Wednesday, October 19, 2016

రవికాననిచో కవిగాంచునే గదా!


రవికాననిచో కవిగాంచునే గదా!



సాహితీమిత్రులారా!




రాయలవారి భువనవిజయంలో ఇచ్చిన సమస్య
రవికాననిచో కవిగాంచునే గదా!

భట్టుమూర్తి పూరణ చూడండి-
ఆ రవి వీరభద్రు చరణాహతిడుల్లిన బోసి నోటికిన్
నేరడు రామలింగ కవి నేరిచెబో మన ముక్కుతిమ్మన
క్రూరపదాహతిన్ దెగిన కొక్కెర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియించె నౌర! రవి కాననిచో కవి కాంచునే గదా!

దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది.
అదేమంటే ఒకరోజు తెనాలి రామలింగ(కృష్ణ)కవి
ముక్కుతిమ్మన ఇంటికి వెళ్ళిన సమయంలో
ముక్కుతిమ్మన ఉయ్యెలలో కూర్చొని ఊగుతున్నాడట.
రామలింగకవి "తాతా ఊతునా?" అని అడిగాడట.
దానికి తిమ్మనగారు సరేనన్నారు. కాని రామలింగడు
తాంబూలము వేసికొన్నవాడు వెంటనే తిమ్మన పై ఉమిచాడట.
 దానితో తిమ్మనకు కోపం వచ్చి ఊగుతున్న ఊయలనుండి
అలాగే కాలితో ఒక్కతన్ను తన్నాడట దానితో రామలింనికి పన్ను
ఊడిందట అది ఎవరికీ తెలియకుండా వెంటనే దుప్పికొమ్ముతో
పన్ను చేయించుకొని పెట్టుకొని రాజసభకు వచ్చాడట.
ఈ కథంతా దూరంనుండి గమనించిన భట్టుమూర్తి
సమస్యపూరణలో గుట్టురట్టు చేశాడు.

దక్షయజ్ఞంలో పూష- అనే సూర్యుని వీరభద్రుడు 
దంతాలుడేట్లు కొట్టాడు. అదే విధంగా రామలింగకవికి 
తిమ్మనగారు దంతమూడేవిధంగా క్రూరమైన తనపాదంతో తన్నాడు 
దానితో తెనాలి రామలింగకవికి దుప్పికొమ్ము పన్నైనదని, 
రవి చూడకపోయినా కవి చూడగలడని పూరణలోని భావం.

No comments:

Post a Comment