Saturday, December 31, 2016

కవిత వ్రాయటం గహనమైన విషయం


కవిత వ్రాయటం గహనమైన విషయం




సాహితీమిత్రులారా!

కవిత్వం రాయడం గొప్పవిషయమేమి కాదని
కొందరి అభిప్రాయం అది ఎంత కష్టమో?
శ్రీకంఠచరితంలో మంఖకుని
ఈ శ్లోకం చెబుతుంది-

అర్థోస్తి చే న్న పదశుద్ధి రథాప్తి సాపి
నో రీతి రస్తు, యది సా ఘటనా కుతస్త్యా
సాప్యస్తి చే దపి స వక్రగతి స్తదేతత్
వ్యర్థం, వినా రస మహోగహనం కవిత్వమ్

కవిత్వం చాల గహనమైంది
ఎందుకంటే
దానిలో అర్థం బాగా ఉంటే
పదాల శుద్ధి ఉండదు.
ఒక వేళ పదశుద్ధి ఉన్నా
రీతి సరిగా ఉండదు.
అది కుదిరితే పదసంఘటన
సరిగా ఉండదు.
అది కుదిరినా వక్రగతితో ఉంటుంది.
ఇవి అన్ని అమరినా దానిలో రసస్ఫూర్తి
సరిగా లేకపోతే అది వ్యర్థం.
అందువల్ల పదశుద్ధి, రీతి్, పదసంఘటన(శయ్య)
కలిగి రసప్రతిపాదితమైనది ఉత్తమ కవిత్వం.
అటువంటి కవిత వ్రాయటం చాల గహనమైన విషయం-
అని ఈ శ్లోకభావం.

No comments:

Post a Comment