Showing posts with label భేతాళ కథలు. Show all posts
Showing posts with label భేతాళ కథలు. Show all posts

Friday, October 28, 2022

భేతాళ కథలు - 1వ భాగం - వజ్రముకుటుని కథ

 భేతాళ కథలు - 1వ భాగం - వజ్రముకుటుని కథ




సాహితీమిత్రులారా!

ఈ భేతాళ కథలు గుణాఢ్యుడనే కవి రచించిన బృహత్కథలోనివి. ఈ బృహత్కథ సుమారు 2000 సంవత్సరాల క్రితం పైశాచీ ప్రాకృత భాషలో రాయబడింది. ఆ తరువాత 1000 సంవత్సరాలకు సోమదేవసూరి అనే కవి బృహత్కథలో కొంతభాగాన్ని కథాసరిత్సాగరం అన్న పేరుతో సంస్కృతంలో రాశాడు. అటుపై ఎంతోమంది రచయితలు వీటిని తెలుగులోకి అనువదించారు. మనకు చందమామ పత్రిలో కూడా భేతాళ కథలు ధారావాహికగా వచ్చేవి. కాకపోతే అవన్నీ కల్పిత కథలే. అంటే గుణాఢ్యుని కథలు కాదన్న మాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి మాత్రం 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన అసలైన భేతాళ కథలు. భేతాళ కథల్లో కనబడే రాజని మనం విక్రమార్కుడిగా చాలా చోట్ల చదువుకున్నాం కానీ.. నిజానికి మూలం ప్రకారం ఆ రాజు పేరు త్రివిక్రమసేనుడు. ఇక మనం “భేతాళపంచవింశతి”గా పిలవబడే భేతాళ కథల్లోకి ప్రవేశిద్దాం. 

 Rajan PTSK గారికి ధన్యవాదాలు