Tuesday, December 20, 2016

గోదాదేవి మేఘసందేశం


గోదాదేవి మేఘసందేశం




సాహితీమిత్రులారా!



సందేశాలు ఒక్కొక్కరు ఒక్కొకదానితో పంపించారు.
నలుడు హంసతో పంపాడు. బుద్ధజాతక కథల్లో
కామవిలాప జాతకకథలో భర్త భార్యకు వాయసం
ద్వారా సందేశం పంపిస్తాడు. అలాగే
దక్షింణభారతదేశ వైష్ణవుల దివ్యప్రబంధాల్లో ,
ప్రియుడైన వేంకటేశ్వరునకు గోదాదేవి మేఘం
ద్వారా పంపిన సందేశం ఇది చూడండి-

మిన్నా గత్తె  ళ గిన్ఱ వేగజ్గాళ్ వేఙ్గిడత్తు
త్తన్నా గ తిరుమంగె తఙ్గియ శీర్ మార్వఱ్కు
ఎన్నాగత్తిళజ్కోవిరిమ్బిత్తామ్  నాళ్ తోఱుమ్
పొన్నాగమ్ పుల్ గుదుర్క ఎన్ పురిపుడైమై శెప్పమినే
                               (ఆళ్వారుల మంగళాశాసన పాశురాలు - పుట 143)

విద్యుల్లతలతో కూడి యుండు ఓ మేఘములారా!
నూతనముగా అభివృద్ధి యగుచుండు నా కుచముల
యందాసపడి నన్ను గాఢాలింగనము చేసుకొనుగాక యని
ఎల్లపుడు ఆశపడుచున్నాను. ఈ విషయమును
వేంకటాచలమున వేంచేసి ఉన్న స్వామియగు
శ్రియఃపతికి విన్నవింపుడని గోదాదేవి మేఘములను
ప్రార్థించెను - అని భావం.

No comments:

Post a Comment