బోన్సాయ్ మనుషులు(కథ)
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్
నుండి
బోన్సాయ్ మనుషులు కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్
నుండి
బోన్సాయ్ మనుషులు కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
స్పూర్తినిచ్చే మహనీయుల
చరిత్రలలో సత్యజిత్ రే ఒకరు
వారిని గురించి కిరణ్ ప్రభ గారి
టాక్ షో నుండి ఈ మొదటి భాగం
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
బలభద్రపాత్రుని రమణి గారి
నవల ఒక బృందావనం
ఇది ఆడియో నవల
గాత్రం రచయితగారిది
ఆస్వాదించండి -
సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా నృసింహావతార(పోతనగారి) వర్ణన
ఆస్వాదించండి -
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్
నుండి
భలే మంచి చౌక బేరము కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
తంజావూరును పాలించిన విజయరాఘవుని
ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే
శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)
ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.
విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.
ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా
ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య
రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా
తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.
దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.
చూడండి ఆ పద్యం -
ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా
రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే
దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!
ఎవరైనా స్త్రీలు మావిషయం
స్మరించవలసిన అవసరంమేమి?
వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో
వశపరచుకునే తెలివి వారికి లేదా?
నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా
తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.
రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు
రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు
నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే
అని యుక్తిగా సమాధానమిచ్చింది.
సాహితీమిత్రులారా!
వనిత టీ.వీ. లో ప్రసారమైన
యద్దనపూడి సులోచనారాణి కథ
ప్రియనేస్తమా
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
లక్షీదేవి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో
ఈ శ్లోకం చూడండి-
క్షీరసాగరా త్పారిజాత పల్ల లేభ్యో, రాగమిందు
శకలా దేశాంతవక్రతా, ముచ్ఛైశ్రవైశ్చంచలతాం
కాల కూటన్మోహనశక్తిం, మదిరయా మదం,
కౌస్తుభమణి రతి నైష్ఠుర్యం, ఇత్యే తాని సహవాస
పరిచయవశా ద్విరహ వినోద చిహ్నాని గృహీత్యేవోద్గతా
పూర్వం అమృతమధనం కోసం దేవతలూ - దానవులూ
కలిసి పాలసముద్రం చిలికినపుడు, దాన్నుండి
కల్పవృక్షం - కామధేనువు - పాంచజన్యం - పారిజాతం-
ఉచ్ఛైశ్రవం - ఐరావతం - కౌస్తుభమణి - కాలకూటం -
చంద్రుడు - లక్ష్మీదేవి - ఇవన్నీ కూడ ఉద్భవించాయి.
ఈ ప్రకారంగా ఇవ్నీ లక్ష్మీదేవికి సోదరసోదరీమణులు కదా
వీటి పోలికలు కొన్నయినా ఉంటాయికదా
ముఖ్యంగా లక్ష్మీదేవికి వారి పోలికలు కొన్ని వచ్చాయి-
అవి చంద్రుని నుంచి వక్రత్వం
ఉచ్ఛైశ్రవం నుంచి చాంచల్యం
విషం నుంచి మైకం,
అమృతం నుండి మదం,
కౌస్తుభం నుండి కాఠిన్యం
వచ్చాయి అందువల్ల లక్ష్మీదేవి
స్వభావం ఎప్పుడు ఎలా ప్రదర్శించబడుతుందో
మానవులకు అంతు చిక్కకుండా పోయింది.
సాహితీమిత్రులారా!
వనిత టీ.వీ. లో ప్రసారమైన
యద్దనపూడి సులోచనారాణి కథ
హార్ట్ 'ఎట్' టాక్
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
వనిత టీ.వి.లో ప్రసారమైన
యద్దనపూడి సులోచనరాణి గారి
కథల నుండి తీసుకున్న కథ
అర్ధరూపాయి అప్పు
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
వనిత టీ.వి.లో ప్రసారమైన
యద్దనపూడి సులోచనరాణి గారి
కథల నుండి తీసుకున్న కథ
రాతిహృదయం
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి-
ఎవరిమీదైనా కోపం వచ్చినపుడు
గాడిదకొడకా -అని తిట్టడం
ఒక అలవాటు కదా!
దీన్నే ఒక కవి ఈ పద్యంలో
ఎలా చమత్కరించాడో చూడండి-
ఆడిన మాటలు దప్పిన
గాడిద కొడుకంచు దిట్టగా విని యయ్యో
వీడా నాకొక కొడుకని
గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!
