Monday, January 30, 2017

మూఢమూర్ఖజన గార్ధభముల్ముగురేకరాశియే


మూఢమూర్ఖజన గార్ధభముల్ముగురేకరాశియే



సాహితీమిత్రులారా!




ప్రతి ఒక్కరికి ఒకరు మెచ్చుకోవాలని
ఎందుకంటే అలా ప్రశంసలందుకొనే కళను
మరింతగా తన కృషిని పెంచుకుంటాడు
అదే విషయాన్ని చెప్పే ఈ పద్యం చూడండి-

చదివిన పద్యమందుఁగల సారమెరుంగఁగలేని యజ్ఞుడున్
హృదయము హాయి గన్నను గవీంద్రుని మెచ్చకపోవు కొంటెయున్
బదవి విశేషముండి, కృతి పద్యములూరక కోరు లోభియున్
గద భువి మూఢమూర్ఖజన గార్ధభముల్ముగురేకరాశియే

ఒక మంచి పద్యం చదివి దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అరసికుడు
భావం గ్రహించి మనస్సుకు రసానందం కలిగినప్పటికి ఆ కవిని మెచ్చుకోని
అవివేకి, ఏదో ఒక గొప్ప పదవిలో ఉండికూడ కావ్నాన్ని ఊరకే
తనకు అంకితం ఇవ్వాలని కవిని కోరే లోభి - ఈ ముగ్గురు
కూడ లోకంలో ఒకే జాతికి చెందినవారు. మూఢుఢు, మూర్ఖుడు,
గాడిద సమానమైనట్లుగా పై తెలిపినవారు కూడ గార్ధభసమానులే
- అని భావం
కవిత చదివి దాని సారాన్ని గ్రహించే చాతుర్యం,
చక్కని కవితను వ్రాసిన కవిని ప్రశంసించటం,
కవులకు సత్కారాలు చేసి కావ్యాలను అంకితం పొందడం
సహృదయులైనవారి కర్తవ్యాలని ఈ  పద్యం ఉద్దేశం.

No comments:

Post a Comment