Showing posts with label కాశీమజిలీ కథలు. Show all posts
Showing posts with label కాశీమజిలీ కథలు. Show all posts

Saturday, October 22, 2022

కాశీమజిలీ కథలు 4 - శూరసేన మహారాజు కథ - కృష్ణదేవరాయల జనన కథ

 కాశీమజిలీ కథలు 4 - శూరసేన మహారాజు కథ - కృష్ణదేవరాయల జనన కథ




సాహితీమిత్రులారా!

క్రిందటి భాగంలో మణిసిద్ధుడు కోటప్పకు కాశీమహిమ కోసం చెబుతూ, అందులో అంతర కథగా అగస్త్యుడు తన భార్య లోపాముద్రకు చెప్పిన శివశర్మ కథను చెప్పడం, ఆ తరువాత కోటప్ప మణిసిద్ధునితో కాశీప్రయాణానికి సిద్ధపడటం, కానీ తనకు కాశీవెళ్ళే దారిలో ఏ విషయం మీద సందేహం వచ్చినా ఆ వివరం చెప్పాలని షరతు విధించడం, ఆ తరువాత వాళ్ళు మొదటి మజిలీకి చేరుకోవడం, వంటకు కట్టెలు తేవడానికి  వెళ్ళిన కోటప్ప ఆకాశంలో వెళుతున్న కీలురథాన్ని చూసి, దాని కథ చెప్పమని మణిసిద్ధుడిని అడగటం, సిద్ధుడు ఇచ్చిన మణి ప్రభావం వల్ల మణిసిద్ధుడికి ఆ కీలు రథం చరిత్రంతా తెలిసి, అది కోటప్పకు చెప్పడానికి సిద్ధపడటం వరకూ కథను చెప్పుకున్నాం. ఇప్పుడు మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన శూరసేన మహారాజు కథను చెప్పుకుందాం. 

RajanPTSK గారికి ధన్యవాదాలు

Tuesday, October 18, 2022

కాశీమజిలీ కథలు 3 - అగస్త్యుడు చెప్పిన శివశర్మ కథ

 కాశీమజిలీ కథలు 3 - అగస్త్యుడు చెప్పిన శివశర్మ కథ




సాహితీమిత్రులారా!

క్రితం భాగంలో మనం వింధ్యపర్వత గర్వాన్ని అణచి, లోకాలను కాపాడిన అగస్త్యులవారి కథను చెప్పుకున్నాం. ఆ తరువాత అగస్త్యులవారు భార్యా సమేతంగా దక్షిణదేశ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ శ్రీశైలం వెళ్ళడం, అక్కడ లోపాముద్రాదేవి… శిఖర దర్శనమాత్రం చేత ముక్తినిచ్చే శ్రీశైలం కన్నా,  మరణిస్తేనే ముక్తినిచ్చే కాశీ ఏవిధంగా గొప్పదని అడగడం. అందుకు అగస్త్యులవారు కాశీ గొప్పతనాన్ని తెలియజేసే శివశర్మ కథ చెప్పడానికి సిద్ధమవడం వరకూ కథ చెప్పుకున్నాం. ఇప్పుడు అగస్త్యుల వారు చెప్పిన శివశర్మ కథలోకి ప్రవేశిద్దాం.


రాజన్ పి.టి.యస్.కె గారికి ధన్యవాదాలు

Friday, October 14, 2022

కాశీమజిలీ కథలు 2- అగస్త్యుడు - వింధ్యపర్వతం

 కాశీమజిలీ కథలు 2- అగస్త్యుడు - వింధ్యపర్వతం




సాహితీమిత్రులారా!

క్రితంభాగంలో మనం మణిసిద్ధుడి వృత్తాంతం, ఒక సిద్ధుడి ఉపదేశానుసారం అతను కాశీప్రయాణానికి సిద్ధమవడం. తనతో కాశీకి రావలసినదిగా ఒక పశువుల కాపరిని అడగటం. అందుకు అతగాడు కాశీ గొప్పతనం గురించి తనకు చెప్పమనీ, అది తనకు నచ్చితేనే వస్తాననడం. సరేనన్న మణిసిద్ధుడు కథ చెప్పడానికి ఉద్యుక్తుడవడం, వరకూ కథ చెప్పుకున్నాం. ఈరోజు మణిసిద్ధుడు ఆ గొల్లవానితో చెప్పిన కాశీ మహిమను గురించిన కథ చెప్పుకుందాం.


RajanPTSK గారికి ధన్యవాదాలు

Wednesday, October 12, 2022

కాశీమజిలీ కథలు 1 - మణిసిద్ధుని కథ

 కాశీమజిలీ కథలు 1 - మణిసిద్ధుని కథ 




సాహితీమిత్రులారా!

కథల్లో కాశీమజిలీ కథల అందం వేరు. ఈ కథల రచయిత మధిర సుబ్బన్న దీక్షిత కవి గారు. నిజానికి  వివిధ ప్రాంతలలో జానపదులు చెప్పుకునే కాశీమజిలీ కథలను పోగేసి, వాటికి మరిన్ని కల్పనలు జోడించి, వాటన్నింటినీ కలిపి 12 సంపుటాలుగా తీసుకు వచ్చారు సుబ్బన్న దీక్షితులు గారు. ఈ విషయాన్ని క్రీ.శ. 1900లో అచ్చయిన తమ “కాశీమజిలీ కథలు” మొదటి సంపుటి పీఠికలో ఆయనే చెప్పుకొచ్చారు. అంటే మొదటి సంపుటి అచ్చయ్యి ఇప్పటికి 120 సంవత్సరాల పైమాటే అన్నమాట. అప్పటి పుస్తక భాష గ్రాంథికం కనుక, అది ఇప్పటి తరంలో అందరికీ అర్థమయ్యే అవకాశం చాలా తక్కువ కనుక, సరళమైన భాషలో, కథలో ఎటువంటి మార్పులూ చెయ్యకుండా, కుదిరినప్పుడల్లా, ఒక్కో కథా చెప్పుకుంటూ వెళతాను. 

గుణనిధి అనే బ్రాహ్మణుడు మణిసిద్ధునిగా మారి, కోటప్ప అనే ఒక గొల్లపిల్లవాడిని వెంటబెట్టుకుని 360 మజిలీలతో కాశీ పట్టణాన్ని చేరుకుంటాడు. ఆ మజిలీలలో మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన కథలే ఈ కాశీమజిలీ కథలు. అద్భుతమైన కల్పనలు, మోతాదు మించని శృంగారం, కడపుబ్బా నవ్వించే హాస్యం, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసే నాయికానాయకుల బుద్ధిచాతుర్యం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు, ఇలా ఒకటేమిటి, నవరసాలూ మేళవించబడిన కథలివి.  ఇంతమంచి కథలను మనకు అందించిన మధిర సుబ్బన్న దీక్షిత కవి గారికి నమస్కరించుకుంటూ… మనం కూడా కాశీమజిలీయాత్ర మొదలు పెడదాం.

రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు