పేర్లు విననివారుండరు. అంతగా ఈ రెండు పేర్లూ జనం మనసులలో మరీ ముఖ్యంగా ప్రేమికుల మనస్సులలో నాటుకుపోయాయి. అసలు ఈ నాటకంలో కథేమిటి. చివరికది విషాదాంతం ఎలా అయ్యింది.. మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం.

 Rajan PTSK గారికి ధన్యవాదాలు


Wednesday, April 12, 2023

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు

  ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు




సాహితీమిత్రులారా!

Allu Ramalingaiah (1 October 1922 – 31 July 2004) was an Indian character actor, comedian, and producer known for his works in Telugu cinema. Ramalingaiah appeared in over 1000 films in a variety of roles. He is well known for his variety of comedy punches. The famous production house Geeta Arts is his brain child. He left a legacy in the Telugu Film Industry. His son Allu Aravind is carrying his legacy. In this, extensive research based, talk show -  KiranPrabha narrated many interested anecdotes in Allu Ramalingaiah Gari 82 years of victorious life.





Sunday, April 9, 2023

ధర్మం - చట్టం - న్యాయం మధ్య తేడా ఏమిటి?

 ధర్మం - చట్టం - న్యాయం మధ్య తేడా ఏమిటి?




సాహితీమిత్రులారా!

ధర్మం, చట్టం, న్యాయం ఈ మాటల్ని మనం ఎక్కువగా వింటూనే ఉంటాం. అసలు ఈ మూడింటి మధ్యా ఉన్న సంబంధం ఏమిటి? వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఈ విషయాలను మరీ పెద్ద పెద్ద నిర్వచనాల జోలికి పోకుండా తేలికగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. గమనించండి వీడియోలో..............


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Friday, April 7, 2023

Freda Bedi, British woman fought for India Independence ఫ్రెడా బేడి

 Freda Bedi, British woman fought for India Independence  ఫ్రెడా బేడి



సాహితీమిత్రులారా!

Freda Bedi (1911 –  1977), also known as Sister Palmo  , was a British woman who was jailed in India as a supporter of Indian nationalism and was the first Western woman to take full ordination in Tibetan Buddhism. BPL Bedi and Freda Bedi gave birth to 4 kids. Famous Bollywood and international actor Kabir Bedi is one among them.  From Oxford University to Buddhist Nun via India Independence struggle, Kashmir rebuilding... Freda's life journey is redefining life at any time..!  KiranPrabha narrates highly inspiring and thought provoking events in Freda's life journey. A must to watch video..!!





Tuesday, April 4, 2023

ట్వెల్‌ఫ్త్ నైట్ - షేక్స్‌పియర్

 ట్వెల్‌ఫ్త్ నైట్ - షేక్స్‌పియర్ 




సాహితీమిత్రులారా!

షేక్స్‌పియర్ రచించిన కామెడీ నాటకాలలో ఈ ట్వెల్‌ఫ్త్ నైట్ అత్యుత్తమమైనదన్నది విమర్శకుల భావన. ట్వెల్‌ఫ్త్ నైట్ అంటే క్రిస్మస్ వేడుకలలో ఆఖరిదైన పన్నెండవ రోజు నాటి రాత్రి. ఇక కథలోకి వెళితే.. సెబాస్టియన్, వయోలా అన్నాచెల్లెళ్లు. కవలలు కావడంతో వారిద్దరూ అచ్చుగుద్దినట్లు ఒక్కలానే ఉండేవారు. తల్లిదండ్రులు మరణించడంతో ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా జీవిస్తుండేవారు. వారుండేది మెసలినా పట్టణంలో. ఒకసారి ఆ అన్నాచెల్లెళ్లిద్దరూ ఒక ఓడలో ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రావడంతో ఆ నౌక ధ్వంసమైపోయింది.  ఇద్దరూ వేరు వేరు తీరాలకు కొట్టుపోయారు. అలా వయోలా ఇలీరియా అనే పట్టణ తీరం చేరుకుంది. తన అన్న మరణించాడని భావించి పెద్ద పెట్టున ఏడ్చింది. ఆమెతో పాటూ ఒడ్డుకు చేరుకున్న ఆ ఓడ కెప్టెన్ ఆమెను ఓదార్చి అండగా నిలబడ్డాడు. తాను ఒంటరి స్త్రీనని తెలిస్తే ఆపదలు చుట్టుముడతాయని భావించిన వయోలా, పురుషవేషం వేసుకుని సిజారియో అనే పేరు పెట్టుకుంది. ఆ తరునాత కెప్టెన్ సహాయంతో ఆ నగరానికి ప్రభువైన ఆర్సినో అభిమానాన్ని సంపాదించుకుని, అతనికి అంగరక్షకుడయ్యింది. సిజారియో పురుషుడు కాదు స్త్రీ అన్న విషయం ఒక్క ఓడ కెప్టెన్‌కి తప్ప ఇంకెవరికీ తెలియదు...

ఇక వీడియోలోకి వెళదాం.......

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు


Sunday, April 2, 2023

మణిద్వీప వర్ణన

 మణిద్వీప వర్ణన




సాహితీమిత్రులారా!

ఒకసారి పార్వతీపరమేశ్వరులు హాయిగా విహరిస్తూ సరససల్లాపాలు ఆడుకుంటూ ఉండగా అమ్మవారు  అయ్యవారితో తనకోసం ఒక అందమైన భవనం కట్టించమని గోముగా అడిగింది. జగన్మాత అడిగితే జగత్పిత కాదంటాడా! పైగా భార్యంటే ఆయనకు చెప్పలేనంత ప్రేమ. దేహంలో సగభాగాన్నే భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడయిన పూర్ణపురుషుడాయన. అంతటి ప్రేమ కనుకనే, అమ్మవారు ఇలా అడిగీ అడగంగానే భవనం ఏమిటి ఒక మహా నగరమే నిర్మించి తన ప్రేమ కానుకగా ఇవ్వడానికి సంకల్పించాడు. సాక్షాత్తూ స్వామివారే రంగంలోకి దిగడంతో బ్రహ్మవిష్ణువులు, దిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, యక్ష గంధర్వ సాధ్య సిద్ధ కిన్నర కింపురుషాది సమస్త దేవతా గణాలూ బిరబిరమంటూ కదలివచ్చేశాయి. అమృత సముద్రం మధ్య భాగాన్ని నగర నిర్మాణానికి, అమ్మవారి విలాసభవనానికీ అనుకూల ప్రదేశంగా నిర్ణయించాడు పరమశివుడు. ముందుగా సుధాసముద్రం మధ్యలో ఒక విశాలమైన ద్వీపాన్ని సృష్టించాడు. అలా సదాశివ సంకల్పంతో ఉద్భవించిన మహోన్నత ద్వీపమే మణిద్వీపం. 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Thursday, March 30, 2023

క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు

 క రాజు కథలు - సింగీతం శ్రీనివాసరావు గారు




సాహితీమిత్రులారా!

సింగీతం శ్రీనివాసరావు గారు…

ఈ పేరు వినగానే కొందరికి ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు గుర్తుకువస్తాయి. ఇంకొందరికి పుష్పక విమానం, విచిత్ర సోదరులు, అమావస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు గుర్తుకువస్తే, మరికొందరికి మయూరి, పంతులమ్మలు గుర్తుకువస్తాయి. మొత్తంగా చూస్తే భారతీయ సినిమాని వైవిద్యభరితమైన మార్గాలలో కొత్తపుంతలు తొక్కించి ఘన విజయాలు అందుకున్న దిగ్దర్శకుడాయన. సింగీతం గారి సినిమాలలో గీతం, సంగీతం కూడా ఉత్తమ స్థాయిలోనే ఉంటాయి. వరుస విజయాల దర్శకుడు క్రిష్, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి ఎందరో దర్శకులకు స్ఫూర్తి మూర్తీ ‘సింగీతం’గారే. ఇప్పుడున్న పాత, కొత్తతరం దర్శకులలో సింగీతంగారితో సరిపోలే స్థాయి ఉన్నవారిని చూపించడం కొంచెం కష్టమేనేమో!

