Thursday, October 20, 2016

రాజ దర్శనం చేయించిన పద్యం


రాజ దర్శనం చేయించిన పద్యం



సాహితీమిత్రులారా!


గౌడ డిండిమభట్టును ఓడించటానికి వెళ్ళిన శ్రీనాథునికి
ప్రౌఢదేవరాయలవారి దర్శనమే దొరకటం కష్టమైంది.
ఎన్నో ప్రయత్నాలు చేసిచేసి విసిగివేసారి ఏమిచెయ్యాలో
దిక్కుతోచక ఆలోచించగా ఆలోచించగా చివరకు
ఒక వెలుగురేఖ తోచింది.
ఎవరో ఒకరిద్వారా ఈ క్రింది సవాలు పద్యం రాజుగారికి చేర్చగలిగాడు.
అదే రాజదర్శనానికి మార్గమయింది కలిగించింది.
ఆ పద్యం-

డంబు సూపి ధరాతలంబుపై దిరుగాడు కవిమీద గాని నా కవచమేయ
దుష్ప్రయోగంబులు దొరకొని చెప్పెడు కవి శిరస్సున గాని కాలు చాప
సంగీత సాహిత్య సరస విద్యలు నేర్పు కవుల రొమ్ములు గాని కాల్చి విడువ
చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు కవి నోరు గాని వ్రక్కలు గదన్న
దంట కవులకు బలులైన యింటి మగడ
కవుల వాదంబు వినవేడ్క గల్గెనేని
నన్ను బిలిపింపు మాస్థాన సన్నిధికిని
లక్షణోపేంద్ర!  ప్రౌఢరాయక్షితీంద్ర!

చివరి అస్త్రంగా ప్రయోగించాడు విజయం పొందాడు
డిండిమభట్టు కంచు ఢక్కను పగులగొట్టించాడు
కవిసార్వభౌమ - బిరుదాన్ని కైవశం చేసుకున్నాడు.

No comments:

Post a Comment