Saturday, September 30, 2017

విజయ దశమీ విశేషాలు



విజయ దశమీ విశేషాలు



సాహితీమిత్రులారా!




                  దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది .అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము .

          'శమీ పూజ' చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది . శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్నపాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు . అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను ,వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .
        "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు . అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
         విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి .

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ.
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.
శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది.
యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది
.
                  కొన్ని ప్రాంతాల్లో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.

ప్రసిద్ధ ప్రదేశాలలో దసరా వేడుకలు -

మన తెలుగునాట వరంగల్లు భద్రకాళీ అమ్మవారి అలంకారాలు,  బాసరలో సరస్వతీ అమ్మవారి అలంకారాలు, విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారి దశరా అలంకారాలు, ప్రొద్దుటూరులో కన్యకాపరమేశ్వరీ అమ్మవారి అలంకారాలు ప్రసిద్ధమైనవిగా చెప్పుకొనడం జరుగుతున్నది. మైసూరు చాముండీ అమ్మవారి అలంకారాలు, కలకత్తా కాళీ అమ్మవారి (కోల్ కతా)లో  అలంకారాలు దేశంలో ప్రసిద్ధమైనవిగా గమనించవచ్చు.

Friday, September 29, 2017

యోగము - అష్టాంగాలు


యోగము  - అష్టాంగాలు




సాహితీమిత్రులరా!



        యోగం అంటే చిత్తవృత్తిని అదుపులో పెట్టి మనోనిగ్రహాన్ని పొందడం అంటారు. దీన్నే యుగము అంటే రెండు, యుగళ గీతం అంటే ఇద్దరు కలిసి పాడటం లాగే యోగము అంటే రెండింటి సంయోగం అవి కూడా అనేకం జీవుడు దేవునిలో కలవడం అని,
మూలాధారం నుండి పుట్టిన శక్తి సహస్రారంలో కలవడం అని అంటుంటారు. దీన్ని సాధించటానికి చేసే 8 అంగాలను అష్టాంగములు అంటారు. 
        యోగాభ్యాసంలో  8 అంగాలనే 8 మెట్లు అని అంటారు.
అవి - 1. యమ, 2. నియమ, 3. ఆసన, 4. ప్రాణాయామ, 5. ప్రత్యాహార, 6. ధారణ, 
7. ధ్యాన, 8. సమాధి.

వీటిని ఒక్కొకదాన్ని గురించి గమనిద్దాం-
1. యమ -
   ఇది మొదయి మెట్టు. దీనిలో చేయవలసినవి ఐదు.
   1. అహింస, 2. అసత్యం ఆడకుండుట, 3. దొంగిలించకుండుట,
   4. బ్రహ్మచర్యం పాటించుట, 5. సాంఘిక జీవనం పాటిండం.

2. నియమ -
   ఇది రెండవ మెట్టు. దీనిలో 1. శుచి,శుభ్రత ఆహార విహార    
   పానీయాదులందు కలిగి ఉండటం. 2. నిత్య సంతోషిగా కాలం   
   గడపటం. 3. తపస్సు, 4. స్వాధ్యాయం, 5. ఈశ్వర ప్రణిధానం
   అనే ఐదింటిని పాటించడం. 
   అంటే ఆహార,విహార,పానీయాదులలో శరీరమానసిక శుభ్రత  
   పాటించడం.ఎవరికిగాని చెడు తలపకుండడం, ఇతరుల మనస్సు 
   నొప్పించకుండా నిత్యసంతోషిగా ఉన్నంతలో దురాశకు పోకుండా
   తృప్తి కలిగి ఉండడం, కోరికలను జయించి పరమాత్మలో చేయ 
   యత్నించడం.

3. ఆసన -
   యోగికి ఈ ఆసనాలు శరీరరోగ్యానికి, మనస్సు నిలకడకు  
   ఉపకరిస్తాయి. మనస్సు చంచలత్వాన్ని తొలగించి, మానసిక 
   స్థైర్యం నిలకడను కలిగిస్తాయి.

4. ప్రాణాయామ-
    మన (ఊపిరిని) శ్వాసక్రియను అదుపులో పెట్టుకోవడం
    ఇది పూరక(గాలిని పీల్చడం), రేచక(గాలిని వదలడం),
    కుంభక(పీల్చిన గాలిని కొంతసమయం నిలపడం) అనే 
    క్రియల ద్వారా క్రమబద్ధీకరించటం. వీటిని అనుభవజ్ఞులైన
    వారిద్వారా నేర్చుకోవాలి.

5. ప్రత్యాహార-
   పై శ్వాసక్రియలపై అధికారం లభింపజేసుకొని మనో నిగ్రహం 
   కలిగి భక్తియుక్తులతో కోరికల వేదనల నుంచి విముక్తి పొంది 
   ఇంద్రియ నిగ్రహుడై ఉండడం.

