Wednesday, December 14, 2016

మృదువై దేశీయమై భవ్యమై విననింపై.....


మృదువై దేశీయమై భవ్యమై వినింపై.....




సాహితీమిత్రులారా!

వాసవాంబ చరిత్రకు మూలం
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ.
వైశ్యపురాణం(వాసవీ మాహత్మ్యం)లో
వాసవి జననం నుండి ఆత్మార్పణవరకు
కథ వర్ణించడమైనది. దీని రచన కొరకు
వైశ్యులు వారి గురువైన భాస్కరాచార్యుల
వారిని వైశ్యప్రముఖులంతా వైశ్యపురాణాన్ని
రచించవలసినదిగా ఈ విధంగా కోరారట
ఆ పద్యం చెప్పారట -

తెనుగుంగా వ్యము జెప్పవయ్య మృదువై దేశీయమై భవ్యమై
వినింపై సరసత్వమై విరళమై విఖ్యాతమై కీర్తిమై
జనతా మోదక హృద్యపద్య యుతమై సద్ధర్మమై చోద్యమై
తనరం బల్కవె చింతయేల యనుచున్ ధర్మజ్ఞ భాషింపవే

మృదువుగా, దేశ్య పదభూయిష్టంగా, మేలు రకంగా ఉండి,
చెవులకింపుగా రసపరిపూర్ణంగా, అరుదైన రచన కలిగి,
ప్రశస్తమై కీర్తిని కలిగించేదిగా, చదివే పాఠకులకు
ఆనందాన్ని కలిగించే మనోహరములైన పద్యాలతో కూడి,
మంచి ధర్మ ప్రబోధకమై, ఆశ్చర్యముగా ప్రకాశించే తెనుగు కావ్యాన్ని
రచింపుము. నీవు ధర్మాలు తెలిసినవాడు కనుక నీకు ఈ విషయంలో
విచారమెందుకు అని వారి ప్రార్థన సారాంశం.



No comments:

Post a Comment