Friday, December 9, 2016

వారు స్త్రీలు కారా?


వారు స్త్రీలు కారా?




సాహితీమిత్రులారా!


తంజావూరును పాలించిన విజయరాఘవుని
ఆస్థానంలో మన్నారుదాసవిలాసం(యక్షగానము) అనే
శృంగార కావ్యరచయిత్రి రంగాజీ (రంగాజమ్మ)
ఆస్థాన కవయిత్రిగా ఉండేది. చక్కని కవిత్వం చెప్పగలదిట్ట.
విజయరాఘవునిచేత కనకాభిషేక గౌరవాన్ని పొందినది.
ఆమె అంటే ఎక్కువ ప్రేమతో రాజుగారు ఎక్కువగా
ఆమెతోటి కాలం గడిపేవాడు. ఒకరోజు విజరాఘవుని భార్య
రంగాజమ్మ దగ్గరికి ఒక దూతికతో నిందా పూర్వకంగా
తన భర్త సాంగత్యము వదలుకొమ్మని సందేశం పంపినది.
దానికి రంగాజమ్మ ఈ పద్యంతో సమాధానం చెప్పింది.
చూడండి ఆ పద్యం -

ఏ వనితల్మముం దలపనేమి పనో! తమరాడువారు గా
రో వలపించు నేర్పెరుగరో! తమ కౌగిటిలోన నుండగా
రావది యేమిరా! విజయరామ! యటం చిలుదూరి బల్మిచే
దీవరకత్తెనైపెనగి తీసుకువచ్చితినా? తలోదరీ!

ఎవరైనా స్త్రీలు మావిషయం
స్మరించవలసిన అవసరంమేమి?
వారు స్త్రీలు కారా తమ భర్తను అనురాగంతో
వశపరచుకునే తెలివి వారికి లేదా?
నేను విజయరాఘవుడు ఆమె కౌగిలిలో ఉండగా
తీసుకొని వచ్చినానా? నన్ను నిందించటం ఎందుకు - అని భావం.

రాయలు తనంత తానే నా దగ్గరికి వస్తున్నాడు
రాణి తన ప్రేమతో ఆయనను బంధించలేనప్పుడు
నా దోషం ఏమున్నది అది ఆమె లోపమే
అని యుక్తిగా సమాధానమిచ్చింది.

No comments:

Post a Comment