6. ధారణ -
   ప్రాణాయామ ప్రత్యాహారముల వలన శారీరకంగా ఆరోగ్యవంతుడైన
   తరువాత ఇంద్రియ నిగ్రహణం ఎప్పుడు అలవడునో అప్పుడు  
   ధారణ శక్తికి అనుగుణ్యుడవుతాడు. దాని వలన ఏకాగ్ర స్థితికి 
   చేరడానికి చంచలమై ఉండే మనసు నిశ్చలస్థితికి చేరుకోవడానికి  
   సిద్ధమౌతుంది. దీనిలోని మానసిక స్థితులు 5 అవి-
   1. క్షిప్త - పరిస్థితిలో మనసు ఆందోళన చెంది 
            సక్రమంగా ఉండనిస్థితి
   2. విక్షిప్తి - కోర్కెలు మితిమీరి మనసు వ్యాకులతకులోనై
             పరధ్యాంగా ఉండే స్తితి.
   3. మూఢ - మనసు భ్రమలో పడి అవివేకుడై ఉండు స్థితి.
   4. ఏకాగ్రత -మంచి గుణం కలిగి, దేనిని సాధించ దలుస్తాడో
               దానిని సాధించడానికి ప్రయత్నించే స్థితి.
   5. నిరుద్ధ - అహంకారాన్ని జయించి ఏ దానిని సాధించ 
              దలుస్తాడో దానియందే ఏకాగ్రత చేకూరే పరిస్థితి.
7. ధ్యానం -
   ధ్యాన ఫలితంగా మనసు ఇంద్రియాలు శ్వాసక్రియలు అన్ని పరమాత్మలో లయంకాగల స్థితి. ఇది ఏకాగ్రత నిరాటంకంగా జరిగే స్థితి. ఒక పెద్ద అనుభూతిలో విలీనమై ఉండే స్థితి.(దీనిలో అనుభూతి తప్ప మరే అనుభవ స్థితి ఉండదు)

8. సమాధి - 
   ఈ స్థితిలో నిద్రించేప్పుడు ఎంత విశ్రాంతి పొందగలడో అంతకు 
   మించిన విశ్రాంత స్థితి. ఇది ధ్యానం వలన కలిగే ఉచ్ఛమైన 
   స్థితి. అది ఒక అనిర్వచనీయమై ఉండే అమితానంద అనుభూత 
   స్థితి.

   యోగం సాధించడంలో వీటన్నిటి పాత్ర ఎంత ఉందో తెలుస్తున్నది
   అలాగే ఆసనాలను క్రమబద్ధంగా సురక్షితంగా అభ్యసించడం 
   అత్యవసరం.
    

Thursday, September 28, 2017

ఘంటసాలనోట జాషువ శిశువు


ఘంటసాలనోట జాషువ శిశువు




సాహితీమిత్రులారా!

జాషువా కవిత్వంలో వస్తువుకానిది
లేదనే చెప్పాలి
ఇక్కడ మనం శిశువు అనే ఖండిక
పద్యాలను ఘంటసాల మధుమైన
గళం నుండి విందాము-


"కవికోకిల"గుఱ్ఱం జాషువ గారి జన్మదిన శుభాకాంక్షలు


"కవికోకిల"గుఱ్ఱం జాషువ గారి జన్మదిన శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
"కవికోకిల" గుఱ్ఱం జాషువ గారి 
జన్మదిన శుభాకాంక్షలు



Wednesday, September 27, 2017

కలయో!వైష్ణవమాయయో!


కలయో!వైష్ణవమాయయో!




సాహితీమిత్రులారా!

కొన్ని కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించేవిగా
నమ్మశక్యం కానివిగా ఉన్నపుడు ఇలా అనుకోవడం
సహజమేకదా అదేమిటంటే కలయో వైష్ణవమాయయో
ఇంతకు ఇది ఎవరన్నారు అంటే
చిన్నికృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు చెప్పగా
యశోదాదేవి కృష్ణుని నోరు తెరువమన్నపుడు కృష్ణుడు
తననోరు చూపించాడు ఆ సమయంలో ఆమెకు
కృష్ణుని నోటిలో ఈ సకల బ్రహ్మండము కనిపించింది
కనిపించగానే ఆమెకు కలిగిన ఆశ్చర్యాన్ని పోతనమహాకవి
ఈ పద్యంరూపంలో వెలయించాడు ఆ పద్యం-

కలయో!వైష్ణవమాయయో! యితర సంకల్పార్థమో! సత్య మో
తలఁపన్ నేరక యున్నదాననొ! యశోదాదేవిఁగానో పర
స్థలమో! బాలకుఁడెంత! యీతని ముఖస్థంబై యజాండం బు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపగన్!
                                                                                                 (పోతన భాగవతము - 10-342)

యశోదాదేవి ఇలా అనుకొంటున్నది-
నేను కలగనలేదుకదా లేకపోతే ఇది విష్ణువు మాయకాదుకదా!
దీనిలో ఇంకేదైనా అర్థం ఉందా? ఇలాకనిపించడానికి
లేక ఇది సత్యమేనా? నా బుద్ధి పనిచేయడం లేదు
అసలు నేను యశోదాదేవినేనా?ఇది మాయిల్లేనా
లేకపోతే ఈ కుర్రవాడు ఎంత  వీని నోటిలో ఈ
బ్రహ్మండమంతా వెలుగులు చిమ్ముతూ కనిపించడమేమిటి?
ఎంత వింత ఆలోచించి చూచేకొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉంది!

ఎవరైనా ఇంకోలా అనుకొనే వీలుందా!

Tuesday, September 26, 2017

దేవీ వైభవం


దేవీ వైభవం




సాహితీమిత్రులారా!


