Showing posts with label తిక్కన. Show all posts
Showing posts with label తిక్కన. Show all posts

Wednesday, March 7, 2018

కృతజ్ఞత


కృతజ్ఞత




సాహితీమిత్రులారా!

శ్రీమదాంధ్రమహాభారతంలో 
"అనుశాసనిక పర్వం"
మొదటి ఆశ్వాసంలో ధర్మరాజు భీష్ముని
ఈ విధంగా అడిగాడు -
తమ జీవితాలకు ఆధారమైన యజమాని యెడల
అతని దగ్గర బతికే వారెట్లా నడచుకోవాలో చెప్పుమని
అడగగా భీష్ముడు ఈ విధంగా చెప్పాడు.

విను కాశీశశ్వరు దేశం
బున నొక లుబ్ధకుఁడు వేఁట పోయిన చోటన్
ఘనతర విషదిగ్ధ శరం
బున నేసిన మృగము ద్పి భూజము దాఁకెన్

(కాశీదేశంలో ఒక వేటగాడున్నాడు.
వాడొక రోజు వేటకు పోయి విషంపూసిన బాణాన్ని
ఒక జింకపై వేయగా అది తప్పిపోయి ఒక చెట్టుకు
తగిలింది.)

పూవులఁ గాయలఁ బెరిగిన
యా వృక్షము శుష్కమయ్యె నవ్విషమున ధా
త్రీవర తదీయ కోటర
మావాసము గాఁగ నొక మహాశుకముండున్

(పూలతో కాయలతో ఏపుగా పెరిగిన చెట్టి
ఆ విషపుబాణమువల్ల నిలువునా ఎండిపోయింది
ఆ చెట్టు తొర్రలో ఒక పెద్ద చిలుక వుండేది.)

అది తరువు విడిచి పోవక,
హృదయంబున భక్తి పేర్మి నెండను గాలిన్
బెదరక, ధృతిమైనయ్యెడఁ
గదలక యుండె, ననుజీవిగౌరరవ మెసఁగన్

(అది ఆ చెట్టు ఎండిపోయినా ఎండకు గాలికి బెదరక
ఆ చెట్టును ఆశ్రయించే ఉన్నది. ఇన్నాళ్లు తనకాశ్రయ
మిచ్చిందన్న గొరవభావంతో ఎటూవెళ్లక అక్కడే వుంది.)

దాని యుదాత్తవృత్తము శ
               తకిరతుఁ డాత్మ నెఱింగివచ్చి బెం
డైనది యిమ్మహీజము మ
               హా తరువుల్ ఫలవృద్ధినొంది యి
క్కాన ననేకముల్ గలుగఁ 
               గా నిటు లేటికి నిందు నిల్వ నో
మానిత కీరమా యనియు
               మానుష భంగిక రూపమొప్పఁగన్

(ఇంద్రుడు చిలుక వృత్తాంతమంతా తెలిసి అక్కడి వచ్చి
ఓ చిలుకా ఈ అడవిలో ఇన్ని రకాల ఫలించిన వృక్షాలుండగా
 ఎండిపోయిన దీన్నే ఆశ్రయించున్నావెందుకు అన్నాడు)

అనిన విని యాశుకంబు
(అనగా చిలుక విని)

అనయము పండుచుండు నెడ
               నాశ్రయమొప్పిన నిల్చి, యెండి పో
యిన తఱిఁ బాసిపోక తగ
               వెట్లు కృతఘ్నతకాదె యివ్విధం
బనిమిషనాథ యన్న నతఁ
               డచ్చెరువంది పురాకృతోప సం
జనిత విశేషమీ ఖగము,
               జానుగ నున్న నెఱింగె, దీనికిన్

(చెట్లు పండినపు ఉండి ఎండినపుడు విడిచి వెళ్లడం
కృతఘ్నతకాదా ఓ మహేంద్రా అన్నది. అరే దీనికి
పూర్వజన్మ వాసనవల్ల నన్ను గుర్తించగలిగింది.
కనుక ఈ గొప్ప పక్షికి....)

మేలొనర్చెదంగాక!
(మేలు  చేస్తునుగాక)

అని తలఁచి, నీదు పలుకులు
విని మెచ్చితి, వరముగోరు విహంగోత్తమ నీ
వనిన శుకంబు మహీజం
బునకున్ బేరెలమివేఁడె, భూపవరేణ్యా!