తొంభై ఏళ్ళ వయస్సు అన్నది ఆయనకు అస్సలు పట్టని విషయం. బహుశా అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ-టీవి ‘పుష్పక విమానం’ కార్యక్రమంలో ఆయన తన సినిమా సంగతులు చెప్పే విధానం చాలా ఆహ్లాదభరితంగా ఉండేది. ఆయా సినిమాలకు తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్‌ని తలచుకుంటూ, వారు తన సినిమాల విజయాలకు ఎలా భాగస్వాములయ్యారో వివరించే తీరు ఆయన వినమ్రతకు, స్వచ్ఛమైన హృదయానికి అద్దం పడుతుంది.

“మీ సినిమాలకు మీరే మాటలు రాస్తే బావుంటుంది” అని జంధ్యాల గారు నాతో చాలాసార్లు చెప్పారు. ఆయన మాటల్ని కాదనలేక “పుష్పక విమానం” తీశాను. అన్న చతురత సింగీతం గారిది. ఇటువంటి హాస్య చతురుడు కథా రచనకు పూనుకుంటే మరి ఆ కథలకు హాస్యం అంటకుండా ఎలా ఉంటుంది? ఒకలా చెప్పాలంటే ఇప్పటి సమాజం పోకడల మీద సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ఈ ‘క రాజు’ కథలు. ఇందులో 21 కథలున్నాయి. ఒక్కో కథా ఒక్కో తీరుగా చిరుమందహాసాల, మందహాసాల మార్గాలలో సాగుతుంది. ప్రతీ కథ చివరా ‘క రాజు’ తన మంత్రికి చెప్పే విషయాలన్నీ మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థ చేసుకోవడానికి ఉపయోగపడే ధర్మసూక్ష్మాలే.

జీవిత సత్యాలని తేలిక మాటల్లో చెక్కి, వాటిని హాస్యపు తొడుగులలో చుట్టి కథలుగా అచ్చేసిన పుస్తకమిది. ఈ పుస్తకం నాకు నచ్చడానికైనా, మీకూ నచ్చతుంది అనడానికైనా ఇంతకుమించి కారణమేముంటుంది!! 

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Tuesday, March 28, 2023

వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?

వాల్మీకి రామాయణానికి వచనంలో వచ్చిన ఉత్తమ తెలుగు అనువాదమేది?




సాహితీమిత్రులారా!

వాల్మీకి రామాయణాన్ని భక్తి ప్రపత్తులు కలిగిన ఎందరో పండితులు తెలుగులోకి అనువదించారు. శ్రీరామచంద్రమూర్తిని హృదయం నిండా నింపుకుని ఉండటం చేతనూ, రామకథ మీద ఉన్న అపారమైన ఆపేక్ష చేతనూ, నేను ఆ అనువాదాలలో ఎన్నింటినో చదివాను. అలా నేను చదివిన వచన అనువాదాలలో ఉత్తమస్థాయివని భావించిన వాటి వివరాలను మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్!

రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు


 

Saturday, March 25, 2023

మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?

 మద్యం అలవాటు లేనివారు

ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?




సాహితీమిత్రులారా!

మానసిక ఒత్తిడితో ఆరోగ్యం చెడగొట్టుకోవడం కంటే మద్యం సేవించడమే ఉత్తమం. కానీ మీరు ఎంచుకునే బ్రాండ్ల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ముందుగా మీరు యండమూరి, మధుబాబు బ్రాండ్లతో మొదలు పెట్టండి. ఆ రెండు బ్రాండ్లూ ముప్పై, నలభై యేళ్ళుగా చాలా రిలయబుల్ బ్రాండ్లుగా పేరుమోసినవి. చాలామంది వాటితోనే మత్తులో జోగడం మొదలు పెట్టారు. ఆ మత్తు మహత్తు తెలిశాక, ఇంకా ఎక్కువ మత్తిచ్చే వాటికోసం వెతుక్కుని మరీ వెళ్ళేవారు. అలానే కాసేపు హాయిగా ఊహాలోకాల్లో విహరించాలంటే యద్దనపూడి బ్రాండు వాడండి. అక్కడనుండి మళ్ళా ఈలోకంలో దభీమని పడాలంటే రంగనాయకమ్మ బ్రాండు పుచ్చుకోండి. కిక్కుతో పాటూ భాష కూడా రావాలంటే మల్లాది, శ్రీపాద బ్రాండ్లు వాడండి. ఇవి ఏమాత్రం కల్తీలేని అచ్చతెలుగు బ్రాండ్లు. ఇక పాతబడే కొద్దీ ఎక్కువ కిక్ ఇవ్వడానికి గురజాడ బ్రాండ్, తాగేకొద్దీ మీ రక్తం ఎరుపెక్కి పోవాలంటే శ్రీశ్రీ బ్రాండ్‌ వాడండి. ఒకవేళ ఎరుపుతో పాటూ కాసింత లాలిత్యం కూడా కావాలంటే దాశరథీ బ్రాండ్‌ వాడండి. మీరు మొదట్లోనే విశ్వనాథ, చలం వంటి బ్రాండ్ల జోలికి పోకండి. అవి చాలా కాస్ట్‌లీ బ్రాండ్లు. వాటిని ఒకసారి టేస్ట్ చూస్తే ఇక వదిలి పెట్టడం కష్టం. అంతే కాక ఆ రెండింటి టేస్ట్‌లూ పూర్తిగా డిఫరెంట్ కూడా. వాటిలో విశ్వనాథ బ్రాండ్‌కు బ్రాండ్ సమ్రాట్ అనే టాగ్ లైన్ కూడా ఉంది.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Thursday, March 23, 2023

పసుపులేటి కన్నాంబ (ప్రముఖ నటి)

 పసుపులేటి కన్నాంబ (ప్రముఖ నటి)




సాహితీమిత్రులారా!

పసుపులేటి కన్నాంబ(ప్రముఖ నటి)

గురించిన కిరణ్ ప్రభ గారి వీడియో

ఆస్వాదించండి-



Monday, March 20, 2023

ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ - షేక్స్‌పియర్

 ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ -  షేక్స్‌పియర్ 




సాహితీమిత్రులారా!

కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే ఈ నాటకం షేక్స్‌పియర్ వ్రాసిన కామెడీ నాటకాలలో మొదటిది. అచ్చం ఒకేలా ఉండే కవలలతో తికమక పుట్టించి బోలెడంత హాస్యం పండించాడు షేక్స్‌పియర్. ఆ తరువాత కాలంలో ఈ నాటకన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. హిందీలో ప్రముఖ రచయిత గుల్జార్ దర్శకత్వం వహించిన అంగూర్ చిత్రం కూడా ఈ నాటకం ఆధారంగా తీయబడిందే. ఇక కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథలోకి వెళితే.. సైరాక్యూజ్ నగరంలో ఈగియన్ అనే వర్తకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎమిలియా. వాళ్లకు కవల పిల్లలు పుట్టారు. కొడుకులిద్దరికీ ఆంటిఫోలస్ అనే పేరు పెట్టాడు ఈగియన్. అంతేకాదు వాళ్లకు సేవకులుగా ఉండడానికి మరో కవలల జంటను తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములకు కూడా డ్రోమియో అంటూ ఒక పేరే పెట్టాడు. ఇదిలా ఉండగా ఒకసారి ఈగియన్ తన కుటుంబంతో కలిసి సముద్ర ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను వచ్చింది. దానితో ఓడ కకావికలం అయిపోయింది. ఈగియన్, పెద్ద ఆంటిఫోలస్, పెద్ద డ్రోమియో ఒక దుంగ మీద, ఎమిలియా, చిన్న ఆంటిఫోలస్, చిన్న డ్రోమియో ఇంకొక దుంగ మీదా ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ అలల ఉధృతికి వాళ్ళ దారులు వేరైపోయాయి. ఈగియన్ అనేక ప్రయాసలకోర్చి తమ నగరమైన సైరాక్యూజ్ చేరుకున్నాడు. పెద్ద ఆంటిఫోలస్, అతని అనుచరుడు పెద్ద డ్రోమియో అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఒకనాడు చిన్న ఆంటిఫోలస్ తండ్రి అనుమతి తీసుకుని చిన్న డ్రోమియోతో కలిసి తన తల్లిని, అన్నను వెతకడానికి దేశాంతరం బయలుదేరాడు. అలావాళ్లు అనేక నగరాలు తిరుగుతూ తమ సోదరులను వెతకసాగారు.

రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Friday, March 17, 2023

ఎ.ఆర్. రహెమాన్ మొదటి సినిమా

 ఎ.ఆర్. రహెమాన్ మొదటి సినిమా




సాహితీమిత్రులారా!

కిరణ్ ప్రభ గారి

టాక్ షో

ఎ.ఆర్. రహెమాన్ మొదటి సినిమా

ఆస్వాదించండి- 



Wednesday, March 15, 2023

వేటూరి - కొమ్మ కొమ్మకో సన్నాయి

 వేటూరి - కొమ్మ కొమ్మకో సన్నాయి 




సాహితీమిత్రులారా!

మహదేవన్, ఇళయరాజా, రమేశ్ నాయుడు, ఎ.ఆర్.రహమాన్ మొదలైన సంగీత సరస్వతుల గురించి, విశ్వనాథ్, జంధ్యాల, బాపు, మణిరత్నం వంటి దర్శకశ్రేష్ఠుల గురించి, ఎన్టీయార్, నాగయ్య, జగ్గయ్య, రేలంగి వంటి నటరత్నాల గురించి, సముద్రాల, మల్లాది, ఆత్రేయ, దాశరథి వంటి దిగ్గజ రచయితల గురించి, ఇలా ఎందరో సినీశిఖరాలతో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా తనకున్న అనుభవాలను అక్షరాలుగా మార్చి, అందమైన పదాలుగా పొదిగి, ముద్దొచ్చే వ్యాసాలుగా మనకందించారు వేటూరి. వీటిలో అందమైన పదబంధాలున్నాయి. పాటల వెనుక సంగతులున్నాయి. “ఆహా” అనిపించే విశేషాలున్నాయి. మహామహుల జీవిత చిత్రణలున్నాయి. ఇలా ఎన్నో విశేషాలతో రాయంచ నడకల వంటి మాటల పోకడలున్న పుస్తకమే ఈ “కొమ్మకొమ్మకో సన్నాయి”.

Rajan PTSK గారికి ధన్యవాదాలు


Sunday, March 12, 2023

ఎల్.విజయలక్ష్మి ప్రముఖ నర్తకి

 ఎల్.విజయలక్ష్మి ప్రముఖ నర్తకి




సాహితీమిత్రులారా!

L. Vijayalakshmi is an Indian film actress and classical dancer whose career was in the 1960s  She appeared in Malayalam, Tamil, Kannada, Telugu and Hindi films. She quit the film industry while at the peak of her career. She got married and moved to Philippines and later settled in US.  She worked as a Director, Finance in Virginia Tech. Classical Dancer to Finance Director - L Vijalakshmi's life is a highly inspiring story. KiranPrabha explains all the details. L Vijalakshmi Gari message to the listeners is special in this talks show.





Thursday, March 9, 2023

తొలి తెలుగు సినీ గీత రచయిత - శ్రీ చందాల కేశవదాసు

 తొలి తెలుగు సినీ గీత రచయిత - 

శ్రీ చందాల కేశవదాసు




సాహితీమిత్రులారా!

ఆయన వేదవేదాంగాలు పారాయణం చెయ్యలేదు, సంస్కృతం పాఠాలు నేర్చుకోలేదు, అసలు స్కూలుకెళ్ళిన చదువే లేదు, 30  సంవత్సరాల  వరకూ రచయితే కాదు.. ఐనా స్వయంకృషితో సహజకవిగా ఎదిగారు, బహుముఖ ప్రజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. ఆయనొక కవి, హరికథా భాగవతార్, నాటక రచయిత, సినీ రచయిత, నటుడు, మూడు దశబ్దాలు పైగా భాగవత సప్తాహ నిర్వాహకుడు , ఆయుర్వేద వైద్యుడు.. అన్నింటికీ మించి అసలు సిసలు మానవతావాది..! ఆయనే తొలి తెలుగు సినీ గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆయన జీవన రేఖలు ఈ(కిరణ్ ప్రభ) టాక్ షోలో వినండి..




Tuesday, March 7, 2023

మర్చంట్ ఆఫ్ వెనిస్ - షేక్స్‌పియర్

 మర్చంట్ ఆఫ్ వెనిస్ - షేక్స్‌పియర్




సాహితీమిత్రులారా!

భారతీయ సాహిత్యంతో పాటు పాశ్చాత్య సాహిత్యం గురించి కూడా తెలుసుకుంటే, మొత్తం ప్రపంచ సాహిత్యం మీద ఒక అవగాహన వస్తుంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా ప్రసిద్ధ పాశ్చాత్య రచనలను కూడా చెప్పుకుంటూ ఉందాం. అందులో భాగంగా ఈరోజు షెక్స‌పియర్ ప్రసిద్ధ నాటకం అయిన "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలోని కథను చెప్పుకుందాం. 


రాజన్ పి టి యస్ కె గారికి ధన్యవాదాలు

Saturday, March 4, 2023

"రెండు గంగలు" కథానిక రచన శంకరమంచి సత్యం.

 "రెండు గంగలు" కథానిక 

రచన శంకరమంచి సత్యం.



సాహితీమిత్రులారా!

సత్యం శంకరమంచి "రెండు గంగలు" కథానిక 1992 సెప్టెంబరు16-22 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితం. అమరావతి కథా సంపుటి నుండి. 


కృష్ణయ్య జి.వి. గారికి ధన్యవాదాలు

Thursday, March 2, 2023

తెలుగులో తొలి విషాదాంత ప్రేమ కథ - లైలా మజ్నూ

 తెలుగులో తొలి విషాదాంత ప్రేమ కథ - 

లైలా మజ్నూ




సాహితీమిత్రులారా!

Laila Majnu is considered to be the firs tragic love story on Telugu Screen. Released on October 1, 1949 , main actors are Bhanumathi, Akkineni Nageswara Rao. KiranPrabha narrates many interesting anecdotes behind making of this film Laila Majnu.



Tuesday, February 28, 2023

ఆర్కే లక్ష్మణ్ జీవితం-కార్టూన్స్

 ఆర్కే లక్ష్మణ్ జీవితం-కార్టూన్స్ 




సాహితీమిత్రులారా!

ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు 

ఆర్కే లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా 

డాక్టర్ జి వి కృష్ణయ్య గారు రూపొందించిన 

ఆర్కే లక్ష్మణ్ జీవితము కార్టూన్స్ 

వీడియో వీక్షించండి.





Friday, February 24, 2023

కోర్టులో కాంతం (కథానిక)

కోర్టులో కాంతం (కథానిక)




సాహితీమిత్రులారా!

మునిమాణిక్యం నరసింహారావు గారి 

కథానిక "కోర్టులో  కాంతం."

Dr. gv krishnaiah గారి స్వరంతో

ఆస్వాదించండి- 



Wednesday, February 22, 2023

డా.కేశవరెడ్డి రచన - చివరి గుడిసె (నవలా పరిచయం)

 డా.కేశవరెడ్డి రచన - చివరి గుడిసె 

(నవలా పరిచయం)






సాహితీమిత్రులారా!

పుట్టుకతోనే నేరస్థులుగా ముద్రవేయబడిన యానాదుల గురించి డా.కేశవరెడ్డిగారు 1945  నేపథ్యంలో వ్రాసిన నవల. ఒంటిల్లు ఊరిబయట యానాదులకోసం గుడిసెలు వేయించి, వాళ్ళకి తలో రెండకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జిదొర. ఆ వూరి మున్సబు మణియం యానాదుల మీద దొంగకేసులు మోపి, జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు. అతడి దొర్జన్యాలను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్ళిపోతే మిగిలాడు మన్నోడు. అతడిదే ఆ 'చివరి గుడిసె'... పొలంలో ఎలుకలు పట్టమని పిలిచాడు మణియం. మన్నోడు ఆ పనిచేసి ఇంటికొచ్చేశాడు... అప్పుడు ఏం జరిగింది? బీభత్సరస ప్రథానమైన సన్నివేశాలకు కారణమేమిటి? ఆ సన్నివేశాలేమిటి? ఉత్కంఠ భరితమైన పతాకసన్నివేశం ఈ నవలకు ప్రాణం. కిరణ్ ప్రభ చేసిన ఈ నవలా విశ్లేషణ, పరిచయం వినండి.