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి 
దేవీ వైభవం ప్రవచనం
శరన్నవరాత్రుల సందర్భంగా
ఇక్కడ విని తరించండి-


ఇవి ఉంటే అవి అక్కరలేదు


ఇవి ఉంటే అవి అక్కరలేదు




సాహితీమిత్రులారా!


ఈ పద్యం సుభాషిత రత్నావళిలో
ఏనుగు లక్ష్మణకవి కూర్చినది.

క్షమ కవచంబు, క్రోధ మది శత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మి
త్రము దగు మందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సు విద్య  వి
త్త, ముచితలజ్జ భూషణ, ముదాత్తకవిత్వము రాజ్య, మీ క్షమా
ప్రముఖపదార్థముల్ గలుగుపట్టునఁదత్కవచాదు లేటికిన్

దీని భావమేమిటంటే-
ఓర్పు ఉంటే కవచము అక్కరలేదట.
క్రోధముంటే హాని కలిగించటానికి శత్రువు పనిలేదు.
దాయాది ఉంటే వేరే నిప్పు అక్కరలేదు.
స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు.
దుష్టులుంటే భయంకరమైన పాము అక్కరలేదు.
ఉదాత్తకవిత్వముంటే రాజ్యంతో పనిలేదు.
చక్కని విద్య ఉంటే సంపదలతో ప్రయోజనంలేదు.
తగురీతిన సిగ్గు ఉంటే వేరే అలంకారం అక్కరలేదు.
కాబట్టి ఓర్పు మొదలైన పదార్థాలుంటే కవచము
మొదలైన వాటితో పనిలేదు. అంటున్నాడు కవి.

Monday, September 25, 2017

నిద్రే ప్రాణప్రదం


నిద్రే ప్రాణప్రదం




సాహితీమిత్రులారా!

ఈ ప్రపంచంలో సర్వప్రాణులకు
ఆహారము తరువాత నిద్రే ప్రాణప్రదం
నిద్రలేనిదే బ్రతుకేలేదు కాదంటారా
ఆ నిద్ర గురించిన కొంత
విషయాన్ని ఇక్కడ గమనిద్దాం-

చరక సంహితలోని ఈ శ్లోకం చూడండి-
యదాతు మనసి క్లాంతే కర్మాత్మానః క్లమాన్వితాః
విషయేల్యో నివర్తంతే తదా స్వపిమానవః

అంటే మనోబడలిక(అలసట) చెందినప్పుడు, ఇంద్రియాలు
తమ తమ కర్తవ్యాలను మాని మనసునకే కైవసం కావడం
తటస్థించడం వలన శారీరక మానసిక చేష్టలు చేయజాలక
ఏకాంతం కోరతారు.

దాన్నే స్వప్నావస్థ - నిద్ర అంటారు. జాగ్రదావస్థలో ఆత్మ ఏదో ఒక
పని చేసే సంకల్పంలో ఉండే మనసు ఆత్మనుంచి విడివడి బుద్ధితో
కలిసి చింతనా రూపమైన వ్యాపార నిమగ్నమై ఉంటుంది.
పనులు చేసి చేసి చాలా అలసి పోవటం వలననే ఇంద్రియాలు
ప్రేరేపణ శక్తిని ఉడుగుతాయి. ఆ స్థితిలో బుద్ధి మనసులో
లీనమౌతుంది అంటే అది ఆత్మను చేరుతుంది. అప్పుడు
ఆ ఆత్మ వెంటనే ఏకాకారమై కృత్యాల ప్రేరేపణమాని
ఆనందకరమైన సుఖమైన స్వప్నం అనుభవిస్తుంది.
ఆ స్థితినే నిద్ర అంటాము.

ప్రాణాయామాది నియమపరులు నిద్ర ఏకాగ్రత, సుషుమ్నత చక్కగా గుర్తిస్తారు.

నిద్రవలన కలిగే ప్రయోజనం-
నైన యుక్తాపునర్యుఙ్త్కే నిద్రా దేహం సుఖాయుషాః
(పురుషం, యోగినం, సిధ్యా, సత్యౌ బుద్ధిః వాగతాః)
యుక్తమైన కాలంలో విద్యుక్తంగా నిద్రించడం వలన దేహానికి(మనస్సుకు)
సుఖమును కలిగించి ఆయువును వృద్ధిపరుస్తుంది.

ప్రతి జీవికి తమ జీవితంలో మూడోవంతు నిద్రనే ఆక్రమిస్తుంది.
సహజంగా వయసును బట్టి పసివారు 12 నుండి 14 గంటల నిద్రపోవాలి
అలాగే వృద్ధులు సాధారణంగా 10 గంటలు నిద్రపోవాలి. అలాగే
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు నిద్ర కొంత ఎక్కువే అవసరము.
మొత్తానికి-

నిద్రాతు సేవితా కాలే, ధాతు సామ్య మతంద్రితామ్
పుష్టి, వర్ల, బలోత్సాహాగ్ని దీప్తిం కరేతిచ

నిద్ర అగ్నిదీపనం కలిగించి అలసటను పోగొట్టి ధాతువులు (తత్ఫలితంగా) సమత వహించి, తంద్రను పోగొట్టి పుష్టి, ఉత్సాహం పూరిస్తుంది. కాబట్టి, నియమానుసారం నిద్రించడం ఆరోగ్యప్రదం.
రాత్రికాలంలో ఎంత వేగంగా నిద్రిస్తే, ప్రాతఃకాలంలో అంతవేగంగా మేల్కొనడం వీలౌతుంది.
నిజానికి మనిషి 6 గంటలు నిద్రిస్తే సరిపోతుంది దీనికి ప్రమాణం
ఈ శ్లోకపాదం చూడండి.
యామ ద్వయం శయానస్తు బ్రహ్మ భూతాయకల్పతే
                                                                                            - వాగ్భట సూక్తి
రెండుయామములంటే 6 గంటలు క్రమం తప్పకుండా నిద్రించేవారికి
బ్రహ్మత్వం సిద్ధిస్తుంది- అని వాగ్భటసూక్తి.

