Saturday, October 22, 2016

భవభూతి కాళిదాసులలో ఎవరు ఎక్కువ?


భవభూతి కాళిదాసులలో ఎవరు ఎక్కువ?

సాహితీమిత్రులారా!


ఈ కథ వినండి. ఒకమారు కాళిదాసు
భవభూతి తమతమ కావ్యాలను తీసుకొని
సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళారట. తమలో
ఎవరు గొప్పనో తేల్చుకోవటానికి. అదే ఆమెను అడిగారు.
అప్పుడు ఆమె ఒక త్రాసు తెప్పించి అందులో
వారిద్దరి కావ్యాలను త్రాసులో చెరోవైపు ఉంచింది.
భవభూతి కావ్యంగల వైపు కొంచెం పైకి లేచిందట.
అది చూచి ఆమె వెంటనే తన చెవిపైనుండే కలువపూవును
తీసి కొంచెం విదిలించిందట. వెంటనే దాన్నుండి
ఒక తేనె బిందువు ఆ కావ్యంపై పడిందట.
వెంటనే రెండువైపులా సమానమైనవట.
ఈ వృత్తాంతాన్ని భోజప్రబంధం అనే కావ్యంలో
భల్లాలసేనుడు వివరిస్తూ
సరస్వతిని ప్రార్థించిన
ఈ శ్లోకం చూడండి-
అహోమే సౌభాగ్యం మమచ భవభూతేశ్చ భణితి
తులాయామరోప్య ప్రతిఫలతి తస్యాం లఘిమని
గిరాం దేవి సద్య: శ్రుతి కలిత కల్హార కళికా
మ ధూళీ మాధుర్యం క్షిపతి పరిపూర్త్యై భగవతి

కాళిదాసు కాళీభక్తుడు, భవభూతి సరస్వతీ ఉపాసకుడు.
అది తెలిసిన సరస్వతి తన భక్తుడైన భవభూతిని కాళిదాసుకంటె
 తేలిక కాకుండా ఆ విధంగా కాపాడుకున్నది.
కావున అటువంటి సరస్వతిని నేను వాక్కుకొరకు ప్రార్థిస్తున్నాను.


ఇందులో కాళిదాసు భవభూతి సమకాలీనులుకాదు కాని
అభిజ్ఞానశాకుంతలం, ఉత్తరరామచరితం రెండింటిని తులనాత్మకంగా
చూస్తే నాటక కల్పనలో ఉత్తరరామచరితం  శాకుంతలం కంటె కొంచె తగ్గినా
దానిలోని భాషాగౌరవం చేత రసస్పూర్తిచేత శాకుంతలానికి సరితూగుతుందని
ఈ కల్పన యొక్క సారాంశం

No comments:

Post a Comment