Monday, February 20, 2023

ఫోటోగ్రఫీ పితామహుడు జార్జ్ ఈస్ట్మన్

 ఫోటోగ్రఫీ పితామహుడు జార్జ్ ఈస్ట్మన్




సాహితీమిత్రులారా!

George Eastman (July 12, 1854 – March 14, 1932) was an American entrepreneur who founded the Eastman Kodak Company and helped to bring the photographic use of roll film into the mainstream. He is considered as father of photography. He was a major philanthropist, establishing the Eastman School of Music, and schools of dentistry and medicine at the University of Rochester and in London Eastman Dental Hospital; contributing to the Rochester Institute of Technology (RIT) and the construction of several buildings at the second campus of Massachusetts Institute of Technology (MIT). KiranPrabha narrates the most inspiring life sketch of George Eastman .

కిరణ్ ప్రభ గారి ఈ వీడియో ఆస్వాదించండి-



Friday, February 17, 2023

పినిశెట్టి శ్రీరామమూర్తి (రచయిత)

 పినిశెట్టి శ్రీరామమూర్తి (రచయిత)




సాహితీమిత్రులారా!

పినిశెట్టి శ్రీరామమూర్తి (రచయిత) గారిని 

గురించిన కిరణ్ ప్రభ టాక్ షో

ఆస్వాదించండి-



Wednesday, February 15, 2023

గారడి vs మహిమలు

  గారడి vs మహిమలు




సాహితీమిత్రులారా!

 గారడి vs మహిమలు అనే

నండూరి శ్రీనివాస్ వారి

వీడియో ఆస్వాదించండి-



Monday, February 13, 2023

కథాపరిచయం - 'కోరిక - పెద్దిభొట్ల సుబ్బరామయ్య

 కథాపరిచయం - 'కోరిక - 

పెద్దిభొట్ల సుబ్బరామయ్య




సాహితీమిత్రులారా!

Peddabhotla Subbaramayya has his own unique style in Telugu short story writing. All his story touch sensitive human feelings and relationships.

పాతికేళ్ల క్రిందటి పాతసినిమా చూడాలని నాయనమ్మ కెందుకంత పట్టుదలో పదేళ్ల రాంబాబుకు అర్థం కాలేదు. తీరా ఆ సినిమాకెళ్ళిన వాళ్ళిద్దరికీ ఎదురైన అనుభవం..!!??  సున్నితమైన మనసుల్ని అతిసున్నితంగా తాకే కథ...

కిరణ్ ప్రభ గారి విశ్లేషణ  ఆస్వాదించండి-




Thursday, February 9, 2023

వ్యాసరాయలు ఎవరు?

 వ్యాసరాయలు ఎవరు?




సాహితీమిత్రులారా!

వ్యాసరాయలువారిని గురించిన

నండూరి శ్రీనివాస్ గారి వీడియో

ఆస్వాదించండి-




Tuesday, February 7, 2023

పగిలిన పచ్చికుండలు (కథ) నార్ల చిరంజీవి రచన

పగిలిన పచ్చికుండలు (కథ) 

నార్ల చిరంజీవి రచన





సాహితీమిత్రులారా!

తెలుగు కథా సాహిత్యంలో  అతి తక్కువ కథలు వ్రాసినా నాణ్యమైన రచయితగా పేరుతెచ్చుకున్న నార్ల చిరంజీవిగారు వ్రాసిన కథ ఈ 'పగిలిన పచ్చికుండలు'.  1954 ఏప్రిల్ నెల భారతి మాసపత్రికలో పచురితమైన ఈ కథ, టెక్నిక్ పరంగా అద్భుతమైన రచన. నార్ల చిరంజీవిగారు తన మనసులోని ఆర్ద్రతనంతా రంగరించి వ్రాసిన కథ. చదవడం పూర్తయ్యాక కూడా వెంటాడే కథ.  ఈ కార్యక్రమంలో కిరణ్ ప్రభ - రచయిత నేపథ్యం, కథలోని ప్రత్యేక అంశాలు, కథా విశ్లేషణతో బాటు తనదైన శైలిలో స్క్రీన్ ప్లే తరహాలో కథను వివరించారు 


Sunday, February 5, 2023

క్షమించాను - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ

 క్షమించాను - కొమ్మూరి వేణుగోపాలరావుగారు వ్రాసిన కథ




సాహితీమిత్రులారా!

అలనాటి సుప్రసిద్ధ కథా, నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావుగారు 1957  లో వ్రాసిన కథ 'క్షమించాను '. 65 సంవత్సరాల క్రిందట తన 22  సంవత్సరాల వయసులో కొమ్మూరి వేణుగోపాలరావు గారు వ్రాసిన మానసిక విశ్లేషణ అంతర్లీనంగా సాగే కథ ఇది. 35 సంవత్సరాలు కాపురం చేసిన ఓ జంట, ఆమె మరణశయ్య మీద ఉండగా అన్నేళ్ళూ తన మనసులో దాచుకున్న భావాల్ని భర్తకు చెప్పేసింది. అన్నేళ్ళు ఆయన కౄరత్వన్ని భరిస్తూ, ఆయనకు తెలీకుండానే ఆయన్ని క్షమిస్తూ జీవించానని చెప్పింది, ఆయనకదో షాక్..!! ఎలాగూ చనిపోతాను కదా అని అంత ధైర్యంగా చెప్పేసింది.. కానీ.. తర్వాతేం జరిగింది?  కొమ్మూరి వేణుగోపాలరావుగారి కథకు కిరణ్ ప్రభ కథనం, విశ్లేషణ. మనసుల్ని కదిలించే కథ, మనసుల్ని కలవరపరిచే కథ కూడా.




Friday, February 3, 2023

వంకాయతో వంద వంటలు (సీసమాలిక)

 వంకాయతో వంద వంటలు (సీసమాలిక)





సాహితీమిత్రులారా!

వంకాయతో వంద వంటలు

ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి (సీసమాలిక)

నూరవ కూర తరువాత ఎత్తు గీతి

(అంతవరకు వేచి యుందురు గాక)

గమనిక - ఈ కూరలన్నీ వంకాయతో కలిపి చేసెడివే

అల్లంబు గుప్పించ నలరించు నొకకూర (1)

      ఆలుదుంపలజేర నదియు నొకటి (2)

అరటికాయ కలిపి యందింప నొక కూర (3)

                 ఉల్లికారముతోడ నొక్కకూర (4)

ఉల్లిపాయలతోడ నుడికించి ఒక కూర (5)

శనగల జోడింప చవులు బుట్టు(6)

శనగపిండి కలుప చక్కనౌ నొకకూర (7)

పచ్చిబఠానీల పరగు కూర (😎

పచ్చిమిరపజేర్చి(9) పలుదినుసులఁజేర్చి (10)

ముద్దకూరనుజేయ ముచ్చటౌను (11)

కూరి కారము సుంత గుత్తిగా నుడికించ (12)

మెంతికారమిడగ మెచ్చు కొనగ(13)

కోరి కొబ్బరి కల్పి(14) కొత్తిమిరను దంచి (15)

జీడిపప్పు ను జేర్చి(16) జీరకమున (17)

ఎండుకొబ్బరిపొడిన్ (18), ఏలాలవంగాల (19)

ఇగురు కూర నొకటి (20) యింపుగాను

చింతపండు పులుసు నందంతనుడికించ (21)

చిక్కుడుగింజల మిక్కుటముగ (22)

వంగకాయను కాల్చి పచ్చడి గనుజేయ(23)

గుగ్గిళ్ళ జతజేసి కూర వండ(24)                                       

నూపప్పు పొడి కూర (25) నూనె వేపుడు కూర(26)

అలసంద లుడికించి(27) ఆవ పెట్టి (28)

ధని యాల కారాన (29) దంచి వెల్లుల్లితో (30)

మెంతి పెట్టిన కూర (31) మేలు చాటు (32)

పుదినాకు వేయింపు (33)పుల్లాకు తాళింపు(34)

కందికూటునకూర (35) కంది కట్టు (36)

తేటమజ్జిగ చారు (37) తీపిగుమ్మడి జోడు(38)