(రాజా ఇంద్రుడా విధంగా మనసులో భావించుకొని
చిలుకతో ఓ మహాశుకమా  నీమాటలు నాకు ఆనందాన్ని
కలిగించాయి కనుక నీవేదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు.
వెంటనే ఆ చిలుక స్వామీ ఈ చెట్టుకు పూర్వవైభవం కలిగించు
అని అన్నది(చూచావా ఆ చిలుక ఎంత గొప్పదో తనకు ఏ మేలు
కోరకుండానే చెట్టుమేలు కోరుకుంది.))

అమర వల్లభుండు నమృత సేచనమున
భూజమునకుఁ దొంటి పొలుపుకంటె
మిగుల నెలమిసేసె మేలి యాశ్రితులట్ల
మనుతు రధిపుఁ గురు కుమారవర్య!

(కురు వంశంలో ఉత్తమమైనవాడా  ఇంద్రుడు అమృతం చల్లి
చెట్టుకు పూర్వ వైభవం కలిగించాడు. తనను కాపాడిన వారికి
మంచి ఆశ్రితులు ఇట్లాగే రక్షిస్తారు అని అన్నాడు.)

Sunday, May 7, 2017

సారపుధర్మమున్ విమల సత్యము


సారపుధర్మమున్ విమల సత్యము




సాహితీమిత్రులారా!



తెలుగువారు క్లిష్టసమయాల్లో భగవంతుడు
వాటిని చక్కదిద్దటాని వస్తాడు
అని చెప్పటానివాడే పద్యం ఇది-

శ్రీకృష్ణుడు పాండవదూతగా కౌరవసభకు
వెళ్లినపుడు ధృతరాష్ట్రునితో పలికిన
పలుకులలోని ఒక పద్యం ఇది-

సారపుధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచేఁ
బారముబొందలేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు
లెవ్వారలుపేక్ష సేసిరది వారల చేటగుగాని ధర్మ ని
స్తారక మయ్యు సత్యశుభదాయమయ్యును దైవముండె డున్
                                                                      (శ్రీమదాంధ్రమహాభారతము - 5 - 273)



ఈ పద్యం పాండవదూతగా
కురుసభలో కృష్ణుడు చెబుతున్నది.
ఉత్తమమైన ధర్మం
నిర్మలమైన సత్యం
పాపముచేతను, అబద్ధంచేతను,
దరిచేరలేక చెడటానికి సిద్ధంగా
ఉన్నసమయంలో వాటిని రక్షించే శక్తి
ఉన్నా ఎవరు అడ్డుపడక ఉపేక్షిస్తారో
అది వారికే చేటవుతుంది
ఆ స్థితిలో భర్మరక్షణకు
సత్యానికి శుభంకలిగించటానికి
భగవంతుడు వస్తాడు-
అని భావం.

Tuesday, February 28, 2017

ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా!


ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా!





సాహితీమిత్రులారా!


అంపశయ్యమీదున్న భీష్ముడు
ధర్మరాజుకు చేసిన హితోపదేశాలలో
ధననిరసన ఒకటి-
ఇవి శాంతిపర్యంలో 4-33నుండి
38 వరకు ఉన్నాయి.
అవి-

ధనము కలిమియు లే్మియుఁ ద్రాసునందు
నిలిపి యెత్తంగ ములుపూపె నిర్ధనత్వ
మెక్కుడు దాని దిక్కున నెట్టు లన్న
మినుము గుణదోషముల భంగి విస్తరింతు

(ధనము కలిగిఉండటాన్ని ధనం లేకపోవటాన్ని
రెండింటిని తెచ్చి తక్కెడలో రెండుప్రక్కల ఉంచి
పైకి ఎత్తగా ధనం లేకపోవడమే ఎక్కువ బరువు కలిగి
ఉండుటవలన దానివైపే ముల్లు సూపి నిర్ధనత్వఘనతనే
సూచించినది. అలా ఎందుకు సూచించినది అంటావా
సారవంతమైన దెప్పుడు బరువుగను నిస్సారమైనది తేలికగా
ఉండటం లోకంలో సహజమైన విషయమే కదా
గుణదోషాలు వివరిస్తాను, ఆలకించు...)

