Saturday, October 8, 2016

నవపల్లవ కోమల కావ్యకన్యకన్


నవపల్లవ కోమల కావ్యకన్యకన్


సాహితీమిత్రులారా!


లోకంలో కొన్ని విషయాలు ప్రసిద్ధమై ప్రజల
నాడుల్లో జీర్ణించుకు పోయుంటాయి.
అలాంటివాటిలో పోతన శ్రీనాథుడు
బావమరుదులను విషయం.
పోతనను రాజాశ్రయం కోరమని శ్రీనాథుడు చెప్పినపుడు.
పోతన తనభావాన్ని ఈ పద్యంలో
ఎలా వివరించాడో చూడండి-

బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్
గూళుల కిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలకౌ
ద్దాలికులైన నేమి నిజదారసుతోదర పోణార్థమై


మామిడిచెట్టు లేత చిగురులవలె కోమలమైన
నా కావ్యకన్యను అధములైన రాజుకిచ్చి
వారిచ్చిన డబ్బుతో పొట్టనింపుకోవడం కంటె
కవులు నాగలిపట్టి పొలం దున్నితేనేమి?
అడవులలో కందమూలలాలను త్రవ్వుకొని
తింటూ జీవిస్తేనేమి?  భార్యాపుత్రులను పోషించు
కోవటానికి కూతురులాంటి కావ్యాన్నమ్ముకోవటం
కంటె స్వతంత్రంగా జీవించటమే మంచిది- అని భావం.

రాజాశ్రయాన్ని నిరాకరించిన అతి తక్కువ
మందికవులలో పోతన ముఖ్యమైనవాడు.


No comments:

Post a Comment