వాంగి బాతొక్కటి (38) వంగ బజ్జి (39)

ఆవకాయయునొప్పు(40) అనపగింజలనొప్పు(41)

ఆనపకాయతో(42) అలరునదియు

అవిశెపొడినిజల్లి(43) అవిశాకుతో కూర (44)

రామములగతోడ (45) రంజుగాను

వంగబగారాన (46) పప్పు కందులగల్పి(47)

పెసరపప్పున గూర్చ (48) పెసలలోన (49)

పెసరట్టు లోజేర్చి(50) పెసరపులుసులోన(51)

పెసరపచ్చడిలోన (52) పెరుగు నందు (53)

బీన్సు నందు న(54) సోయ బీన్సు నందు (55)

సోయపిండిని జేర్చి (56) సుండలందుకలిపి (57)

కొరివి కారమునందు (58) కోరినట్లు

పనస పొట్టునకూర (59) వరిపిండితోకూర (60)

దోసపచ్చడిలోన (61) దొండ తోడ (62)

బీరకాయలతోను (63) బెండకాయలజేర్చి (64)

తోటకూర కలిపి (65) దోరఁ వేచి (66)

దొండవేపుడులోన (67) బెండవేపుడులోన (68)

కరివేపపొడిలోన (69) కారమద్ది (70)

పన్నీరు తో కూర (71) పల్లీలతోకూర (72)

తెలగపిండిని కూర (73) తిలలకూర (74)

నవకాయ*శాకంబు (75) నవకాయ పులుసును (76)

అయిదుకాయలకూర (77) అటుల పులుసు (78)

వాముపొడినిజల్లి (79)  వార్చిన గంజితో (80)

వంగతో పులిహోర (81) పొంగలియును (82)

వంకాయ మాజిక్కు(83) వంగబజ్జీకూర (84)

వరకదంబమమర (85) వంగ చట్ని (86)

నిమ్మ రసపుపప్పు (87) నిమ్మకారములోన (88)

మామిడల్లముతోడ (89) మక్కువగను

కలిపి గోసుపువుల(90) కలిపి గోబీపూల (91)

పూని ఉప్మాకూర (92) పులుసుకూర (93)

ఎండు మామిడి తోళ్ళ (94) ఎర్రదుంపలఁ జేర్చి (95)

పచ్చిమామిడి జతన్ పప్పు (96) కూర (97)

కలిపి కారెట్టుతో (98) కనగముల్లంగితో (99)

నూలుకోల్ దుంపలన్ (100) నూరు జేర

ఆటవెలది

వంగతోడనిట్లు వండగా తగునండి

వంగ చుట్టమరయనంగనలకు

శాకరాజమిదియె శాకభుక్కులకెల్ల

చేసి చూడ రండి చెలిమి మీర

(*నవకాయ ... తొమ్మిది కాయలవంటగా వ్రతాలలో వాడుక కలదు. అందుకని వాడటమైనది)

సుప్రభ (వాట్స్ ఆప్ సందేశం ) సౌజన్యంతో

Wednesday, February 1, 2023

రామానుజుడినే అవాక్కయ్యేలా చేసిన గొల్ల మహిళ!

రామానుజుడినే అవాక్కయ్యేలా చేసిన 

గొల్ల మహిళ!



సాహితీమిత్రులారా!



విశిష్టాద్వైత సిధ్ధాంత స్థాపకులైన భగవద్రామానుజాచార్యస్వామి వారు,కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసి, అందరికీ ఆలయ ప్రవేశం కల్పించి భగవంతుడిని అర్చించే అర్హత అందరికీ ఉందని చాటిన ఆ సమతా వేత్త జీవితంలో ఒక ముఖ్యఘట్టం గురించి శ్రీ మాడభూషి శ్రీధర్ స్వామి వారు ఈ వ్యాసంలో వివరించారు.

ఒక సామాన్య గొల్ల మహిళ జగద్గురువు రామానుజుడినే తన ప్రశ్నలతో దిగ్భ్రాంతుడిని చేసింది. తమిళనాడు, తూత్తుకుడి జిల్లాలో *తామ్రపర్ణీ* నదీ తీరంలో  రామానుజ స్వామికి ఆ భక్తురాలు ఎదురైంది. 

*తిరుక్కోలూరు* దివ్యదేశ దర్శనానికి ఆయన వస్తూ ఉంటే, అక్కడినుంచి ఆమె వెళ్లిపోతూ ఉంది. ఆమె వృత్తి పెరుగు అమ్ముకోవడం. 

శిష్యగణంతో వైభవంగా వస్తున్న రామానుజుని చూసి ఆమె భక్తిపూర్వకంగా మోకాళ్లమీద వంగి నమస్కరించింది. *ఆశీర్వదించండి స్వామీ! నేను తిరుక్కోలూరునుంచి వెళ్లిపోతున్నాను* అని విన్నవించింది.  

*ఎందుకమ్మా ఇంత పవిత్ర స్థలాన్ని వదులుతున్నావు. ఒక వస్త్రాన్నే ఏఢుగురు పంచుకునేంత పేదరికం ఉన్నవారు, తిండికోసం పోరాడవలసి వచ్చే వారు కూడా తిరుక్కోలూరు వదిలిపోవడానికి ఇష్టపడరే?* అనడిగారు రామానుజులవారు.

నేనొక అల్పురాలిని. నేను ఏ గొప్ప పనిచేసానని ఈ దివ్యదేశంలో ఉండే అర్హత నాకు ఉందంటారు స్వామీ. అందుకని వెళ్లిపోతున్నాను అని జవాబిచ్చారామె. 

తాను వెళ్లడానికి 81 కారణాలు చెప్పారామె. ఆమె ప్రశ్నలు ఇవి:

అక్రూరుని వలె బలరామకృష్ణులను రాజధానికి తీసుకువెళ్లానా?

శ్రీకృష్ణుడు హస్తినకు వచ్చినపుడు విదురుని వలె మనసు విప్పి మాట్లాడానా?

శ్రీకృష్ణుడు ఆకలి అంటే మునిపత్నుల వలె శరీరాలను త్యాగం చేసానా?

సీతమ్మ వలె రావణుడిని తృణీకరించానా?

తొండమాన్ రాజువలె క్రిష్ణశర్మ కుటుంబసభ్యుల మృతశరీరాలను మళ్లీ లేపగలిగానా?

ఘంటా కర్ణుడి వలె మోక్షం కోసం శ్రీకృష్ణుడికి శవంతో విందు ఇచ్చానా?

సతీ అనసూయ వలె త్రిమూర్తులకు తల్లికాగలిగానా?

ధృవుడు అడిగినట్టు నా తండ్రి ఎవరమ్మా అని అమ్మను అడిగానా?

మునులు ఆదేశించినట్టు మూడక్షరాల గోవింద నామాన్ని జపించి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టానా?

సతీ అహల్యవలె రామపాదాన్ని తాకి శాప విముక్తురాలైనానా?

బాలికగా ఉన్నపుడే ఆండాళ్ వలె పండుకాని కాయగానే భగవంతుడిని ప్రేమించానా?

*పెరియాళ్వార్* వలె భగవంతుడే నాకు దిక్కని చెప్పి నారాయణుని దయతో మహాకవినైనానా?

*తిరుమళిశై ఆళ్వార్* వలె ఇతర మతాలను వదిలేసి శ్రీవైష్ణవం అనుసరించానా?

*తిరుమళిశైఆళ్వార్* వలె నేను అల్పురాలనని వినయంతో చెప్పుకున్నానా?

తిరుమల పర్వతాలలో ఏదో ఒక వస్తువుగా పుట్టించమని *కులశేఖరాళ్వార్* వలె ప్రార్థించానా?

విష్ణు భక్తులవలె శ్రీ కృష్ణుడే సత్య స్వరూపుడని ప్రకటించానా?

కబందునివలె శ్రీరాముని చేతిలో మరణించి సీత జాడ చెప్పి శాపవిమోచనం పొందినానా?

రావణుని బలహీన రహస్యాలను సీతకు త్రిజటవలె వివరించానా?

మండోదరి వలె శ్రీరాముడు విష్ణువు అవతారమని ముందే గమనించి రావణుడికి రాముడే భగవానుడని ధైర్యంగా చెప్పగలిగానా?

