Monday, October 31, 2016

భ్రమరకీటన్యాయరీతిన్ పురిన్


భ్రమరకీటన్యాయరీతిన్ పురిన్



సాహితీమిత్రులారా!


పాండురంగమహాత్మ్యంలో కాశీలో మరణించిన
వారికి పరమశివుడు ఏలాగు చూస్తాడనే విషయం
ఈ పద్యంలో చెప్పబడింది చూడండి -

ప్రాలేయాచలకన్యకావదన శుంభత్పద్మ సౌరభ్యముం
గ్రోలంగల్గియు తుష్టిలేక ముహృత్కోడాబ్జ, సౌగంధ్యలీ
లాలిత్యమ్మును గోరునొక్క సితరోలంబంబు నైజాకృతిన్ 
దాలొంగించు పరాసులన్ భ్రమరకీటన్యాయరీతిన్ పురిన్

పార్వతీముఖపద్మసౌరభమును గ్రోలుచూకూడ తృప్తిచెందక
మునులహృదయపద్మముల సౌగంధమును కోరుకొనుచు
నొకానొక తెల్లతుమ్మెద, ఆ పురి(కాశి)లో కాయము
దొరగిన(విడిచిన)వారిని భ్రమరకీటక న్యాయవైఖరితో
తన ఆకృతి కలిగింపచేయునట, భ్రమరము నిరంతర
భ్రమణ, ఝుంకారములతో కీటకమును తనరూపు
వలె ఎట్లుమార్చునో అట్లే పరమేశ్వరుడును కాశిలో
మరణించినవారికి సారూప్యము నిచ్చును - అని భావం

No comments:

Post a Comment