ఆడిన మాట తప్పినవాణ్ని,
అబద్దాలు చెప్పేవాణ్ని,
గాడిద కొడుకా - అని తిట్టినపుడు
ఆ తిట్టును గాడిద విని,
అయ్యో !ఛీ! ఇటు ఆడితప్పేవాడు
నా కొడుకా? ఎంత అవమానం - అని సిగ్గుతో
బాధపడిందట.
అంటే ఆడినమాట తప్పేవాడు గాడిదకంటే
అధముడని చెప్పడం కవి భావన.
సాహితీమిత్రులారా!
కొప్పర్తి సాహితీ వాహిని నుండి-
మునిపల్లెరాజు గారి కథ
చెప్పులు దానం
వినిపించినవారు
కొప్పర్తి రాంబాబు
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
తిమ్మగజపతి అనే సంస్థాధిపతి బహులోభి.
అందరు తనను అంటున్నారనికూడ తిమ్మగజపతికి తెలుసు.
అలాంటి లోభి నుండి పారితోషికము అందుకొన్నాడొక
కవి అది ఈ పద్యంతో చూడండి.
"ఇవ్వడు ఇవ్వడంచు" జనులెప్పుడు తప్పక చెప్పుచుందు
రే
మివ్వడు? అన్యకాంత కురమివ్వడు! సంగరమందు వె
న్నివ్వడు! శత్రులన్ ప్రబలనివ్వడు! బెబ్బులినైన పట్టి పో
నివ్వ డసత్యవాక్య మెపుడివ్వడు తిమ్మ జగత్పతీంద్రుడే!
కవి చమత్కారం ఎంత గొప్పదో కదా!
ఇవ్వడు ఇవ్వడు అంటారు తిమ్మగజపతిని అది వాస్తవమే
ఆయన ఏమివ్వడో చూడండి.
పరస్త్రీకి మనసివ్వడు
యద్ధములో వెన్నివ్వడు(పారిపోడు)
శత్రువులను ప్రబలనివ్వడు(ఎక్కువకానీడు)
బెబ్బలినైన పట్టి పోనివ్వడు
అసత్యవాక్యన్ని ఎప్పుడూ ఇవ్వడు
ఇన్నిరకాలుగా ఇవ్వనివాడు - అని మంచి పనులే చూపించాడు కవి
అందుకే ఇవ్వనివాడు పారితోషికమిచ్చాడు.
కవికలం
రాజు కత్తికంటె బలమైనది.
అంటారుకదా!
అది ఇదేనేమో!
సాహితీమిత్రులారా!
కవి చమత్కారం ఎంత ఉంటుందో!
ఈ పద్యంలో చూపించాడు కవి
ఆ చమత్కారం చూడండి-
వాస శ్చర్మ విభూషణాని ఫణిన: భస్మాంగరాగోధునా
గౌరేక: నచ కర్షణే నకుశల: సంపత్తి రేతాదృశీ
ఇత్యాలోచ్య విముచ్య శంకర మగాత్ రత్నాకరం జాహ్నవీ
వ్యర్థం నిర్ధనికస్య జీవన మహోదారై రపిత్యజ్యతే
ధరించేది చర్మం,
ఆభరణాలు సర్పాలు,
అంగరాగము చితాభస్మము,
ఉన్నది ఒక్క ఎద్దు,
అది దున్నుటకు ఉపయోగపడదు.
ఈయన ఐశ్వర్యమిది -
అని ఆలోచించి గంగాదేవి
శంకరుని విడచి రత్నాకరుని
(సముద్రుని) చేరింది-
ఆహా! ధనహీనుని జీవితమెంత వ్యర్థము
చివరికి భార్యకూడా విడిచి పెడుతుందికదా!
సాహితీమిత్రులారా!
తెనాలి రామకృష్ణుని పద్యంగా
ప్రచారంలో ఉన్న పద్యం ఇది చూడండి-
కవి అల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవి యను నామంబు నీటి కాకికి లేదే
తిక్కన సోమయాజి, అల్లసాని పెద్దన
ఇద్దరూ చెప్పుకోదగిన కవులు -
రామకృష్ణుడనే పేరుగల నేను
కూడ కవిగా పేర్కొనబడుతున్నాను.
కవి అనే పదానికి నీటి కాకి
అనే అర్థం కూడ ఉన్నదికదా!
కవి అనే మాట వాడుకలో ఉన్నంత
మాత్రాన నేను వారిద్దరితో
సమానుణ్ని కాలేను.
వారికీ నాకు కవితాశక్తిలో ఎంతో
తారతమ్యం ఉంది -
అని రామకృష్ణుడు తన వినయాన్ని
చాటుకున్నాడు.