ధనముగలవాఁడు మృత్యు వ
దనమున నున్నట్లు భయము దన చిత్తమునన్
దనుకఁగ నుల్లల నుడుకును
విను శిఖిచోరాదిముఖ్యవిషయాపదకున్
(ధనముగలవాడు మరణదేవత నోటిలో ఉన్నట్లుగా

నిత్యమూ తన చిత్తమునందు భయం పీడించగా
 దుఃఖపడుతూ ఉంటాడు. అెంతమాత్రమేకాదు
 సంపాదించిన ధనమంతా ఏ అగ్ని ప్రమాదమువల్లనో
 బూడిద కావచ్చు లేదా దొంగలు దోచుకొనిపోవచ్చు.
ఇత్యాదిగా ఊహించుకొనే ముఖ్యసంఘటనల(విషయ)
 ఆపదకి ఆ మనిషి మనస్సు కుతకుత ఉడికి పోతూ ఉంటుంది)

కోపంబును లోభంబును
నేపారి మనంబు గలఁపనెప్పుడుఁజింతా
తాపంబునొందు సధనుం
డాపదగా కవ్విధము సుఖావహ మగునే

(ధనం వల్ల దుఃఖం కలగడానికి కారణాలు ఇంకా మరికొన్ని ఉన్నాయి.
అవన్నీ ధనవంతుని చుట్టుముట్టి అతడిని సుఖం నుండి దూరం చేస్తాయి.
 అవేమంటే - తన వద్దనున్న ధనాన్ని ఆశించి యాచకులు తన వద్దకు
 వస్తారేమోనని భయంతో వారు తన దగ్గరకేరాకుండా
కోపాన్ని వహించి ఉంటాడు. అంతేకాక ఆర్జించిన ధనంతో
 సంతృప్తి పడకుండా ఇంకా ఇంకా సంపాదించాలని
 పేరాశ(లోభము)కలిగి ఉంటాడు. ఈ రెండు గుణాలూ
 ఎప్పుడూ జంటగానే కలిసిపోయే వచ్చి నిరంతరం
 మనస్సును కలచివేస్తూ ఉంటాయి. ఆ విధంగా ధనవంతుడు
 ఎల్లప్పుడూ దుఃఖాన్ని దిగులును పొందుతూ ఉంటాడు
ధనవంతుని ఆ దుఃఖస్థితి బాధాకరంగాక ఆనందదాయకమవుతుందా)

ఎచ్చోటనైన నధనుఁడు
విచ్చవిడి నుండు, లేదు వెఱపించుకయున్,
బొచ్చెపుఁ జందం బొల్లఁడు
మెచ్చరె సురలైనఁ బలుకు మృదువైయుండున్

(ధనంలోనివాడు ఎక్కడైనా భయంలేనివాడై
 స్వేచ్ఛగా ఉండగలడు,ధనం ఉండటం వలన కలిగే అనర్థాల
భయం ఏమాత్రం అతనికి ఉండదు. కాబట్టి అతడు
జీవితంలో కపటపూరిత విధనాన్ని ఇష్టపడడు. అంతే కాదు
 ఇతరుల్ని ఈసడించి పలికే నోటి దురుతనం నిర్ధనుడిలో
 ఉండదు. అతడి మాట ఎప్పుడూ చాల ప్రియంగా ఉంటుంది.
 ప్రియభాషిని దేవతలుసైతం మెచ్చుకుండ ఉండగలరా)

లోకము చందముఁగనుఁగొని
యీ కానఁగ నగు ధనాదు లెల్లనుఁగాల
వ్యాకులతఁ బొందఁగలయవి
గాకుండమి యెఱిఁగి విడుపు గడుఁజదు రెందున్

(లోకరీతిని బాగా తెలుసుకొని కంటికి స్పష్టంగా
 కనబడే ఈ ధనకనక వస్తువాహమాదులు అన్నీకూడ
 కాలప్రభావంచేత నాశనం చెందకుండా శాశ్వతంగా
 ఉండజాలవు అనే స్థతిని గ్రహించి ఆ ధనాదులను
 విడిచి పెట్టుట ఎప్పుడయినా ఎక్కడైనా ఎవరికైనా
 కడుంగడు నేర్పరితనం కాగలదు.)