నిద్ర సరిగా నిద్రించనివారికి ఒళ్ళు దిమ్మెక్కి మజ్జుగా, మబ్బుగా,
తలదిమ్ముగా, కండ్లులోనికి గుంజటం, తల భాధ, మలబద్ధకం,
అజీర్ణం కలగడం సహజం. అన్ని వ్యాధులకు అజీర్ణం,
మలబద్ధకం మూలమంటారు వైద్యులు.
నిద్ర అయుష్షును పెంచుతుందని అదేపనిగా నిద్రపోరాదు.
పగటిపూట నిద్ర పనికిరాదు. వేసవికాలమైతే కొంత సమయం
నిద్రించవచ్చని మరేకాలం నిద్రంచరాదని పెద్దలు చెబుతారు.
మొత్తానికి పగటి నిద్ర కంటే రాత్రి నిద్ర సహజమైన
ఆరోగ్యకరమైన నిద్ర.
శ్రామికులు, రాత చదువు ఎడతెరపిలేకుండా ఉండేవారికి
అలసిపోగానే నిద్ర పగలు ఒక్కొకప్పుడు అవసరమే
అది ఎవరికివారు అలసటను బట్టి నిర్ణయించుకోవాలి.
శ్రామికులు, చదువరులు చక్కగా స్నానం చేసి మనస్సును
నిర్మలంగా ఉంచుకొని తక్కువగా నిద్రించినా కలతలుండవు.
కలలురావు. సోమరిపోతులు, తిండిపోతులు, బలహీనులు,
దురాలోచనాపరులు దుండగులకు నిద్ర ఎక్కువే అనిపించినా
భయానకమైన కలలతో కలత నిద్రకలుగుతుంది.
కొందరికి నిద్ర రావడం లేదని అనుకుంటూనే
నిద్రలో గడుపుట పూర్తికాకున్నా అంతో ఇంతో
నిద్రలోనే ఉంటారనేది గమనించరు.
అది వారివారి మనోవేదనే కాని
నిద్రలేకపోతే బ్రతుకే లేదుకదా
నిద్రే ప్రాణప్రదం.


Thursday, September 21, 2017

గురజాడ డాక్యుమెంటరి


గురజాడ డాక్యుమెంటరి




సాహితీమిత్రులారా!

మహాకవి గురజాడ వేంకట అప్పారావుగారి
156వ జయంతి సందర్భంగా ఆయన
డాక్యుమెంటరీ చూడండి-



మహాకవి గురజాడ జన్మదిన శుభాకాంక్షలు


మహాకవి గురజాడ జన్మదిన శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
"మహాకవి" గురజాడ వేంకట అప్పారావు గారి 
156వ జన్మదిన శుభాకాంక్షలు
జననం - 21-09-1862 

Tuesday, September 19, 2017

పెద్దనగారి ప్రవరుడు - 3


పెద్దనగారి ప్రవరుడు - 3



సాహితీమిత్రులారా!

ఆ సిద్ధునికి ఎదురు వెళ్ళి నమస్కరించి
కాళ్ళుచేతులు కడుక్కోడానికి నీళ్ళిచ్చి
మొదలైన విచ్చుపూజను చేసి
ఇష్టమైన అన్నాన్ని వడ్డించి
సంతృప్తిపరచి
విద్వత్వందితా ఎక్కడనుండి ఎక్కడికి పోవుచున్నావు
ఇక్కడికి వచ్చి నాయిల్లు పావనము చేశావు
ఇప్పుడుకదా నేను ధన్యుడనైనది
మీ మాటలే వేదవాక్యములు, మీరు తొక్కిన చోటే
పవిత్ర పుణ్యక్షేత్రము మీకాళ్ళు కడిగిన నీళ్ళు
గంగోదకము వంటిది.
యోగీశ్వరా మీవంటివారు ఎవరి ఇంటివద్ద
ఎటువంటి భేదభావము లేక ఇష్టము వచ్చినట్లు
స్నానపానముల తృప్తి పొందుదురో
వారిదే అదృష్టము వారి జీవితమే సఫలము
వాడే పుణ్యాత్ముడు. ఓ మునీంద్రా సంసారమను
బురదలో కూరుక పోయిన మావంటివారిని ఉద్ధరించుటకు
మీ వంటివారి పాదధూళి తప్ప వేరే ఔషధములేదు
అనగా ఆ సిద్ధుడు మీవంటివారలు మిక్కిలిగా మర్యాదలు
చేయడం వల్లనే మావంటి వారు సుఖంగా తీర్థయాత్రము చేస్తున్నారు
అని గృహస్థులను గురించి పెద్దగా పొగిడాడు. తరువాత ప్రవరుడు
సిద్ధునితో ఈ విధంగా అన్నాడు-

ఏయే దేశములన్ జరించితిరి మీ రేయే గిరుల్ చూచినా
రేయే తీర్థములందుఁ గ్రుంకిడితి రేయే ద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి రేయే తోయధుల్ డాసినా
రాయా చోటులఁ గల్గువింతలు మహాత్మా నా కెఱింగింపరే

ఓ మహాత్మా మీరు ఏయే కొండలు తిరిగారో, ఏయేనదుల్లో స్నానంచేశారో, ఏయే సముద్రాల్లో స్నానంచేశారో, అక్కడక్కడ ఉన్న వింతలను చెప్పండి.

పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిలకల్మషహరంబ
కాన వేఁడెద ననిన నమ్మౌని వర్యుఁ
డాదరాయత్తచిత్తుఁడై యతని కనియె

నేరుగా పోయి సేవించకపోయినా పుణ్యతీర్థాల
మహిమ విన్నా పాపాలు పోతాయి కాబట్టి
మిమ్ములను ఇంతగా వేడుకొంటున్నాను- అని సిద్ధుని అడగ్గా
ఈ విధంగా చెప్పాడు-

ఓ చతురాస్యవంశ కలశోదధిపూర్ణశశాంక తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులున్
జూచితి నందు నందుఁగల చోద్యములున్ గనుగొంటి నా పటీ
రాచలపశ్చిమాచల హిమాచలపూర్వదిశాచలంబుగన్

కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్ హింగుళా
పాదాంభోరుహముల్, ప్రయాగనిలయుం బద్మాక్షు సేవించి తిన్
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణున్ గంటి, నీ
యాదేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన్

ఓ బ్రాహ్మణోత్తమా! నేను నాలుదిక్కులున్న వింతలన్నిటిని
చూచాను. ఎన్నో పుణ్యనదీ నదాల చూచాను.
కేదారనాథుని పూజించాను. హింగుళాదేవి పాదపద్మాలను
సేవించాను. ప్రయాగలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి భర్త అయిన
బదరీనారాయణుని చూచాను ఇది అది చెప్పడమెందుకు
అన్ని దిక్కుల మధ్యగల అన్నిటిని చూచాను.
అని చెప్పాడు.

Monday, September 18, 2017

పెద్దనగారి ప్రవరుడు - 2


పెద్దనగారి ప్రవరుడు - 2




సాహితీమిత్రులారా!


వరుణానదికి వెళ్ళి స్నానము చేసి సంధ్యావందనము
చేసికొని ఆ ఇసుక తిన్నెలపై సూర్యునికి నమస్కరించి
బ్రాహ్మణవటువులు వెంటరాగ ప్రవరుని ప్రజలందరు
మెచ్చికొనగా ఇంటికి వచ్చెడివాడు.

శీలంబున్ గులమున్ శమంబు దమమున్ జెల్వంబు లేఁబ్రా యమున్
బోలన్ జూచి యతండె పాత్రుఁడని యేభూపాలుఁడీ వచ్చి నన్
సాలగ్రావము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్ పెక్కు చం
దాలన్ బండు నొకప్పుడుం దఱుఁగ దింటన్ బాఁడియున్ బంటయున్

మంచి శీలాన్ని, వంశాన్ని, బహిరింద్రియ నిగ్రహాన్ని,
అందము పడుచుదనము చూచి ఏ రాజైనా దానమివ్వటానికి తగిన పాత్రుడని
ఇవ్వబోయినా ఏదోషములేని సాలగ్రామము ఇవ్వబోయినా
పరిగ్రహింపడు. అనేక విధాలుగా మాన్యాలు పండుచున్నవి
ఇంటిలో పాడి సమృద్ధిగా ఉన్నది.

ఇక అతని భార్యను చూద్దామంటే

వండ నలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్ది యౌనతనిగృహిణి
యతిథు లేతేర నడిరేయైనఁ బెట్టు
వలయుభోజ్యంబు లింట నవ్వారి గాఁగ

వండి వడ్డించడంలో అతిథులను తృప్తిపరచడంలో
అన్నపూర్ణకేమాత్రం తీసిపోదు. ఎంతమంది వచ్చినా
అపరాత్రి వచ్చినా విసుగుకొనక వంటి వడ్డించి వారిని
తృప్తి పరుస్తుంది ఆ యిల్లాలు.

మరి ఈ ప్రవరుడు ఇంకా ఎలాంటివాడంటే

తీర్థసంవాసు లేతెంచినా రని విన్న
         నెదురుగా నేఁగు దవ్వెంత యైన
నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ
         దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు
నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయుఁ
         జేసి కూర్చున్నచోఁ జేర వచ్చు
వచ్చి యిద్దరఁ గల్గువనధిపర్వతసరి
         త్తార్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు
నడిగి యోజనపరిమాణ మరయు నరసి
పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి

ఈ పడుచుసోమయాజి ప్రతిరోజూ తీర్థయాత్రకు వెళ్ళాలని
మనసులో అనుకొంటుంటాడు అందుకే ఆ వూరికి ఎవరైనా
తీర్థయాత్రచేసి వచ్చినవారు అని తెలియగానే వారు ఎంత
దూరంలో ఉన్నా వారివద్దకు వెళ్ళి వారిని తన ఇంటికి
తీసుకువస్తాడు. తీసుకొచ్చి వారికి చక్కటి ఆతిథ్యమిస్తాడు
ఇచ్చి వారినుండి తీర్థయాత్రా విశేషాలనడిగి మరీమరీ
చెప్పించుకొంటాడు. చెప్పించుకొని తను వెళ్ళలేక పోతున్నానని
నిట్టూరుస్తాడు.
ఇలా జరుగుతూ ఉండగా
ఒకనాడు
తలకు పులితోలు టోపీగా పెట్టుకొన్నవాడు పంచలోహ
కడియమున్నచేతితో కకపాలము, యోగదండము
నిక్కి పట్టినవాడు, నడుముకు జింకతోలు పట్కాయు కట్టి,
మెడలో యోగపట్టెయు ఉన్నవాడు, పచ్చని శరీరీనికి విభూది
పూసుకొన్నవాడు, చెవులకు రుద్రాక్ష పోగులు ఊగుతుండగా
కావిచొక్కా తొడుక్కొని, కమండలం చేతబట్టుకొని వున్న
సిద్ధుడొకడు ప్రవరుని ఇంటికి వచ్చాడు.

Wednesday, September 13, 2017

పెద్దనగారి ప్రవరుడు - 1


పెద్దనగారి ప్రవరుడు - 1




సాహితీమిత్రులారా!



అల్లసాని పెద్దనగారి పేరు వినని తెలుగువారు
సాహితీప్రియులు ఉండరన్నది అతిశయోక్తికాదేమో
ఈయన శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని
అష్టదిగ్గజాలలో మొదటివాడుకూడా
ఈయన మనుచరిత్రలో అదేనండీ
స్వారోచిషమనుసంభవము అనే ప్రబంధంలో
సృష్టించిన ప్రవరుని గురించి ఇక్కడ చూద్దాం-
ప్రవరుఁడు అంటే నిఘంటువులో శ్రేష్ఠుడు, మేటి అని ఉన్నాయి.
అందుకే ప్రవరుని గుణాలను చాల చక్కనైన శ్రేష్ఠమైన గుణాలు
కలవానిగా తీర్చిదిద్దాడు పెద్దనగారు. ఆ గుణాలను పెద్దనగారి
పద్యాలలోనే చూద్దామా....

వరుణానదీ తీరంలో అరుణాస్పందం అనే ఊరు అందులో
నివసించే బాపడు ప్రవరుడు.

ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁడంబురుహ గర్భకులాభరణమ బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూవిలాసుఁడై
                                                                                                 (మనుచరిత్ర 1-51)
మన్మథునివలె, చంద్రునివలె, అందమైన
శరీరంకలవాడును, భాషలో రెండవ ఆదిశేషుడునూ అయి
సమస్త యాగాల్లోను, స్వచ్ఛమైన ధర్మకార్యాల్లోను,
దీక్ష ఆసక్తికలవాడు, బ్రాహ్మణజాతికి అలంకారమైనవాడు,
నిరంతరమూ వేదాధ్యయనమునందు ఆసక్తికలవాడు,
ప్రవరాఖ్యుడను పేరుకలవాడు ఆ పట్టణం(అరుణాస్పదాన్ని)
విడువక(ఎక్కడికీ వెళ్ళకుండా) ఉండేవాడు.

వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి
కాంక్ష సేయుజారకామినులకు
భోగబాహ్య మయ్యెఁ బూచినసంపెంగ
పొలుపు మధురాంగనలకుఁబోలె  - 52

తుమ్మెద అన్ని పూవులమీదా వాలుతుంది
ఒక్క సంపెంగ పూవుపై తప్ప దానిపై వాలెనా
చచ్చి వూరుకుంటుంది. తుమ్మెదలకు సంపెంగ
పనికిరానట్లే ఎంత అందగాడైనా ప్రవరాఖ్యుడు
జారవృత్తి లేనందున ఆ ఊరిలోని జారకామినులకు
పనిరానివాడైనాడు.

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడు నై కమనీయ కౌతుక
శ్రీనిధిఁ గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిద్మ సౌ
భ్యావహ యై భజింప సఖులై తలిదండ్రులు గూడి దేవి యున్
దేవరబోలె నుండి యిలు దీర్పఁగఁ గాపుర మొప్పు వానికిన్

అతడు ధనవంతుడై, తనకు ఈడుజోడైన భార్య సేవలు
చేస్తుండగా పడుచుదనంలోనే యజ్ఞంచేసి తల్లిదండ్రులు
ఇంటిలో సుఖులై ఇంటిని సర్దుతుండగా కాపురం చేస్తూ
ఉండినాడు.

Monday, September 11, 2017

వివేకానందుని స్వస్వరం చికాగోలో మాట్లాడిన మాటలు


వివేకానందుని స్వస్వరం చికాగోలో మాట్లాడిన మాటలు




సాహితీమిత్రులారా!

1893 సెప్టెంబరు 11న చికాగోలో సర్వమత సమ్మేళనంలో
వివేకానందుడు ప్రసంగించి ప్రసంగం ఈ రోజు విందాము.