(క = నీరు, వి = పక్షి, కవి = నీటిపక్షి)
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్
నుండి
వటపత్రశాయి కథానిక ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
పెరంబుదూరు లక్ష్మీనరసింహాచార్యులుగారు
ఒకసారి తిరుమల వెళ్ళినపుడు అక్కడి పరిస్థితులు
నచ్చక భగవంతునితో మొరపెట్టుకున్నట్లు కొన్ని
పద్యాలు రాశారు. వాటిలోని ఒక పద్యం ఇది చూడండి
తిండిలేక గాదు, పరదేశము చూచుటకిచ్చగాదు, మా
యండలు బాసివచ్చి భవదంగణమందున పస్తుపండగా
గండమదేమి భక్తులను గాచెడి సాహసివండ్రుగాని నీ
తొండిదివాణమందు వడ దోశెల నమ్ము దురయ్యదుర్గతిన్
భక్తులు తిండిలేక గాని,
దేశాలు చూడాలని గాని నీ దగ్గరికి రారు,
వారి బలగాన్ని వసతులను వదలుకొని వచ్చి
నీ వాకిట్లో పస్తుపడుకోవలసి రావటం ఏమిగతి
నీవు భక్తులను కాపాడే వాడవంటారే,
కాని నీ అక్రమాల కార్యాలయంలో వడలు,
దోసెలు వంటి ప్రసాదాలను అమ్ముతారా
అది ఏమి దుర్దశ భక్తులకు నీ ప్రసాదం కూడ
ఉచితంగా అందించలేవా - అని ఆవేదనతో
కవి అన్నాడని భావం
అది శ్రీవారు విన్నారేమో
ఇప్పుడు నిత్యాన్నదాన సత్రం ఏర్పడింది.
సాహితీమిత్రులారా!
మద్దుపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు
1959-60 సంవత్సరమునందు కర్నూలు
సెంట్ జోసెఫ్స్ గరల్స్ హైస్కూలులో
ప్రధానాంధ్ర పండితుడుగా పనిచేయు సమయంలో
అక్కడి ఉపాధ్యాయులుగా ఉన్న సిస్టర్స్ అక్కడి క్రమశిక్షణ
గురించి చెబుతూ ఇక్కడ ఆకుకూడ కదలదని చెప్పిరట.
దానికిగాను ఆయన చమత్కరించిన ఈ శ్లోకం చూడండి-
పత్రం వాపి ప్రచలతి న వై బాలికా పాఠశాలా
స్వేవం శిక్షాక్రమ ఇతిపదే దేవమే వాస్తుఃకింతు
మద్భావోऽయంన చలతి మరుత్త్వత్రభిత్యేతి యస్మా
ద్వేణి బంధైర్విషధరనిభైరత్ర కాంతాశ్చరన్తి
ఇక్కడ ఆకులు కదలక పోవటానికి
కారణం ఇక్కడి క్రమశిక్షణకాదు
మద్భావోయం - నా అభిప్రాయమేమనగా
నచలతి మరుత్త్వత్ర భీత్యేతి-
ఇక్కడ గాలి సంచరించటంలేదు
కాన ఆకులు కదలటంలేదు
గాలి సంచరించలేదనగా
భీత్యా - భయంచేత,
గాలి ఎందుకు భయపడవలసిన పని
ఏమంటే విషధర నిభై - పాముల వంటి
వేణిబంధైః - జడలతో
అత్ర కాన్తాశ్చరన్తి- ఇక్కడ యువతులు పెక్కు
మంది తిరుగుతున్నారు కనుక
పాములు వాతాశనములు(గాలిని భుజించేవి)గనుక
తన్నెక్కడ మ్రింగిపోతాయో అని భయపడి గాలి
ఈ ప్రక్కకు రాకుండా పోయింది.
అందుచే ఆకు కదలాడకున్నది.
సాహితీమిత్రులారా!
శ్రీశ్రీ గారి కథ జాలి
దూరదర్శన్ లో ప్రసారమైన
టెలిఫిల్మ్ - జాలి
వీక్షించండి-
సాహితీమిత్రులారా!
చమత్కారాలలో భావ చమత్కారమొకటి
చెప్పదలచుకొన్న భావాన్ని సూటిగా
చెప్పకుండా చిత్రమైన మలుపు త్రిప్పి
చమత్కారంగా చెప్పటాన్ని
భావచమత్కారం
అంటారు.
