Sunday, October 30, 2016

తమ భార్యలను వదలి పరస్త్రీలను కోరడమా!


తమ భార్యలను వదలి పరస్త్రీలను కోరడమా!



సాహితీమిత్రులారా!





చింతలపూడి ఎల్లన(రాధామాధవకవి) 
తెనిగించిన బ్రహ్మరాజీయంలోనిది ఈ పద్యం.

అమరాధీశుడు స్వర్గమేలడె యహల్యాజారుడయ్యున్ శుచి
త్వము తోడం బందార సంగమము విద్వాంసుల్ని వారింపుటల్
తమ భార్యల్ని యమస్థులై సతతలీలాహీనులం బాయు దో
సములం దోసమలుంచు నేనెరుగనే సందేహమింకేటికిన్

ఒక బ్రాహ్మణుడు పతితుడై దేశసంచారంలో
ఒక బోయదాన్ని మోహించి ఆమెతో
పరదారాసంగమం తప్పుకాదు అని ఈ పద్యం చెప్పాడు.

పూర్వం ఇంద్రుడు గౌతమపత్ని అహల్యతో
వ్యభిచరించి స్వర్గాన్ని పాలించలేదా
పండితులు, ఎప్పుడూ నియమనిష్టలలో
మునిగి, శృంగార విలాసాలకు దూరంగా
ఉండే తమను తమ భార్యలు వదలి ఇతరుల
పొందుకోరతారేమో? అనే భయంతో
పరస్త్రీ సంగమమం పాపమనే నియమం
కల్పించారు అని నాకు తెలుసు. ఇందులో
అనుమానం లేదు - అని పద్యభావం.

No comments:

Post a Comment