Sunday, June 5, 2016

కాలు జవ్వాడ మట్టియల్ కదిపి మ్రోయ


కాలు జవ్వాడ మట్టియల్ కదిపి మ్రోయ


సాహితీమిత్రులారా!

ఒకానొక సమయంలో ఒక వన్నెలాడి సింహాద్రి ఎక్కుతూ వెళుతున్న
శివభక్తురాలు కవిసార్వభౌముని కంటపడింది
ఆమె తీరును కవి ఈ విధంగా
వర్ణించాడు
చూడండి.

పొలు పొందగ విభూతి బొట్టు నెన్నొసలిపై తళుకొత్తు చెమట కుత్తల పడంగ
సొగసుగా పూదండ జొనిపిన కీల్గొప్పు జారగ నొక చేత సర్దుకొనుచు
బిగి చన్నుగవ మీద బిరుసు పయ్యెదచెంగు దిగజారి శివ సూత్ర మగపడంగ
ముక్కున హురు మంజి ముత్యాల ముంగర కమ్మ వాతెరమీద గంతు లిడగ
కాలు జవ్వాడ మట్టియల్ కదిపి మ్రోయ
కమ్మ విలుకాని జాళువా బొమ్మ యనగ
మెల్ల మెల్లన సింహాద్రి మీద కేగె 
కన్నె పూబోడి అగసాలి వన్నెలాడి

మెట్లెక్కే శ్రమ వల్ల చెమటపట్టి ముఖాన విభూతి బొట్టు తడిసిపోతున్నది.
అందంగా పూలదండ జొనిపిన కొప్పు జారుతుంటే ఒక చేత్తో సర్దుకొంటున్నది.
ఇంతలో స్తనాలమీది పైటచెంగు దిగజారి శివసూత్రం కనిపిస్తున్నది.
ముక్కున ముంగరలో హురమంజి ముత్యం పొదిగి ఉన్నది.
దాని కాంతి పెదవిమీద గంతులు వేస్తున్నది.
బంగారు బొమ్మవంటి ఆ మచ్చెకంటి
ఈ విధంగా సింహాద్రిని ఎక్కుతోందట.
కళ్ళకు ముందు చిత్రం గీసినట్లు
ఎంతగా వర్ణించాడో కదా!
ఆ మహాకవి.

No comments:

Post a Comment