Showing posts with label కురుక్షేత్రం - అంతరించిన తరాలు. Show all posts
Showing posts with label కురుక్షేత్రం - అంతరించిన తరాలు. Show all posts

Tuesday, April 26, 2016

కురుక్షేత్రం - అంతరించిన తరాలు

కురుక్షేత్రం - అంతరించిన తరాలు


సాహితీమిత్రులారా!

మహాభారతకాలంనాటి మానవుల ఆయు: ప్రమాణం కంటే నేటి మానవ జీవన ప్రమాణం స్వల్పమైనది.
నాటి ప్రజల్లో కొందరైనా దాదాపు 200 సంవత్సరాలు జీవించినట్లు దాఖలాలున్నాయి. అంతేకాదు
ఆనాటివారికి రమారమి 80 లేక 90 సంవత్సరాలు పైబడే యౌవనం నిత్యకల్యాణం పచ్చతోరణంలా
ఉండినట్లు తెలుస్తోంది. భారతంలోని లెక్కలను బట్టి యుద్ధంనాటికి ధర్మరాజు వయసు 72 ఏండ్లుంటే మరి పితామహుడైన భీష్మునికి వయసెంత, భీష్ముని చిన్నాన్న బాహ్లికుని వయసెంత దాదాపు 150 - 200 సంవత్సరాల మధ్య ఉండి ఉండవచ్చుకదా!
ఈ కురుక్షేత్రయుద్ధంలో అక్షరాలా ఐదు తరాలు అంతరించాయి. గమనించండి.
1. ధృతరాష్ట్రుడు, తనసోదరులు ((భూరిశ్రవుడు, మొ....... సోమదత్తుని కొడుకులు)
2. ధృతరాష్ట్రుడుని పెదనాన్న భీష్ముడు,సోమదత్తుడు(భీష్ముని సోదరుడు)
3. ధృతరాష్ట్రుడుని తాత( భీష్ముని చిన్నాన్న బాహ్లికుడు)
4. ధృతరాష్ట్రుని కొడుకులు (కౌరవులు)
5. ధృతరాష్ట్రుని మనుమలు (లక్ష్మణుడు, అభిమన్యుడు,ఘటోత్కచుడు....)
తనసోదరులు, తండ్రి, తాత, కొడుకులు, మనుమలు

ఈ యుద్ధం 500 చదరపు మైళ్ళలో జరిగింది. కావున శాంతిమంత్రమే ప్రపంచసౌభాగ్యానికి బలమైన ఆయుధం.