నాకు రాముడి గురించి తెలుసని విశ్వామిత్రుడివలె దశరథుడికి చెప్పానా?

మధుర కవి రాయర్ వలె గురువు గారికి భగవంతుడికి నా భక్తిని రుజువు చేసుకోగలిగానా?

దేవకీదేవి వలె పరమాత్ముడికే జన్మనిచ్చానా?

కంసునికి భయపడి శంఖ చక్రాలు దాల్చిన చతుర్భుజాలను దాచి పసిపాపగా మారాలని దేవకి వలె వాసుదేవుడిని కోరానా?

యశోద వలె గొల్లబాలుడిని పెంచినానా?

రామదండులో కోతుల వెంట ఉడుత వలె లంకకు వంతెన కట్టేందుకు వెళ్లానా?

కుచేలుడి వలె శ్రీకృష్ణుడికి అటుకులిచ్చినానా?

అగస్త్యమహాముని వలె 

శ్రీ రాముడికి ఆయుధాలివ్వగలిగానా?

సంజయుడి వలె నిగూఢరహస్య సంఘటనలను దర్శించగలిగానా?

రాజర్షి జనకుడి వలె శ్రీరాముడినే అల్లుడిగా పొందగలిగానా?

*తిరుమంగై ఆళ్వార్* వలె ముందుగా దొంగతనాలుచేసి తరువాత శ్రీమహా విష్ణువును దర్శించుకోగలిగానా?

ఆదిశేషుడివలె జనులను సూర్యుడి ప్రతాపం నుంచి లేదా వర్షాలనుంచి రక్షించే సేవ చేసానా?

గరుడుని వలె భగవంతుడిని అనేక ప్రదేశాలకు తీసుకువెళ్లగలిగానా?

ఆజన్మ బ్రహ్మరాక్షసిని విముక్తి చేయడం కోసం కైశిక చందస్సులో తాను భగవంతుడిని కీర్తిస్తూ ఒక కీర్తన పాడిన ఫలాన్ని *నంపుదువాన్* ఇచ్చినట్టు నేను ఇచ్చానా?

*పోయిగై, భూతత్తు, పేయ్ ఆళ్వార్* వలె *తిరుక్కోవళూర్* లో చిన్నస్థలాన్ని పంచుకోగలిగానా?

వాల్మీకి మహర్షిని సేవించిన భాగ్యవంతులైన ఇద్దరు రాజులు లవకుశులను పొందగలిగానా?

*తొండరడిప్పొడి*

*ఆళ్వార్*

వలె భగవంతుడికి పూల మాల పదాల మాల అనే రెండు మాలలను ఇవ్వగలిగానా?

*తిరుక్కచ్చినంబి* వలె కాంచీపురంలో వరదరాజస్వామితో నిత్యం మాట్లాడే అదృష్ఠం నాకు ఉందా?

ఆలయ అర్చకుడి భుజాల మీద కూర్చుని గర్భాలయంలోకి వచ్చిన *తిరుప్పాణి యాళ్వార్* వలె భగవంతుడిలో విలీనం అయ్యానా?

శ్రీ రామ లక్ష్మణులను విశ్వామిత్రుడివెంట పంపాలని దశరథుడికి వశిష్ఠుడు చెప్పినట్టు చెప్పగలిగానా?

*కొంగిల్ పిరాట్టి* వలె రామానుజుడికి చెప్పులు (పాదరక్షలు) ఇవ్వగలిగానా?

తిరుపతిలోని కురువపురంలో కురువనంబి వలె శ్రీవేంకటేశుడిని మట్టిపూలతో పూజించగలిగానా?

గజేంద్రుడి వలె భగవంతుడిని ఆదిమూలమైన వాడా అని ఎలుగెత్తి పిలిచానా?

మథురలో శ్రీకృష్ణుడికి *కుబ్జ* ఇచ్చినట్టు చందన గంధాలు ఇవ్వగలిగానా?

మథురలో పూలమ్ముకునే *సుధాముడు* శ్రీకృష్ణుడికి ఇచ్చినట్టు పూలు ఇచ్చినానా?

భరతుడు నీ పాదుకలు నిల్పిన చోట నేను నిలవగలిగానా?

శ్రీరాముడికి లక్ష్మణుడివలె నేనేమైనా సేవకుడినై సేవలు చేయగలిగానా?

గుహుడివలె రాముడిని గంగ దాటించగలిగానా?

సీతను కాపాడడం కోసం రావణుడితో జటాయువు వలె పోరాడినానా?

శ్రీరాముడిని చేరుకోవడానికి విభీషణుడివలె సముద్రం దాటి వెళ్లగలిగానా?

శబరివలె శ్రీరాముడికోసం తీయని పళ్లు దాచిపెట్టానా?

ప్రహ్లాదుడి వలె నారాయణుడి లేని చోటేదీ లేదని చెప్పగలిగానా?

పెరుగు అమ్ముకునే దధిభాండుని వలె కుండలో దాగిన శ్రీబాలకృష్ణుడు ఇక్కడ లేడని చెప్పినానా?

శ్రీరాముడి వలె అడవులకు పయనమైనానా?

హనుమంతుడి వలె శ్రీరాముడికి *చూచాను సీతమ్మను* అని చెప్పానా?

రెండు చేతులతో పట్టుకున్న చీరను వదిలేసి, చేతులెత్తి ద్రౌపది వలె శ్రీకృష్ణుడిని పిలిచానా?

*వడుగనంబి* వలె పెరుమాళ్ల సేవను చూడడం కన్న తనకు రామానుజుని కోసం పాలు పొంగకుండా చూసుకోవడమే ముఖ్యమని అన్నానా?

మహ్మదీయ సుల్తాన్ రాకుమారి మందిరం నుంచి చెంగుచెంగున వచ్చిన శెల్వప్ఫిళ్లై మూర్తిని రామానుజుని వలె ప్రేమతో హత్తుకున్నానా?

వృద్ధాప్యం వల్ల కదలలేకపోయిన *ఇడయత్తూర్ నంబి* వలె ఉన్నచోటకే రంగరాజుని రప్పించుకుని నిలుపుకున్నానా?

ఇద్దరు పురుషులు ఒక కోతిని రామలక్ష్మణ ఆంజనేయులనుకుని వారిని పట్టుకోవడానికి *నాథముని* వలె చాలా దూరం అన్వేషించానా?

*మారుతీ యాండాన్* వలె విష్ణుద్వేషి చోళుని మరణవార్తను శ్రీరంగంనుంచి రామానుజుడికి చేరవేసినానా?

రామానుజునితో తన సంబంధాన్ని ప్రకటించేదాకా రంగనాథుడిని చూసిన కన్నులతో మరెవరనీ చూడబోనని *కూరత్తాళ్వార్ల* వలె అన్నానా?

రామానుజ స్వామి వలె అద్వైత వాదులతో వాదించి గెలిచానా?

కేవలం వైష్ణవుడనే కారణంతో శవానికి దహన సంస్కారం చేసినందుకు మంచివారిలో చక్రవర్తి (నల్లాన్ చక్రవర్తి) అని శ్రీమన్నారాయణుడు బిరుదు ఇచ్చినపుడు నేను భగవంతుడి కరుణా సముద్రపు లోతులను చూడగలిగానా?

*ఆళవందార్* వలె భగవంతుడి ఆజ్ఞమేరకు అనంత పద్మనాభస్వామిని దర్శించుకోవడానికి వెళ్లానా?

నా ఆచార్యుడు ఆళవందార్ ను కలిసేందుకు అందరినీ వదిలేసిన దైవ వారియాందానై వలె వెళ్లిపోయానా?

తనను పొగడడం ఇష్టం లేని గురువుగారి ఆదేశం మేరకు *అముదనార్ (పెరియ కోయిల్ నంబి)* వలె అంతతిని రచించానా?

యుద్దవినాశనాన్ని తప్పించడానికి తాత *మాల్యవాన్* వలె శ్రీరాముడి పరాక్రమం గురించి రావణుడికి చెప్పానా?

గొప్ప గురువులవంటి వారు వామనుడై బలియాగశాలకు వచ్చిన

 శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి రాజ్యాన్ని దొంగలించడానికి వచ్చిన దొంగ అని వర్ణించినట్టు వర్ణించగలిగానా? 

