Thursday, September 15, 2016

వరదరాజన్ కస్యదోషోయమ్


వరదరాజన్ కస్యదోషోయమ్


సాహితీమిత్రులారా!


మల్లినాథ సూరి వంశపు పూర్వ పురుషుడైన
కపర్ధి స్వామి చెప్పిన శ్లోకంగా ప్రసిద్ధమైంది.

దరిద్రుడైన ఒక యాచకుడు
రాజుగారితో ఇలా అన్నాడు

అంబా తుష్యతి న మయా
న స్నుషయా సాపి నాంబయా నమయా
అహమపి నతయా న తయా
వరదరాజన్ కస్యదోషోయమ్

ఓ రాజా! మా తల్లికి నా వలన సంతోషంలేదు.
కోడలి ద్వారా కూడ ఆమె సంతోషంగాలేదు.
నా భార్య కూడ మా అమ్మతో కాని, నాతో కాని
సంతోషంగా ఉండటంలేదు - నేను కూడ అమ్మతో కాని,
నా భార్యతో కాని సంతోషంగా లేను.
ఇది ఎవరిదోషమో నీవే చెప్పు- అని శ్లోకానికి భావం.

పై మాటలకు నా దరిద్రమే వీటన్నిటికి కారణం అని భావం
దరిద్రుని భార్యకాని తల్లికాని ప్రన్నంగా చూడరనే విషయం ప్రసిద్ధమైనదే కదా!


No comments:

Post a Comment