Thursday, June 16, 2016

లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?


లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?


సాహితీమిత్రులారా!

మద్దుపల్లి వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారు
వేంకటేశ్వరునిపై చేసిన నిందాస్తుతి పద్యం చూడండి.

కడు నాపత్తున నుండి కావుమని మ్రొక్రన్ నిల్వుదోపించు - పే
ర్వడగా కొండలపాలుసేయు - దరిచేరన్ బోడికొట్టించుచుం
డెడుగా - తిర్పతి వేంకటేశ్వరుడు! కానీ యింత గావించినన్
చెడువాడందురె లక్ష్మియున్నపుడు దేనింగాని లెక్కింతురే?

ఆపదలో నిలువుదోపిడి - కొండను కాలినడక - బోడి కొట్టించుకొనుట-
ఇవి మ్రొక్కులు ఈ పనులు వేంకటేశ్వరుని చేష్టలుగా చెప్పి -
డబ్బున్నవాడు చేసిన చెడ్డపనులనుగూడ గొప్పగా చెప్పుకొంటారు.
ధనవంతుని తప్పులు కనిపించవులే -
అని
శాస్త్రిగారు నిందాపూర్వక స్తుతి చేస్తున్నారు.

No comments:

Post a Comment