Showing posts with label పాశురాలు. Show all posts
Showing posts with label పాశురాలు. Show all posts

Tuesday, December 20, 2016

గోదాదేవి మేఘసందేశం


గోదాదేవి మేఘసందేశం




సాహితీమిత్రులారా!



సందేశాలు ఒక్కొక్కరు ఒక్కొకదానితో పంపించారు.
నలుడు హంసతో పంపాడు. బుద్ధజాతక కథల్లో
కామవిలాప జాతకకథలో భర్త భార్యకు వాయసం
ద్వారా సందేశం పంపిస్తాడు. అలాగే
దక్షింణభారతదేశ వైష్ణవుల దివ్యప్రబంధాల్లో ,
ప్రియుడైన వేంకటేశ్వరునకు గోదాదేవి మేఘం
ద్వారా పంపిన సందేశం ఇది చూడండి-

మిన్నా గత్తె  ళ గిన్ఱ వేగజ్గాళ్ వేఙ్గిడత్తు
త్తన్నా గ తిరుమంగె తఙ్గియ శీర్ మార్వఱ్కు
ఎన్నాగత్తిళజ్కోవిరిమ్బిత్తామ్  నాళ్ తోఱుమ్
పొన్నాగమ్ పుల్ గుదుర్క ఎన్ పురిపుడైమై శెప్పమినే
                               (ఆళ్వారుల మంగళాశాసన పాశురాలు - పుట 143)

విద్యుల్లతలతో కూడి యుండు ఓ మేఘములారా!
నూతనముగా అభివృద్ధి యగుచుండు నా కుచముల
యందాసపడి నన్ను గాఢాలింగనము చేసుకొనుగాక యని
ఎల్లపుడు ఆశపడుచున్నాను. ఈ విషయమును
వేంకటాచలమున వేంచేసి ఉన్న స్వామియగు
శ్రియఃపతికి విన్నవింపుడని గోదాదేవి మేఘములను
ప్రార్థించెను - అని భావం.