ఇద్దరు ప్రేమికులు గోదావరీతీరంలో
ప్రతిదినం ఒక పూలతోటలో ప్రొద్దున్నే
కలుసుకొంటున్నారు. అదే సమయానికి
ఒక బైరాగి పూలకోసం అక్కడికి వచ్చేవాడు.
ఆ సన్యాసివేషం చూచి కుక్క ఒకటి
మొరుగుతూ అతని మీదికి వచ్చేది.
కుక్క మీదికి రావటం అతనికి ఇబ్బంది.
అతడు అక్కడికి రావడం ఈ ప్రేమికులకు
ఇబ్బంది. ప్రేమికులైన యువతీయువకు
లిద్దరు ఆ సన్యాసిని అక్కడకు రాకుండా
చెయ్యాలనుకున్నారు. అట్లని,
బైరాగీ నీవు రావద్దని
అతనితో ఎలా చెప్పగలరు
యువతి ఆలోచించించింది-
అతణ్ణి రాకుండా చెయ్యటానికి --
ఇచ్చకొలఁదిఁ దిరుగు మింక బైరాగి గో
దావరీతటమున దట్డమైన
పొదలఁ జేరి యొక్క పొగరైన సింగ మా
కుక్కపోతు నిపుడె కూల్చి చంపె
(గాథా సప్తశతి)
అని చెప్పింది.
ఆ బైరాగి ఇక స్వేచ్ఛగా రావచ్చట
అతణ్ణి ఇబ్బంది పెడుతున్న కుక్కను
అక్కడే దట్టమైన పొదల్లో ఉన్న పొగరైన
సింహం ఇప్పుడే కూల్చి చంపిందట
కుక్కతోనే ఇబ్బంది పడుతున్న సన్యాసి
ఇక వస్తాడా రానే రాడు. కాని, ఆమె
ఆ సన్యాసిని రావద్దని చెప్పిందా
చెప్పలేదే. అట్లని రావద్దని చెప్పలేదా
చెప్పింది. చెప్పకుండా చెప్పింది.
ఆ సన్యాసి మనస్సు నొచ్చుకోకుండా
చెప్పింది. దీన్నే భావ చమత్కారం అంటారు.
సాహితీమిత్రులారా!
విశ్వనాథ సత్యనారాయణగారు
తన విశ్వనాథ పంచశతిలో
కూర్చిన పద్యం చూడండి -
ఇందులోని చమత్కారమేమో
గమనించండి-
ఊరిభార్య లెల్ల రూహించి యామె మం
చంబుతో నిడిరి శ్మశానమందు
నట పిశాచకాంత లాలోచనము చేసి
పడతి మరల నూరి నడుమ నిడిరి
(విశ్వనాథ పంచశతి)
ఇందులో ఒక మహాతల్లి ఎంత గయ్యాళో
కవి చెప్పదలుచుకొన్నాడు కానీ ఆమె గయ్యాళి
అని ఒక్కమాటైనా అనకుండానే ఎలా చెప్పాడో
చూడండి-
ఊళ్ళో ఉన్న భార్యలంతా సమావేశం జరిపి
ఈ గయ్యాళిని విదిలించేందుకు ఇదే సరైన మార్గమని
రాత్రివేళ ఆమెను మంచంతో కూడ మోసుకొని పోయి
శ్మశానంలో ఉంచి వచ్చారు. ఆ శ్మశానంలోని పిశాచకాంతలు
తెల్లవారే సరికి ఆమెను పీక్కుతింటాని ఊరివారంతా సంతోషించారు.
పాపం వాళ్ళకోరిక నెరవేరలేదు. శ్మశానంలోని పిశాచకాంతలంతా
ఆలోచించి తెల్లవారేలోగా ఆమెను మంచంతో సహా మోసుకొని వచ్చి
ఊళ్ళో దించి వెళ్ళారట.
దీన్ని బట్టి ఆమె ఎంత గయ్యాళో
చెప్పక్కరలేదుకదా!
ఎంత చమత్కరించారో కదా!
సాహితీమిత్రులారా!
పానకాలరాయకవి
తన మనసుకు ప్రబోధిస్తూ
విష్ణువును తలవమని చెబుతూ చెప్పిన పద్యం ఇది
తన మానస శతకంలో శ్రీమహావిష్ణువు దినచర్యను
ఎంత చక్కగా నేటి మన ముఖ్యమంత్రుల, ప్రధానమంత్రుల
దినచర్యతో సరిపోల్చే విధంగా వివరించాడో గమనించగలరు-
తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!
తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!
సాహితీమిత్రులారా!