విష్ణు భక్తులంతా సముద్రం వంటి వారనీ, వారి నామస్మరణ సముద్రఘోష అనీ *మార్నేని నంబి* గురించి *పెరియ నంబి* చెప్పినట్టు నేనుచెప్పానా?

రామానుజస్వామి స్వయంగా నారాయణుడే అని నమ్మి ఆయన చుట్టూనే తిరుగుతున్నానా?

తాను చేసిన మంత్రోపదేశాన్ని  మరెవరికీ చెప్పరాదని రామానుజునితో ఒట్టు పెట్టించుకున్న *తిరుకోష్టినంబి* వలె రామానుజునితో కఠినంగా వ్యవహరించానా?

మాటలు రాని మూగశిష్యుడి వలె నేనేమైనా రామానుజుని దివ్యాశీస్సులు పొందగలిగానా?

తొట్టియంలో భగవంతుడి అర్చారూపాన్ని కాపాడేందుకు తిరునారాయూరర్ వలె శరీరత్యాగం చేసానా?

రాజు *ఉపరిచర* వలె అన్ని జంతువులు తన వంటివేననీ కనుక అన్నింటికీ జీవించే హక్కు ఉందని విధంగా నేను ప్రకటించానా?

రామానుజునితో తిరుమల నంబి చెప్పినట్టు మొత్తం తిరుమలైలో ఎంత వెతికినా నాకన్న చిన్నవాడు కనిపించలేదని అన్నానా?

కావేరి పోటెత్తినపుడు నంపిల్లై అనే మునిని కాపాడడం కోసం పడవనుంచి దుమికి ప్రాణ త్యాగం చేసినానా?

కాశీ  రాజు సింగన్ వలె భగవంతుడిని పద్మాలతో పూజించి, పిలిచి, రప్పించగలిగానా?

*పరాశర భట్టర్* వలె వాగ్ధాటితో పండితులను గెలువగలిగానా?

*ఎంబార్* వలె పామునోట్లో చేయి పెట్టి ముల్లు తీసి దాని బాధ నివారించగలిగానా?

గుంపును చెదరగొట్టడానికి కొరడా ఝళిపిస్తుంటే ఒక భుజానికి తాకిందని మరొక భుజాన్ని కూడా కొరడాతో కొట్టమని భట్టర్ వలె చెప్పగలిగానా?

కులం వల్ల నది ఆవలి తీరాన నదీ ఘాట్ కు వెళ్లి నారాయణుని సేవలో భాగంగా భాగవారై వలె ప్రభాత వందనాలు చేయగలిగానా? 

*తిరుక్కోలూరు* దివ్యదేశంలో ఉండాలంటే ఎంతో గొప్పవారై ఉండాలని ఆమె ఉద్దేశ్యం.  

తమిళ నాట వైష్ణవ భక్తి సామ్రాజ్యానికి బాటలు వేసే అద్భుత వాక్యాలుగా ఇవి తమిళ భక్తి సాహిత్యంలో నిలిచిపోయాయి.  

       ఈ 81 వైష్ణవ రహస్యాలను వడివడిగా వినిపిస్తే రామానుజులు అవాక్కయిపోయారు. 

ఇవి నిగూఢమైన భక్తి సూత్రాలను అందరూ తెలుసుకోవలసినవని అంటారు. 

ఆమె చెప్పిన ఒక్కొక్క ప్రశ్నరూప వాక్యం ఒక్కొక్క భక్తుడి విశిష్ఠ ఘట్టానికి ప్రతీక. 

ఆమె పేరు *పెన్ పిళ్లై.* రామాయణ భారత భాగవతాలలోని అద్భుత కీలక సన్నివేశాలను అందులో ధర్మసూక్ష్మాలను వివరించే ఈ ప్రశ్నలు తమిళ వైష్ణవ సాహిత్యంలో తిరుక్కోలూర్ పెన్ పిళ్లై భక్తి రహస్యాలుగా వినుతికెక్కినాయి.

ఆమె అద్భుత జ్ఞానానికి, భక్తికి మెచ్చి రామానుజులు ఆమె ఇంటికి వెళ్లారు. తన సన్యాసి నియమాన్ని పక్కన బెట్టారు.  ఆమె వండి వడ్డిస్తే సాపాటు (భోజనం) చేసారు. ఆమెకు తీర్థప్రసాదాలు స్వయంగా ఇచ్చారు. తరువాత ఆమెకు ఉపదేశం చేసి శిష్యురాలిని చేసారు. లింగ కులభేదాలు పాటించని రామానుజుడు తన సమతా విధానాన్ని మరోసారి చాటుకున్నారు.

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*లోకా సమస్తాః సుఖినోభవన్తు!* 

రామానుజులవారి ఆచరణను అనుసరించగలిగే హృదయవైశాల్యం,స్థిరత్వ బుధ్ధి మనకూ కలిగి శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని లోకానికంతటికీ పంచగలిగేలా మన ప్రయత్నమూ,ప్రవర్తనా ఏకతాటిపై సాగింపజేసేలా మన స్వాచార్యులు మనల్ని అనుగ్రహించాలని...వారి తిరువడిగళిలో ప్రార్థిద్దాం.

(ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణమ్)

వైద్యంవేంకటేశ్వరాచార్యులు గారి సౌజన్యంతో

Monday, January 30, 2023

'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన

 'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన




సాహితీమిత్రులారా!

'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన

కిరణ్ ప్రభ గారి కథాపరిచయం

ఆస్వాదించండి-

Sivaraju Venkata Subbarao (14 June 1916 – 1967), known by his pen name Butchi Babu, was an Indian short story writer, novelist and painter known for his works in Telugu literature.

"పాపం..మురళి ఎక్కడున్నాడో..? " అంది సీతాదేవి.

ఆ మురళికోసం అన్వేషించిన కథకుడికి చివరికి దొరికిన సమాధానం అతడ్ని దిగ్భ్రమకు గురిచేసింది,  దిమ్మతిరిగిపోయింది, కళ్ళు బైర్లు కమ్మాయి..! అద్భుతమైన సస్పెన్స్ తో సాగే బుచ్చిబాబుగారి కలంనుంచీ వెలువడిన విభిన్న తరహా కథ..!!



Friday, January 27, 2023

నూట పదహార్లు (116) అనే మాట ఎలా వచ్చింది?

 నూట పదహార్లు (116) 

అనే మాట ఎలా వచ్చింది?




సాహితీమిత్రులారా!

మనకు సాహిత్యంలో గానీ, వ్యవహారంలో గానీ 100, 108, 1000 ఈ సంఖ్యలకు ప్రాధాన్యత ఎక్కువ. మన పెద్దవాళ్ళు ఎవరినైనా దీవించేటప్పుడు శతాయుష్మాన్ భవ అనో, వందేళ్లు చల్లగా బతుకనో దీవిస్తుంటారు. అలానే పూజలు, జపాలు, వ్రతాలు, ప్రదక్షిణలు మొదలైన చోట్ల 108కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక లలితా సహస్రనామం, విష్ణసహస్రనామం ఇలా 1000కి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఏ పూజారిగారికో దక్షిణో, సంభావనో ఇచ్చినప్పుడు, పెళ్లిలో చదివింపులప్పుడు మాత్రం ఈ 100, 108, 1000 ఇలా కాకుండా 116లు ఎక్కువగా ఇస్తుంటాం. కొంచెం పెద్దమొత్తంలో ఇవ్వాల్సివస్తే, 1,116లో, 10,116లో ఇలా 116 అన్నది వచ్చేలా చూసుకుంటూ ఉంటాం.  అసలీ ఈ నూట పదహార్లు ఇవ్వడం అన్నది ఎక్కడనుండి వచ్చింది? ఈ సంప్రదాయం మనకు పూర్వకాలం నుంచీ ఉందా? లేక మధ్యలో వచ్చిందా? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే మనం కాలంలో కాస్తంత వెనక్కు వెళ్లాలి. గమనించండి-



                                                                                                             Rajan PTSKగారికి ధన్యవాదాలు



Wednesday, January 25, 2023

కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రారంభ పద్యం

 కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రారంభ పద్యం 




సాహితీమిత్రులారా!



