Thursday, September 22, 2016

స్వజాతి చైతన్యము విస్మరింతురో!


స్వజాతి చైతన్యము విస్మరింతురో!


సాహితీమిత్రులారా!

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు
తన విజయశ్రీ(కురుక్షేత్ర వీరకావ్యం)లో
పాండవులు మంత్రాలోచనం జరుపునపుడు
అందరు కృష్ణునితో చెప్పవలసినది చెప్పిన
తరువాత పాంచాలి మాటలు ఏవిధంగా కూర్చో చూడండి.

భుజాగ్రముల్ పొంగ పురోగమింతురో!
ధ్వజాగ్రముల్ వంగ తిరోగమింతురో!
శరమ్ములన్ దాల్చి పరాక్రమింతురో!
కరమ్ములన్ మోడ్చి పరిక్రమింతురో!

త్యజింతురో క్షాత్రకుల ప్రతిష్ఠలన్!
భజింతురో శాత్రవ పాదపద్మముల్!
భుజింతురో కానల కందమూలముల్!
సృజింతురో తాత్త్విక ధర్మశాస్త్రముల్!

స్మరింపుడీ భూత సభా ప్రమాణముల్!
ధరింపుఁడీ చేత ధనుష్ కృపాణముల్!
హరింపుఁడీ కౌరవ గర్వసంహతుల్!
భరింపుఁడీ పౌరవ గౌరవద్యుతుల్!

అధిష్ఠితోద్దండ రథిప్రకాండుఁడౌ
యుధిష్ఠిరుండెంతటి సార్థకాఖ్యుఁడో!
అజాతశత్రుత్వ యశోభిలాషలో
స్వజాతి చైతన్యము విస్మరింతురో!

No comments:

Post a Comment