Sunday, September 10, 2017

విశ్వనాథవారి స్వరం


విశ్వనాథవారి స్వరం




సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణ గారి స్వరం వినండి


కవిసామ్రాట్టుని జయంతి శుభాకాంక్షలు


కవిసామ్రాట్టుని జయంతి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
తెలుగులో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
విశ్వనాథ సత్యనారాయణ గారి జన్మదిన శుభాకాంక్షలు
ఉక్తివైచిత్రికి నుపదయై త్రిథయై
                       భాషామతల్లికి బాసటాయె
సూక్తి సంపదకు ప్రస్తుతిపాత్రమై తెల్గు
                      తఱి తీపికిని సంస్థానమాయె
రక్తి గట్టిన కథారాజమ్ముగ సజీవ
                     పాత్రలకును తానె పాత్రమాయె
ముక్తిదాయిని యంచు ముదమార ప్రజలకు
                     దారి జూపగ మార్గదర్శియాయె
అట్టి కల్పక కావ్యంబు నాంధ్రులకిడి
హరిహరాద్వైత తత్వంబు నాంధ్రభూమి
పాదుకొల్పిన యట్టి యభ్యుదయవాది
మధుర హృదయుండు మన విశ్వనాథు కాడె
                                                                        - విశ్వనాథత్రిశతి

Saturday, September 9, 2017

వేయి పడగలు - ప్రసంగం


వేయి పడగలు - ప్రసంగం




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయి పడగలు గురించిన
ప్రసంగవ్యాసం వినండి


ప్రేయసి


ప్రేయసి




సాహితీమిత్రులారా!


ఆరుద్రగారి కవిత ఇది
ఇది 1945లో వ్రాయబడింది-


తల్లిగర్భంలోని జీవకణం
మొదట చీలిపోగా
ఏర్పడ్డ కణాలు
కొన్ని వారాలకి
మళ్ళా శరీరాకృతిలో
కలుసుకున్నట్టు
మన కలయిక ఎప్పుడు
పంపర పనస తొనల్లాంటి
నీ ఊపిరి తిత్తులని
తినడం చేతే
నాలో
కర్బూజా పళ్ళలాంటి
నీ కళ్ళు నవ్వుతాయి
నన్నెవరేనా
ఒక సూదిమందు గొట్టంలోకి
ఎక్కించి 
నీకు ఇంజెక్షను ఇస్తే
బావుణ్ణు
నీ రక్తనాళాల్లో పడి
ఈదుకుంటూ
నీ గుండెలిని చేరుకోవాలని
ఉంది

Thursday, September 7, 2017

సీత హనుమంతునితో రామునికి ఏమిచెప్పమన్నది?


సీత హనుమంతునితో రామునికి ఏమిచెప్పమన్నది?




సాహితీమిత్రులారా!


శ్రీమద్రామాయణంలో హనుమంతుడు సీతను
సందర్శించిన సమయంలో హనుమంతునితో
సీత ఈ శ్లోకం చెప్పింది-

మత్కృతే కాకమాత్రే తు
బ్రహ్మాస్త్రం సముదీరితం
కస్మా ద్యో మాం హరేత్ తత్త్వః
క్షమసే త్వం మహీపతే
(నా కోసం కాకిమీదనే బ్రహ్మాస్త్రాన్ని వేసిన నీవు
నీ నుండి నన్ను హరించినవాడిని(రావణున్ని)
ఎందుకు వూరుకున్నవు మహానుభావా! ఓ రామచంద్రా!)

సీత రామునికి నమ్మకంకోసం అంతవరకూ తనకూ రామునకూ
తప్ప మరెవరికీ తెలియని కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చేయవలసిందిగా
హనుమంతునికి చెప్పింది సీతాదేవి.

ఎంత భావగర్భితమైన విషయమోకదా


Tuesday, September 5, 2017

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు


ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు,
ఉపాధ్యాయమిత్రులకు
భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, 
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



Monday, September 4, 2017

కుందుర్తిగారి సముద్రవర్ణన


కుందుర్తిగారి సముద్రవర్ణన




సాహితీమిత్రులారా!



గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ సమయంలో
సముద్రాన్ని సమీపిస్తున్నపుడు,
కుందుర్తిగారు దండియాత్రా కావ్యంలో
చేసిన సముద్ర వర్ణన-

మహోన్నత హిమగిరి శిఖరాల హర్షాశ్రుబిందువులు కారి
గంగై పారాయి కాబోలు బంగాళాఖాతానికి కబురెళ్ళింది
అక్కడినుండి అలలు వెళ్ళి అరేబియా సముద్రానికి చెప్పాయి
అది తక్షణం తయారైంది అవతారమూర్తిని ఆహ్వానించడానికి
ఒడ్డులొరసి దూకుతున్న అలలు అర్ఘ్యపాద్యాలు యివ్వాలి
సముద్రపు చల్లగాలి ఎదురెళ్ళి స్వాగతం యివ్వాలి
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఆయన రావడమే తడవు
ఆనందంతో తను పెరిగింది ఆకాశమంత పొడవు

దీనిలోని సుదీర్ఘపాదాల శైలి కూడా ప్రవాహాలు జాలువారిన
స్ఫురణ కలిగించాయని విమర్శకులంటారు

Sunday, September 3, 2017

తప్పొప్పుల పట్టిక


తప్పొప్పుల పట్టిక




సాహితీమిత్రులారా!