అనర్ఘరాఘవ నాటకాన్ని రచించిన మురారి గొప్పదనాన్ని
వివరించే పద్యం ఇది చూడండి-
దేవీం వాచ ముపాసతేహి బహవ స్సారంతు సారస్వతం
జానీతే నితరామసౌ గురుకులక్లిష్టో మురారిః కవిః
అబ్దిర్లంఘిత ఏవ వానరభటైః కింత్వస్యగంభీరతా
మాపాతాళనిమగ్న పీవరతను ర్జానాతి మంథాచలః
ఎందఱో కవులు కవితా సరస్వతిని ఉపాసించువారున్నారు
కానిీ అత్యంతమైన గురుకులక్లేశమును అనుభవించి విద్యలు
సాధించిన ఒక్క మురారికవి మాత్రమే సారస్వతసారమును
చాలా బాగా పూర్తిగా తెలిసివున్నాడు. వానర గణాలకు
సముద్రమును పైపైనదాటి పోవడం మాత్రమే తెలుసు.
పాతాళం వరకు మునిగిన మందరగిరి మాత్రమే సముద్రంయొక్క
గాంభీర్యాన్ని లోతును తెలిసినది. అనగా చపలచిత్తులైన
వానరులవలె కవితా చాపల్యముగల యితరకవులు తమ భావాలకు
అనుగుణమైన నైఘంటికార్థాలు గల పదాలను వాడి పద్యరచన పూర్తి
చేసికొని ఆనందిస్తారేకాని, పద పదై కదేశ ప్రకృతిప్రత్యయాదుల
అర్థవిశేషాలను సమర్థతతో తెలుసుకొని సుష్ఠుప్రయోగాలను చేయలేరని
- శ్లోకభావం.
దీన్ని బట్టి కేవలం కవిత్వం నిఘంటువుల్లోని పదాలను వాడటమేకాదు
కవి అనేవాడు ఆ పదాలకు సంబంధించిన లోతైన విషయాలనుకూడా
తెలిసి వుండాలని శ్లోకాంతరార్థం. మరియు ఇది కేవలం మురారి కవికేకాదు
అందరు కవులకు సంబంధించినది.
సాహితీమిత్రులారా!
పొత్తూరి విజయలక్ష్మిగారి హాస్యకథానిక
వసంతవల్లరి నుండి
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్
నుండి
నా ఇల్లు కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
పారిపోయిన లెక్కల మాస్టారు
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
న్యాయపతి రాఘవరావు గారి కథ
దూరదర్శన్ లో ప్రసారమైంది.
కొత్తరూపాయి కథ
ఇక్కడ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
సింహప్రసాద్ గారి తెలుగు షార్ట్ స్టోరీస్
నుండి
చాలు కథ ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
కొప్పర్తి సాహితీ వాహిని నుండి
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి
డు ము వు లు - కథ
కొప్పర్తి రాంబాబుగారి గళంలో
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
మల్లాది రామకృష్ణశాస్త్రి గారి కథ
దూరదర్శన్ వారు ప్రసారం చేసినది
కథ - ఔనౌను
వీక్షించండి-
సాహితీమిత్రులారా!
దూరదర్శన్ లో ప్రసారమైన కథ - రంగ
రచన- కొమ్మూరి పద్మావతీదేవి
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
మన పూర్వులు చెప్పిన మంచిమాటలలో
చాల గొప్ప విషయాలున్నాయి.
చారుచర్య అనే నీతిశాస్త్రంలో
చెప్పిన ఈ నీతి అంశాన్ని గమనించగలరు.
