Showing posts with label నిందాస్తుతి. Show all posts
Showing posts with label నిందాస్తుతి. Show all posts

Thursday, June 16, 2016

లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?


లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?


సాహితీమిత్రులారా!

మద్దుపల్లి వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు
వేంకటేశ్వరునిపై చేసిన నిందాస్తుతి పద్యం చూడండి.

కడు నాపత్తున నుండి కావుమని మ్రొక్రన్ నిల్వుదోపించు - పే
ర్వడగా కొండలపాలుసేయు - దరిచేరన్ బోడికొట్టించుచుం
డెడుగా - తిర్పతి వేంకటేశ్వరుడు! కానీ యింత గావించినన్
చెడువాడందురె లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?

ఆపదలో నిలువుదోపిడి - కొండను కాలినడక - బోడి కొట్టించుకొనుట-
ఇవి మ్రొక్కులు ఈ పనులు వేంకటేశ్వరుని చేష్టలుగా చెప్పి -
డబ్బున్నవాడు చేసిన చెడ్డపనులనుగూడ గొప్పగా చెప్పుకొంటారు.
ధనవంతుని తప్పులు కనిపించవులే -
అని
శాస్త్రిగారు నిందాపూర్వక స్తుతి చేస్తున్నారు.