కవిరాజచంద్రుడైన కృష్ణరాయల వారు తన ఆముక్తమాల్యదను---

" శ్రీకమనీయహారమణి- చెన్నుగదానును కౌస్తుభంబునన్"

అనిఉత్పలమాలతోప్రారంభించినాడు.

(రాజ)చంద్రుని దర్శనంతో ఆనందంగ వికసిస్తుంది ఉత్పలం. 

      ఆముక్తమాల్యదను అంటే గోదాదేవిని తమిళంలో "కోదై" అంటారు. 

కోదై అంటే మాల,పూలమాల అని అర్థం. పూలబాల(గోదాదేవి)ప్రణయచరితం

పూలమాలతో- అంటే ఉత్పలమాలతో ప్రారంభించడం రాయలవారి సందర్భో

చిత పద్యప్రయోగ నైపుణ్యం కావ్యా రంభంలోనె  కనపడుతోంది.

        పూలబాల(కోదై) వరించింది నల్లనయ్యను. కనుక నీలోత్పల స్మరణం

కూడా కావ్యారంభపద్యం ఉత్పలంలో ఉంది.నీలోత్పలం మదనుని పంచ

బాణాలలో చివరిదికూడ కావడ స్మర ణీయం.

    తన ప్రియురాలును ఎదలో ప్రతిష్టించుకొన్న వేంకటభర్తను కావ్యారంభంలో

స్మరించి,వేంకటభర్తకే కావ్యాన్ని అంకిత మీయడం విశేషం.

   గోదాదేవి వేంకటభర్తకు రాసిన ప్రేమ లేఖలే ఆమె రచించిన  "నాచ్చియార్

తిరుమొళి"ఆమెప్రేమలేఖలనఫలితమన్నట్లు రాయలవారుకూడ"కోదై" కి కావ్యంలో పెళ్లిచేసి

ఆనందభరితుడైనాడు.ఆఆనందభరిత ఆముక్తమాల్యదకావ్యాన్ని ఆంధ్రులకు

అందించిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవ రాయల వారు.

                    

వైద్యంవేంకటేశ్వరాచార్యులు

Monday, January 23, 2023

అక్కినేనికి మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే?

 అక్కినేనికి మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే?




సాహితీమిత్రులారా!

అక్కినేని నాగేశ్వరరావుగారికి 

మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటే?

అనే అంశంపై కిరణ్ ప్రభ గారి టాక్ షో ఆస్వాదించండి-



Saturday, January 21, 2023

అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

 అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు




సాహితీమిత్రులారా!

అందమైన విలన్ ఆర్.నాగేశ్వరరావు

గురించిన వీడియో కిరణ్ ప్రభ గారి

టాక్ షో ఆస్వాదించండి-



Thursday, January 19, 2023

పంచ ప్రాణములు అంటే ఏమిటి? - సప్త స్వరాలు ఎలా పుట్టాయి?

 పంచ ప్రాణములు అంటే ఏమిటి? - సప్త స్వరాలు ఎలా పుట్టాయి?




సాహితీమిత్రులారా!

పంచప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నా, నా పంచ ప్రాణాలు నీవే మొదలైన మాటలు వింటుంటాం. అసలు పంచప్రాణాలు అంటే ఏమిటి?

సప్తస్వరాలైన సరిగమపదని ఎలా పుట్టాయి?

మనం మాట్లాడే వాక్కు ఎక్కడ పుడుతుంది? అలా పుట్టిన వాక్కు బయటకు వచ్చేసరికి ఎన్ని విధాలుగా మారుతుంది?

Rajan PTSKగారికి ధన్యవాదాలు

Sunday, January 15, 2023

పెద్దజియ్యర్ ఎవరు?

 పెద్దజియ్యర్ ఎవరు?




సాహితీమిత్రులారా!

పెద్దజియ్యర్ ఎవరు? వారి జీవితం- సేవలు గురించిన 

వీడియో నండూరి శ్రీనివాస్ గారి మాటల్లో



Friday, January 13, 2023

తిరువన్కూరు సోదరీమణులు లలిత, పద్మిని, రాగిణి

 తిరువన్కూరు సోదరీమణులు లలిత, 

పద్మిని, రాగిణి




సాహితీమిత్రులారా

Travancore Sisters refers to the trio of Lalitha, Padmini and Ragini who were actresses, dancers and performers in Malayalam, Tamil, Telugu, Hindi movies. Their golden period is from 1950 to 1975. They started their movie career as dancers and quickly got main roles in multiple languages. They used to act in all combinations among themselves.  Two sisters in a movie, all three sisters in a movie and individually also. Tamil, Malayalam, Hindi and Telugu language audience never forget these highly talented sisters. KiranPrabha narrates interesting movie career of these sisters.



KiranPrabha గారికి ధన్యవాదాలు

Wednesday, January 11, 2023

ఆకట్టుకొనే విధంగా మాట్లాడటం ఎలా?

 ఆకట్టుకొనే విధంగా మాట్లాడటం ఎలా?




సాహితీమిత్రులారా!

ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి మనం ఆరు లక్షణాలు అలవరచుకోవాలి. 

ఈ లక్షణాల గురించి చెప్పింది సాధారణ వ్యక్తికాదు, మహావ్యాకరణ శాస్త్రవేత్త అయిన 

పాణిని మహర్షి. ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే..

మాధుర్య మక్షరవ్యక్తిః పదచ్ఛేదస్తు సుస్వరః

ధైర్యం లయ సమర్థంచ షడేతే పాఠకాగుణాః

ఆ ఆరు లక్షణాలలో ఒక్కొక్కదాని కోసం చెప్పుకుందాం.



Rajan PTSK గారికి ధన్యవాదాలు

Monday, January 9, 2023

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు? ఏం చేస్తే కనపడతాడు?

 దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు? 

ఏం చేస్తే కనపడతాడు?





సాహితీమిత్రులారా!


దేవుడు మన కళ్ళకు…ఎందుకు కనబడడు….? ఏం చేస్తే కనపడతాడు?

మన బతుకు అంతా ఐదు అంశాల మీదే ఆధారపడి వుంది.వాటిని వదిలేస్తే దేవుడిని చూడవచ్చు.....ఇంకా లోతుగా చెప్పాలంటే ఇలా వుంది ఆ వ్యవస్థ 

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం.

అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…, వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. 

ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.!

వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ!

అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

జలమునకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటిని మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే. 

ముఖపుస్తకం నుండి.....


Friday, January 6, 2023

కథా రచయిత, సినీ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే

 కథా రచయిత, సినీ కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే




సాహితీమిత్రులారా!

మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా.గోఖలే) తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు. 64 సంవత్సరాల జీవితంలో సగభాగం తెలుగు సినిమారంగంలోనే గడిచింది. సినిమాల్లోకి రాక ముందే గోఖలేగారు అద్భుతమైన చిత్రకారుడు, కథా రచయిత. తెలుగు కథా రంగంలో ఆయన వ్రాసిన కథలు అత్యంత విలక్షణమైనవి. Famous telugu play back singer Madhavapeddi Satyma is own brother of Maa. Gokhale.

 KiranPrabha narrated Sri Gokhale's life story and his film life in this episode.




Wednesday, January 4, 2023

పుట్టాకా ఏడవలేదు పాలు త్రాగలేదు - ప్రాణం ఉన్న బొమ్మ

 పుట్టాకా ఏడవలేదు పాలు త్రాగలేదు - 

ప్రాణం ఉన్న బొమ్మ




సాహితీమిత్రులారా!

పుట్టాకా ఏడవలేదు పాలు త్రాగలేదు - ప్రాణం ఉన్న బొమ్మ

అనే నమ్మాళ్వార్ లేక శఠారి గురించి విషయం గురించిన

నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఆస్వాదించండి-



Monday, January 2, 2023

ఈయనే లేకపోతే ధనుర్మాసమే లేదు

 ఈయనే లేకపోతే ధనుర్మాసమే లేదు




సాహితీమిత్రులారా!

ఈయనే లేకపోతే ధనుర్మాసమే లేదు

ఎవరాయన ఏమిటావిషయం

నండూరి శ్రీనివాస్ గారి మాటల్లో

ఆస్వాదించండి-