నేటి సమాజంలో స్త్రీకి ఎంత విలువ ఉందో
మనం రోజువారి జరిగే సంఘటనలను బట్టి
తెలుస్తూంది. ఎలాంటి స్త్రీలతో కలువకూడదో
కామపు చూపు చూడకూడదో
చెప్పే పద్యం ఇది గమనించగలరు-
వనితలు సంభోగమున వర్జనీయలు
తగఁదన్ను నేలు నాతని పురంధ్రి
బంధువు నిల్లాలు బ్రాహ్మణోత్తము భార్య
చెలికాని పడఁతి వీరలఁ దలంప
మాతృసమానలు మనువు దప్పిన యింతి
కన్నియ ముదిసిన కాంత రూప
శీలగుణమ్ములచేత నిందితయైన
ముదితయుఁ దనజాతి మాత్రకంటె
నతిశయంబగు వర్ణంబు నతివ బొగ్గు
చాయ మేనిది కడుఁబల్ల చాయ పడఁతి
పెద్దవళులది కడురోగి తద్ద బడుగు
గేడి గుజ్జనఁబడు వీరిఁ గూడఁ జనదు
(చారుచర్య-57)
ఎవితో కలువకూడదో చారుచర్య కారుడు ఈ విధంగా
చెబుతున్నాడు-
1. యజమాని భార్య, 2. బంధువు భార్య, 3. ఉత్తమ బ్రాహ్మణుని భార్య,
4. స్నేహితిని భార్య వీరంతా తల్లితో సమానులు. ఇంకా
ఎవరితో కలువకూడదంటే వివాహము చెడిపోయిన స్త్రీని,
రజస్వలకాని స్త్రీ అంటే కన్నియను, ముసలి స్త్రీని,
రూపము శీలము గుణములేని స్త్రీని,
తనకంటే పైజాతికి చెందిన స్త్రీని,
నల్లని బొగ్గలాంటి స్త్రీని, పల్లపు(ఎర్రనిరంగు)స్త్రీని,
పొట్టపైన పెద్దపెద్ద ముడుతలు పడిన స్త్రీని,
జబ్బుపడిన స్త్రీని, బాగా ఓపికలేని స్త్రీని,
పొట్టిపొట్టి కాళ్ళుచేతులు గల స్త్రీ -
ఇలాంటి స్త్రీలతో సంభోగించరాదని భావం.
సాహితీమిత్రులారా!
సాహితీమిత్రులారా!
కాశీ కృష్ణమాచార్యులవారు చెప్పిన
గంజాయి మీది పద్యం
ఆస్వాదించండి-
తన్నుఁబట్టిన వారిఁదాఁబట్టి నవ్వించు
పచ్చి బోగము లంజ పాడు గంజ
తనుఁద్రావు నందరి నటేశులఁజేసి
యాడింపఁగల లంజ పాడు గంజ
తుదిమొదల్లేని యున్మదపు పల్కుల పంట
పండబారిన గింజ సాడు గంజ
పలుతావుంకుఁబారు బైరాగులను మంద
పసులగట్టెడు గుంజ పాడు గంజ
త్రావువారికి గుడగుడధ్వనులఁదనదు
జాడసూచింప గల రుంజ పాడు గంజ
తప్పద్రావినవారల తలల మిత్తి
పాదుకొల్పిన కుడియంజ పాడు గంజ
సాహితీమిత్రులారా!
దేవరకొండ బాలగంగాధరతిలక్ గారి
అమృతం కురిసిన రాత్రి - నుండి
ప్రాతఃకాలం కవిత
ఆస్వాదించండి-
చీకటి నవ్విన
చిన్ని వెలుతురా!
వాకిట వెసిన
వేకువ తులసివా!
ఆ శాకుంతల ధ్వాంతములో
నవసి యిలపై వ్రాలిన
అలరువా! - అప్స
రాంగనా సఖీ చిరవిరహ
నిద్రా పరిష్వంగము విడ
ఉడు పథమున జారిన
మంచు కలవా!
ఆకలి మాడుచు
వాకిట వాకిట
దిరిగే పేదల
సురిగా దీనుల
సుఖ సుప్తిని చెరచే
సుందర రాక్షసివా!
యుద్ధాగ్ని పొగవో - వి
రుద్ధ జీవుల రుద్ధ కంఠాల
రొదలో కదిలెడి యెదవో!
అబద్ధపు బ్రతుకుల వ్యవ
హారాల కిక మొదలో?
కవికుమారుని శుంభ
త్కరుణా గీతమవా!
శ్రీ శాంభవి కూర్చిన
శివఫాల విలసితమౌ
వెలుగుల బూదివా!
దేశభక్తులూ, ధర్మపురుషులూ
చిట్టితల్లులూ, సీమంతినులూ
ముద్దుబాలురూ, ముత్తైదువలూ
కూడియాడుచు కోకిల గళముల
పాడిన శుభాభినవ ప్రభాత
గీత ధవళిమవా!
సాహితీమిత్రులారా!
శ్రీశ్రీగారి మహాప్రస్థానం నుండి
ఒక రాత్రి కవిత ఆస్వాదించండి-
గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి -
బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
ఆకాశపు టెడారి నంతటా, అకట!
ఈ రేయి రేగింది ఇసుకతుఫాను!
గాలిలో కనరాని గడుసు దయ్యాలు
భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి!
నోరెత్త, హోరెత్తి నొగులు సాగరము!
కరి కళేబరములా కదలదు కొండ!
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి!
విశ్వమంతా నిండి, వెలిబూది వోలె
బహుళపంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
సాహితీమిత్రులారా!
