Tuesday, December 13, 2016

ఈ సమయాల్లో తాంబూలం సేవిస్తే సుఖమట


ఈ సమయాల్లో తాంబూలం సేవిస్తే సుఖమట



సాహితీమిత్రులారా!


కవి చౌడప్ప అంటూనే బూతులే
చెప్పే కవి అని కొందరి అభిప్రాయం-
అది కొంతవరకు నిజమే కాని
ఈ పద్యం చూడండి-

పరగడుపున సభలలోపల
తరుణులయెడ భుక్తమైన తరి యొక విడెమున్
దొరకని వరునకు సౌఖ్యము 
కరవప్పా కుందవరపు కవి చౌడప్పా!

ఇది తాంబూల సేవనం ఎప్పుడు
చేయాలనేవిషయం సూచించే పద్యం

ఆహారం తీసుకోకముందు ఒకసారి,
ఎక్కడికైనా సభలకు వెళ్ళినపుడు,
స్త్రీలతో సల్లాపాలలో ఉన్నపుడు,
భోజనం చేసిన తరువాత -
ఈ సమయాల్లో ఒక్కవిడియము
దొరకక పోతే ఆ పురుషునికి
లోకంలో సుఖమనేది  కరువే అవుతుందట.

దీన్ని బట్టి ఆసమయాల్లో
తాంబూలం వేసుకోవాలని కవి భావం.

No comments:

Post a Comment