Sunday, June 19, 2016

కవిత్వంలో అలంకారం


కవిత్వంలో అలంకారం


సాహితీమిత్రులారా!

కవిత్వంలో అలంకార ప్రాధాన్యాన్ని తెలిపే కథలు అనేకం ఉన్నాయి.
వాటిలో భోజ- కాళిదాసు కథలో కూడ ఉంది.
ఈ కథలోని  శ్లోకం చూడండి.


పండితులు - భోజనం దేహి రాజేంద్ర ఘృతంసూప సమన్వితమ్
కాళిదాసు -  మాహిషంచ శరచ్చంద్ర చంద్రికాధవళం ధధి


పండితులు చెప్పిన పాదం అర్థం -
ఓ రాజా మాకు పప్పు, నేతితో కూడిన భోజనం పెట్టు -
ఇందులో కవిత్వంలేదు సాధారణమైన మాటలే తప్పమరేముంది.
మరి కాళిదాసు చెప్పిన పాదం అర్థం -
శరత్కాలపు చంద్రుని వెన్నెలవంటి తెల్లటిగేదె పెరుగుతో భోజనం పెట్టు -
ఇందులో అలంకార పూరితమైన కవిత్వం ఉందికదా!
అందుకే రాజు ఈ పాదాలకుగాను పండితులకు  ధనంమాత్రమే ఇచ్చాడు.

No comments:

Post a Comment