Sunday, December 18, 2016

నే వలచుటకేమి శంకరునివంటి మహాత్ముడు..........


నే వలచుటకేమి శంకరునివంటి మహాత్ముడు..........




సాహితీమిత్రులారా!


శ్రీనాథుని పద్యాలలో రసికత తోటి
హాస్యప్రియత్వం ద్యోకతమవుతుంది.
అలాంటిదానికి ఉదాహరణగా ఈ పద్యం చూద్దాం-

తొలకరి మించుతీవగతి తోప దుకాణము మీదనున్న య
య్యలికులవేణితోఁ దముల పాకుల బేరము లాడబోయి నే
వలచుట కేమి శంకరుని వంటి మహాత్ముడు లింగరూపియై
కులికెడు దాని గబ్బి చనుగుబ్బల సందున నాట్యమాడగన్

శ్రీనాథుడు తమలపాకుల బేరానికి అంగడికి పోగా అక్కడ
అందమైన పడుచు కనిపించింది. ఆమెను చూడగానే
మన కవిగారికి వలపు కలిగిందట. దాన్ని సమర్థిస్తూ
ఇలా అంటున్నాడు -

ఆ మెరుపుతీగవలె ఉన్న ఆ తరుణి
దుకాణంపై కూర్చుంటే ఆమెను చూచి
నేను వలచుటలో వింతేముంది అంతటి
మహాత్ముడు, మన్మథుని జయించినవాడు
అయిన శంకరుడే ఆమెను మోహించి,
ఆమె స్తన ద్వయం మధ్యలో లింగరూపంలో
చేరి నాట్యమాడుతుంటే ఇక నావంటివాడు
వలపులో పడటం వింతకాదు కదా!
- అని అంటున్నాడు.

ఇంతకూ ఆమె లింగధారి కాబట్టి
ఆమె మెడలో ధరించిన లింగం
ఎదపై వ్రేలాడుతూంది.
దీన్ని పరిహాసానికి
కూర్చాడు ఈ పద్యం.

No comments:

Post a Comment