Showing posts with label పూరణ. Show all posts
Showing posts with label పూరణ. Show all posts

Wednesday, May 4, 2016

రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్


రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్


సాహితీమిత్రులారా!

పోతన భాగవతంలో గజేంద్ర మోక్షణం రాసే సందర్భంలో
"అలవైకుంఠపురంబులో" - అనే పద్యం రాస్తూరాస్తూ
మధ్యలో విడిచి ఆలోచనకోసం బయటికి వెళ్ళగా అది
శ్రీరామచంద్రుడే పూర్తిచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

అలాగే పెద్దనకు సంబంధించి ఒక కథ వుంది.
అది చూద్దాం.
ఒకనాడు పెద్దన
ఈ క్రింది పద్యం రాయడం మొదలు పెట్టాడు.

మృదు తల్పంబు వికారలీలదిగి ధమ్మిల్లంబుఁ జేబూని రా
గద దృగ్జాలముతోడఁ గౌనునులి యూఁగన్మోము మార్వెట్టుచున్
వదలం జాఱిన నీవిఁబట్టుకొని యావామాక్షి యట్లేఁగెఁ......

అని అంతవరకు రాసి ఆపై ఎలాముగించాలో స్ఫురించక తాటాకు,
గంటాన్ని అక్కడ పెట్టి బైటకు వెళ్ళాడట.
పెద్దనగారి కూతురు ఆ   అసంపూర్ణ పద్యాన్ని చదివి
ఇలా పూరించిందట.
                                                                           " స
త్సదన భ్రాజిత రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్"

తిరిగి వచ్చిన పెద్దన తాను పూరించ దలచిన దానికంటె
ఈ పూరింపు రసవంతంగ ఉన్నదని దానినలాగే ఉంచాడట.
"ఆంధ్రకవితా పితామహు"ని పుత్రిక పండిత పుత్రిక కాకపోవడమా!