Monday, June 6, 2016

వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు



వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు


సాహితీమిత్రులారా!

చేమకూర వేంకటకవి విజయవిలాసకావ్యంలో
రఘునాథనాయకుని దానగుణం
ఏవిధంగా
వర్ణించాడో చూడండి.

అడుగు మాత్రమె కాక యంత కెక్కుడుగ నీఁ
           జాలెనే యల బలిచక్రవర్తి?
యావేళ కటు దోఁచినంత మాత్రమె కాక
           కోర్కి కెచ్చిచ్చెనే యర్కసూతి?
తూఁగిన మాత్ర మిత్తుననెఁగా కిచ్చవ
           చ్చినది కొమ్మనియెనే శిబివిభుండు?
కలమాత్ర మపుడిచ్చెఁగాక కట్టడగాఁగ
           ననిశంబు నిచ్చెనే యమృతకరుఁడు?
వారి నేరీతిఁ బ్రతిసేయవచ్చు నెల్ల
యర్థులఁగృతార్థుల నొనర్చునట్టి యప్ర
తీప వితరణికి మహాప్రతాప తిగ్మ
ఘృణికి నచ్యుత రఘునాథ నృపతి మణికి?
                                  (విజయవిలాసము -1-25)

నాడు బలిచక్రవర్తి వామనునకు ఆయన అడిగిన అడుగులే
ఇచ్చినాడుకానీ ఒక్క అంగుళంకూడా
ఎక్కువ ఇవ్వలేకపోయాడు
ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలు అడిగినపుడు
అడిగినంతే ఇచ్చాడు కానీ కోరినదానికన్న
ఎక్కువ ఇవ్వలేక పోయాడు.
శిబి చక్రవర్తి శరణార్థియైన పావురము తూగినంత బరువుకు
బదులుగా తన శరీరంలోని మాంసం డేగకు తూగినంతనే ఇచ్చాడు
కానీ కొంచం కూడా ఎక్కువ ఇవ్వలేదు.
అమృతకిరణుడైన చంద్రుడు తన పదహారు కళలలో
ఏదినానికి ఆదినం ఒక్క కళమాత్రమే
నియమం ప్రకారం ఇస్తున్నాడు కానీ ఏల్లప్పుడూ
(రాత్రికాని సమయంలోను) ఇవ్వగలిగెనా
ఇవ్వలేకున్నాడు.
యాచకులందరికి సఫలమనోరథులుగా చేయునట్టి
ఎదురులేని దాతయు,
తేజములో సూర్యునితో సమానమైనవాడు
అయిన
రఘునాథనృపాలునికి ఆ బలి, కర్ణ, శిబి, చంద్రులు
ఏరీతిగా సరి పోల్చవచ్చు.
- అని భావం.

No comments:

Post a Comment