Showing posts with label మన ఇతిహాసాల్లో. Show all posts
Showing posts with label మన ఇతిహాసాల్లో. Show all posts

Wednesday, February 14, 2018

ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి


ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి




సాహితీమిత్రులారా!


ఒకానొక అవధానంలో వేలూరి శివరామశాస్త్రిగారిని
ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి
ఎలా వున్నదో వర్ణించమన్నారట- దాని ఆయన
వర్ణించిన సీసపద్యం చూడండి-

తొడలుదాటించుచూదూకు దుశ్శాసనుఁ
         జంపగల్గియును సంశయమునొంది
తగునిదియను సుయోధనుఁ బట్టి చంపగఁ
         జేవగల్గియుఁ దర్మచింతజేసి
కర్ణకఠోరత కలిగించు కర్ణుని 
         మ్రదిపఁగలిగియు మానవలసి
సకలదుశ్శకుని శకునిఁని జంపఁగఁ
         జాలియుఁ గాలదొష్ట్యమునఁదేసి
ఊరకున్నారు భూపాలహీరమణులు
పాండవేయులు ద్రోవదిఁ బట్టినాఁడు
వలువలొలువంగఁబూనిన తులువపలువ
సేఁతలుంజూచి ధర్మవిశేషమెఱిఁగి

ఆసమయంలో పాండవుల మనోభావాలను
కళ్ళకు కట్టినట్లు వర్ణించాడుకదా

Wednesday, December 20, 2017

బ్రహ్మ దేహం నుండి పుట్టినవారు


బ్రహ్మ దేహం నుండి పుట్టినవారు




సాహితీమిత్రులారా!


బ్రహ్మ నుండి ఒక్కొక్క భాగంనుండి
కొందరు ఉద్భవించారు గమనించండి-

దేహభాగం నుండి - స్వాయంభువ మనువు
                                - శతరూప

నీడనుండి             - కర్ధమప్రజాపతి

అపానం నుండి    - నిరృతి

ముఖం నుండి     - సరస్వతి, అంగిరసుడు

చెవుల నుండి      - పులస్త్యుడు

కన్నుల నుండి     - అత్రి

మనస్సు నుండి    - మరీచి

ప్రాణం నుండి     - వశిష్ఠుడు

చేతి నుండి        - క్రతువు

చర్మము నుండి     - భృగువు

నాభి నుండి        - పులహుడు

తొడ నుండి        - నారదుడు

బొటనవ్రేలి నుండి   - దక్షుడు

భృకుటి నుండి      - నీలలోహితుడు అనే రుద్రుడు

దివ్యదృష్టితో         - సనత్సుజాతుడు, సనత్కుమారుడు
                                    సనందుడు, సనకుడు

(మహాభాగవతం నుండి---)

Tuesday, November 14, 2017

ధృతరాష్ట్రునికి భార్యలెందరు?


ధృతరాష్ట్రునికి భార్యలెందరు?




సాహితీమిత్రులారా!


మనకు తెలిసిన వరకు ధృతరాష్ట్రునకు
గాంధారి ఒకతే భార్య. కానీ
ఆంధ్రమహాభారతంలోని(1-5-12,13)
ఈ విషయాలు గమనిస్తే ఎంతమందో
తెలుస్తుంది.
సుబంధుడు అనే గాంధారరాజుకు
11మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు
గాంధారి, సత్యవ్రత, సత్యసేన, సుధేష్ణ,
సంహిత, తేజశ్శ్రవ, సుశ్రవ, నికృతి,
శుభ, సంభవ, దశార్ణ -అనే 11 మంది స్త్రీలు.
శకుని అనే పురుషుడు.
ఈ పదకొండు అమ్మాయిలను ఏకముహూర్తంలో
ధృతరాష్ట్రునికి భీష్ముడు వివాహం చేయించాడు.

కులమును రూపము శీలముఁ
గలకన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుండీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల
తిలకుండు వివాహమయ్యె దేవీశతమున్
                                                           (ఆంధ్రమహాభారతం - 1-5-13)

ఒక మారుకాకుండా తెచ్చి తెచ్చి నూరుమంది
రాజకుమార్తెలను భీష్ముడు చేశాడని పైపద్యవలన
తెలుస్తున్నది. కావున
ఈ లెక్కప్రకారం అక్షరాల 111 మంది
భార్యలు ధృతరాష్ట్రునికి అని తేలుతున్నది.