Saturday, June 18, 2016

మీనాహతం పద్మమివాభితామ్రమ్


మీనాహతం పద్మమివాభితామ్రమ్


సాహితీమిత్రులారా!

రామాయణం సుందరకాండలో
హనుమంతులవారు అశోకవనం ప్రవేశించాడు.
అప్పుడు సీతాదేవికి శుభసూచకంగా
ఎడమకన్ను అదిరింది.
అది ఎలా అదిరిందో
వాల్మీకి మాటల్లోనే వినాలి
ఆ శ్లోకం చూడండి.


తస్యాశ్శుభం వామ మరాళపక్ష్మ
రాజీవృతం కృష్ణ విశాల శుక్లమ్
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా:
మీనాహతం పద్మమివాభితామ్రమ్

మంచి కేశపాశములు గలిగిన సీతాదేవికి ఎడమకన్ను అదిరింది.
ఆ ఎడమకన్ను ఎలా ఉందంటే శుభకరమైనదిగా ఉంది.
వంకరతిరిగిన కనురెప్పల వెండ్రుకల పంక్తితో చుట్టబడి ఉంది.
నల్లగ్రుడ్డు చుట్టూ తెల్లని విశాలప్రదేశం కలిగి ఉంది.
అటువంటి ఎడమకన్ను - సరస్సులోని నీళ్ళలో
(తామర)తూడుమీద చేపదెబ్బతిన్న
ఎఱ్ఱతామరపువ్వులా అదిరింది.

No comments:

Post a Comment