దాశరథి గారి ఈ కవిత వీక్షించండి-
ఇది ఆలోచనా లోచనాలు సంకలనంలోనిది.
చీకటి చీర కట్టుకొని
ఆకలి రైక తొడుక్కొని
శోకంతో కుమిలిపోతున్న లోక కన్యను
చెరపడుతున్నాడు కాల రాక్షసుడు
చుక్కలు చూస్తున్నాయి
నక్కలు కూస్తున్నాయి
ఆదుకోలేక అమాయక జీవులు
అడుగు వెనక్కు వేస్తున్నాయి
నిరాశలు నిప్పుమంటలై రేగుతున్నాయి
దురాశలు దుందుభులై మోగుత్తన్నాయి
ఆశకు ఆయువు తీరిపోయిందా?
అవని అశాంతి యవనికలో దాగిపోయిందా?
ఇది కథకాదు, కాలుతున్న సొద
ఇది యెదలో సాగుతున్న రొద
దీన్ని కలకాలం భరించలేం కద?
అందుకే సమరం సాగింతాం, పద!
చూపుల సెర్చిలైట్లకు అడ్డంగా
దాపురించిన ఈ అంధకార గంగ
ఆలోచనా లోచన కాంతిపథంలో
అదృశ్యమైపోతుంది ఒక్క క్షణంలో
ఈ భయంకర బాధామయ ధాత్రి
ఇక ప్రియంకరమౌతుంది ఈ రాత్రి;
వ్యాపిస్తున్నై నవకాంతి జ్వాలలు
అవి మానవతా మందార మాలలు!!
సాహితీమిత్రులారా!
అడవి బాపిరాజు గారి
కథను దూరదర్శన్ వారు
వడగళ్ళు టెలిఫిల్మ్ గా ప్రసారం చేశారు
అది ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
కట్నాలు వద్దు కానుకలు కూడా వొద్దు
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
ఆలిండియా రేడియో హైదరబాదు వారు ప్రసారం చేసిన
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఇంటర్వూ
వినండి-
సాహితీమిత్రులారా!
త్రిపురనేని గోపీచంద్ గారి నవల
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
టెలిఫిల్మ్ గా దూరదర్శన్ నందు
ప్రసారితమైంది ఆ టెలిఫిల్మ్
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
సకల కలా కోవిదుడు
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
కర్పూరవసంతరాయలు
రచన --డా; సి, నారాయణ రెడ్డి-- ప్రచురణ-- 1957
ఇది ఒక కథాత్మక గేయకావ్యం. క్లుప్తంగా కథాశరీరం. 'కుమారగిరి', 'లకుమ' నాట్యానికి, ఆమె తనూ లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమ ను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. రెడ్డీ రాజులచరిత్రకు ప్రాణం పోసిన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిచ్చారు నారాయణ రెడ్డి గారు. ఈ కావ్యాన్ని టెలిఫిల్మ్ గా తీశారు దాన్ని వీక్షించండి-
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
కోరీ భుజింతును - గోంగూర పచ్చడి
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
దూరదర్శన్ సప్తగిరి ఛానల్ వారు
ఈ మధ్యే ప్రసారం చేసిన
సినారె వైభవం
మొదటి ఎపిసోడ్ వీక్షించండి
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
కాలాతీత వ్యక్తులు
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
హైదరాబాదు దూరదర్శన్ వారు
సాలార్ జంగ్ మ్యూజియమ్
గురించి కొన్ని వీడియోలు ప్రసారం చేశారు
వాటిని వరుసగా ఇక్కడ చూద్దాం-
సాహితీమిత్రులారా!
మునిమాణిక్యం నరసింహారావు గారి
కాంతం కథలు దూరదర్శన్ వారు
ప్రసారం చేశారు వాటిలో
అపోహ కథ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
మనం అనేక పదాలను వాటి అర్థాలను
పోగొట్టుకుంటున్నాము
అలాంటి పదాలలో
పదాలు కొన్ని
వీటిని గురించి తెలుసుకుందాం
పౌర్ణమి తిథి రెండు విధాలు
1. రాకా - రాత్రీ పగలూ మొత్తం అంతా పౌర్ణమి ఉంటే అది రాకా
2. అనుమతీ -పగటికాలం వరకే పౌర్ణమీతిథి ఉంటే అది అనుమతీ
అలాగే
అమావాస్య తిథి రెండు విధాలు
1. సినీవాలి- అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు
సూర్యోదయం వరకు ఉంటే అది సినీవాలి
2. కుహూ - అమావాస్య తిథి సూర్యోదయం మొదలు మరుసటిరోజు
సూర్యోదయం కన్న ఎక్కువ ఉంటే అది కుహూ
మనం మనభాషనే మరచిపోతున్న రోజులివి పదాలొక లెక్కా అంటే
నేను చెప్పలేను కానీ వీలైనంతైనా పదాలను గుర్తుంచుకుందామని నా అభిప్రాయం.
