Showing posts with label పద్యానుకరణ. Show all posts
Showing posts with label పద్యానుకరణ. Show all posts

Thursday, April 28, 2016

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు......


ఎవ్వాని వాకిట నిభమద పంకంబు......


సాహితీమిత్రులారా!

ఈపద్యం ఆంధ్రమహాభారతం విరాటపర్వం(2-191)లో తిక్కనసోమయాజి రచించినది.
ద్రౌపది ధర్మరాజు గొప్పదనాన్ని చెబుతున్న సందర్భంలోనిది.

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు 
          రాజభూషణ రజోరాజినడఁగు
నెవ్వాని చారిత్ర మెల్లలోకములకు
           నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
నెవ్వాని కడగంట నివ్వటిల్లెడి చూడ్కి
           మానిత సంపదలీనుచుండు
నెవ్వాని గుణలత లేడు వారాసుల
           కడపటికొండనైఁ గలయఁబ్రాఁకు
నతఁడు భూరిప్రతాప మహాప్రదీప
దూరవిఘటిత గర్వంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుఁడు గేవల మర్త్యుండె ధర్మసుతుడు

పై పద్యాన్ని అనుకరిస్తూ ఉన్నట్లున్న పద్యం
తారాతోరణము అవతారికలో కరుణశ్రీ
వెలయించిన పద్యం ఇది తిలకించండి.

ఎవ్వాని గళములో నువ్వుకొన్నది నంద 
        నారామ మధర మందార వల్లి
ఎవ్వాని కలములో నివ్వటిల్లెను విశ్వ
        భారతీ మంజుల మంజీర రవము
ఎవ్వాని చెలిమిలో నివ్వాళు లెత్తెను
        పర్దాలు లేని సౌర్ద లక్ష్మి
ఎవ్వాని కలిమిలో పవ్వళించెను సుప్త
       గుప్తదాన వ్రత ప్రాప్తతృప్తి
అతడు నండూరి వంశపయ పయోధి
చంద్రముడు రామకృష్ణమాచార్యసుకవి
గద్యపద్యతారాతోరణాద్యనేక

కావ్యనిర్మణచాతురీ సవ్యసాచి