ఆరుద్రగారి సినీవాలి లోని
తప్పొప్పుల పట్టిక
కావ్యం చివరలో ఉన్నది
అదేమిటో గమనించండి-

భగవంతుని అచ్చాఫీసు
ప్రచురించిన మానవ ప్రకృతి కావ్యంలో
లెక్కలేని అచ్చు తప్పుల్ని
ఇక్కడ మానవుడే దిద్దుకోవాలి

సాంఘిక గ్రంథాన్ని సనాతనులు
చాదస్తపు నియమాలతో బైండు చేశారు
ఆ కుట్లూ కట్లూ సడలించి మళ్ళా
ఆధునికంగా క్యాలికోబైండు చేద్దాము

అలాచేయడానికి ముందుగానే
అడ్డదిడ్డంగా నున్న బ్రతుకుల ఫారాలను
యథాస్థానాలలో సర్ది సామాజిక
కధాక్రమాని కడ్డులేకుండా చేద్దాము

యుగపురుషులు ప్రూఫ్ రీడర్లు
జగత్ కావ్యాన్ని సరిదిద్దినా
పరిస్థితుల కంపోజిటర్లు
కరక్షన్లు చేయడానికి టైపులు లేవు 

కొత్తటైపులు సృష్టించుకొందాం
మొత్తం కావ్యం పునర్ముద్రిద్దాం
అంతదాకా ఈ తప్పొప్పుల పట్టిక
అందరం తయారుచేద్దాం గట్టిగ

ఈ కావ్యం విషాదాంత మనుకోవడం తప్పు
అసలు అంతమవుతుం దనుకోడమే తప్పు
ఇది అనంతం సౌఖ్యవంతం అనడం ఒప్పు
ఈ నిరాశలోంచి ఆశ జనించడం ఒప్పు

సమకాలిక జీవన విభావరిలో
తమస్సులు ఘనీభవించా యనుకోవడం తప్పు
అతి సన్నని వెలుగురేక లేదనుకోవడం తప్పు
ఆశాచంద్రకళ గల ఇది సినీవాలీ అనడం ఒప్పు


Saturday, September 2, 2017

అయోధ్య అంటే నగరం కాదా?


అయోధ్య అంటే నగరం కాదా?




సాహితీమిత్రులారా!



మనం సర్వసాధారణంగా అయోధ్య అనేది
ఒక నగరంగానే అనుకుంటూంటాం. కానీ
దాన్నిగురించి అధర్వణవేదం(10-2-30 తై ఆ1-27-2-3)
లోని ఈ శ్లోకం చూడండి-

అష్టాచక్రా నవద్వారా దేవానాం పూ రయోధ్యా
తస్యాగ్ం హిరణ్మయః స్వర్గో లోకో జ్యోతిషా  వృత్తః
యో వై తాం బ్రహ్మణోవేద, అమృతే నా  వృతాం పురీం
తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః


త్వగా ద్యష్ట(చర్మ, మాంస, రక్త, మజ్జ, అస్థి మొదలైన)
ధాతు రూపములైన 8చక్రములతో
కన్ను మొదలైన 9 ద్వారములతో అయోధ్య అనే
సార్థక నామంతో దేవతా నిలయమైన శరీరం అనే
పట్టణం ఉంది. (శరీరం పుడతూ, చస్తూ జనన మరణ
చక్రపరిభ్రమణం కలది ఈ జననమరణాలతో యుద్ధం
చెయ్యడం అసాధ్యం కాన శరీరానికి అయోధ్య అంటే
గెలువ శక్యంకానిది అనే పేరు ఏర్పడింది.)
ఈ శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి
స్వర్గమనిపేరు.  అది జీవచైతన్యస్వరూపమైన
జ్యోతిస్సుచే ఆవరించబడి ఉంది. ఈ పట్టణాన్ని
ఎవడు బ్రహ్మసంబంధమైనదిగా తెలిసికొంటాడో
వానికి బ్రహ్మ, ప్రజాపతి, ఆయువు, కీర్తి, సంతానం
మొదలైనవానిని ఇస్తారు- అని పై వాక్యముల అర్థం.
దీన్ని బట్టి అయోధ్య అంటే మామూలు పట్టణం కాదని,
శరీరానికే అయోధ్య అని పేరు అని తెలుస్తున్నది.

Friday, September 1, 2017

అదికాక మరేమిటి?


అదికాక మరేమిటి?




సాహితీమిత్రులారా!

అడవిని మహానగరంగా
శత్రువును ఆత్మీయునిగా
ఎవరికి కనిపిస్తుందో
ఈ పద్యంలో చూడండి-
ఇది భర్తృహరి సుభాషితాలలోనిది-

భువనమునఁ బూర్వసంభృత పుణ్యరాశి
యగుచు నుదయంబు గావించిన సుగుణనిధికి
వనము పురమగుఁ, బరులాత్మజనము లగుదు,
రవని నిధిరత్నపరిపూర్ణ యయి ఫలించు

ఎవనికి పూర్వజన్మలో సంపాదిచుకున్న సుకృత
సంపద సమృద్ధిగా ఉంటుందో అలాంటి సుగుణశాలికి-
అడవి నగరంగాను, శత్రువులు ఆత్మీయులుగాను,
భూమి అంతా నిధులతోను, రత్నాలతోను నిండినదిగా
అగును - అని భావం.