Friday, July 8, 2016

సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది


సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది


సాహితీమిత్రులారా!

ఈ చమత్కార శ్లోకాన్ని చూడండి.

విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతాంబు పర్ణాశనా:
తేపి స్త్రీ ముఖ పంకజం సులలితం సంవీక్ష్య మోహంగతా:
శాల్యన్నం సఘృతం పయో దధియుతం భుంజంతి యేమానవా:
తేషా మింద్రియనిగ్రహో యది భవేత్ వింధ్యప్లవేత్ సాగరే!

విశ్వామిత్రుడు, పరాశరుడు మొదలైనవారు
గాలి- నీరు - ఆకులను తినినవారు.
అలాంటివారు కూడ స్త్రీని చూచి మోహాన్ని పొందారు.
సన్నన్నం,
నెయ్యి,
పాలు,
పెరుగు
తిన్నవారికి ఇంద్రియ నిగ్రహం ఉంటే !
సముద్రంలో వింధ్యపర్వతం తేలుతుంది.
- అని భావం.
ఇది నిజమే కదా! కాదంటారా?

No comments:

Post a Comment