సాహితీమిత్రులారా!
ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు
"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే
ఈ పద్యం చూడండి.
ఎంత
చమత్కారంగా ఉందో!
జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్
కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ
పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!
గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే
(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా
మాట్లాడుకోవటానికి నోచుకోలేదట
ఎందుకంటే .........
తలమీద గంగ, చంద్రుడు, మెడలో పాము, నొసట అగ్ని
- ఇన్ని విడవనివి ఉంటే
ఇక ఇక ఏకాంతం ఎక్కడ)
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
వంటావిడ - ఇంటావిడ
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
మునిమాణిక్యం నరసింహారావు గారి
కాంతం కథలు దూరదర్శన్ వారు
ప్రసారం చేశారు వాటిలో
నామకరణం కథ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర మాహత్మ్యంలో
అనేక నగ్నసత్యాలను వాక్రుచ్చారు
అందులోనివి కొన్ని-
వీడెం బబ్బినప్పుడున్, దమనుతుల్ విన్నప్పుడుం, బొట్టలో
గూడున్నప్పు, శ్రీ విలాసములు పైకొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడుం చెలగు దంభప్రాయ విశ్రాణనా
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!
ఓ కాళహస్తీశ్వరా! నిన్ను నీ ధ్యానాన్ని మరచి, తమకు తాంబూలము దొరికినప్పుడు( భోగములు కలిగి ఆరురుచులతో కూడిన అన్నం భుజించిన తరువాత), తనను ఎవరైనా పొగిడినప్పుడు, కడుపునిండా తిండి ఉన్నప్పుడు, ఐశ్వర్య వైభవవిలాసాలు ఉన్నప్పుడు, గాయకులు పాడినప్పుడు, తమ గొప్పతనాన్ని చూపడానికి ఆడంబరంగా దానధర్మాలు చేస్తూ విర్రవీగువారిని ఏమనాలో తెలియడంలేదు.
కాయల్గాచె వధూనఖాగ్రంబులచేఁ గాయంబు, వక్షోజముల్
రాయన్రాపడె ఱొమ్ము, మన్మథవిహారక్లేశ విభ్రాంతిచే
ప్రాయంబాయను, బట్టగట్టెఁదల, చెప్పన్ రోత సంసారమేఁ
జేయంజాల విరక్తుఁ జేయఁ గదవే శ్రీకాళహస్తీశ్వరా
ఓ కాళహస్తీశ్వరా! స్త్రీల నఖక్షతాలతో శరీరం కాయలు గాచింది, వారి ఉరోజాల రాపిడితో నారొమ్ము స్పర్శలేకుండా గట్టిపడి రాయైపోయింది, మన్మథక్రీడాసక్తితో వయసంతా పోయి వయసైంది, తల వెండ్రుకలూడిపోయి బట్టతలైంది ఇలా ఎన్ని చెప్పను ఇప్పుడు సంసారం మీద అసహ్యం కలుగుతోంది. ఇక నాకు సంపూర్ణ వైరాగ్యాన్నిచ్చి భవబంధవిముక్తిని కలిగించు.
సాహితీమిత్రులారా!
కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి
రామాయణకల్పవృక్షం లో
సుందరకాండలో సీతమ్మవారి వర్ణనను
చెప్పెడి పద్యం దీనికి గరికపాటివారి
వ్యాఖ్య ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
ఉగ్రతాంబూలం
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
దూరదర్శన్ లో ప్రసారమైన కథ
బుర్రా వెంకటసుబ్రమణ్యం గారి
జేబురుమాలు కథ
ఆస్వాదించండి-
సాహితీమిత్రులారా!
భమిడిపాటి రామగోపాలం కథలు
దూరదర్శన్ నందు ప్రసారమయ్యాయి
వాటిలోని ఒక కథ
చిల్లర దేవుళ్ళు, చిన్న చిన్న రాళ్ళు
ఇక్కడ వీక్షించండి-
సాహితీమిత్రులారా!
న్యాయపతి రాఘరావుగారు వ్రాసిన కథలు
దూరదర్శన్ లో ప్రసారమయ్యాయి
వాటిలో ఇక్కడ గున్నయ్య గడ్డం
వీక్షించగలరు-