ధనవత్త్వము దుఃఖకరం
బని కని తత్కాంక్ష విడుచునతని కధనతా
జనితాత్మాధీనత్వం
బనుపమసౌఖ్యంబు సేయు నక్షీణముగన్

(ధనం కలిగియుండటం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది
 అని తెలిసికొని అటువంటి ధనం మీద కోరికను విడిచిపెట్టినవాడికి
 కలిగే సఖం ఏమిటో చెబుతున్నాడు. ధనం లేకపోవడం
 వలన మనిషి తన మనస్సును అధీనంలో ఉంచుకోగలుగుతాడు.
 ఆ ప్రకారంగా కలిగిన అధీనతా గుణం అతడికి సాటిలేని ఆనందాన్ని-
 సుఖాన్ని అత్యధికంగా కలిగిస్తుంది)
అని చెప్పాడు.

ఇందంతా బాగుంది కాని ఈ కాలంలో దీన్ని పాటించేవారున్నారా
ధనం లేకపోతే నిద్రపట్టనివారు ఎందరున్నారో
ధనం పోయిందంటే గుండె ఆగి పోయే వారులేరా?
మరి అలాంటిదాన్ని వదిలివేయగలమా?
అది ద్వాపరయుగం కాబట్టి ఆయన విన్నాడేమో కాని
 ఇప్పుడైతే వినరుగాక వినరు. మరి మీ అభిప్రాయమేమో చూడండి.

Sunday, January 1, 2017

దుర్వారోద్యమ బాహువిక్రమ


దుర్వారోద్యమ బాహువిక్రమ 



సాహితీమిత్రులారా!


మనకు నచ్చినదాన్ని పదేపదే చదువుతాము.
చూస్తాము. కవి ఆ పద్యాలను మళ్ళీ రాస్తాడు.
అలా మళ్ళీమళ్ళీ వాడిన పద్యాలు తిక్కన
భారతంలో రెండున్నాయి. అవి -
   కథాసందర్భానుకూలంగా చెప్పిన పద్యాన్నే
   మళ్ళీ చెప్పడం అంటే అదీ ఒక అక్షరంకూడ
   మారకుండా అంటే  అది ఎలాంటి పద్యమై ఉండాలో కదా

విరాటపర్వంలో తిక్కన ఒక పద్యాన్ని ఇలాగే వాడాడు
ఆ పద్యం ద్రౌపది మాలిని(సైరంధ్రి)గా ఉండగా కీచకుడు
తనను ఇబ్బంది పెట్టిన సమయంలో ద్రౌపది కీచకుని
హెచ్చరింటానికి చెప్పిన పద్యం-

దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతి వీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకడతు లేవురు నిను దోర్లీలన్ వెసంగట్టి గం
ధర్వుల్ మానము బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయింగీచకా
                           (విరాట - 2- 172)

ఇదే పద్యాన్ని కీచకుణ్ణి ఇలా హెచ్చరించానని భీమునికి
మళ్ళీ చెప్పించాడు.

అలాగే విరాటపర్వంలోని (4-234) ఈ క్రింది పద్యం

గోగ్రహణంవేళ ఎవరూలేక ఉత్తరుడు బృహన్నలను సారథిగా
చేసుకొని యుద్ధానికి వెళ్ళి అక్కడ సైన్యాన్ని చూచి బెదరిపోతాడు
బృహన్నల ధైర్యం చెప్పి అర్జునుని ధనుర్బాణాలను తీసుకొని
యుద్ధానికి వెళతాడు వెళ్ళే సందర్భంలో శంఖారం విని
ద్రోణుడు ఈ పద్యాన్ని చెబుతాడు-

వచ్చినవాడు ఫల్గుణుడవశ్యము గెల్తుమనంగరాదు రా
లచ్చికినై పెంపెరుంగిన బలంబులు రెండు గెల్వనేర్తునే?
హెచ్చగు గుందగుం దొడరుటెల్ల విధంబుల కోర్చుటట్లుగా
కిచ్చదలంచి యొక్క మెయినిత్తఱిఁ బొందగు చేత యుందగున్
                              (విరాటపపర్వం 4-234)

ఈ పద్యం  ఉద్యోగపర్వం(3-84)లో మళ్ళీ  వాడుకున్నారు.

ఇదొక వింత సరదా కాబోలు-