Thursday, May 26, 2016

యాచించుటలోని దైన్యము


యాచించుటలోని దైన్యము


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.
యాచించటంలోని దైన్యము
ఎంత చక్కగా వర్ణించబడినదో తెలుస్తుంది.

మానిసి కేడు జానల ప్రమాణము దేహము, యాచనార్థమై
పూనిన ఆఱు జానలగు, పోయి ధనాఢ్యుని యిల్లు చేరగా 
జానలు నాలుగౌ, నతని చల్లగ "దేహి" యటన్న రెండగున్,
పైన నతండు "నాస్తి" యనినన్ వినినంతన శూన్యమయ్యెడిన్!


మనుష్యుని దేహము 7 జానల పొడవుంటుంది.
యాచించుటకు(అడుక్కోవడానికి) సిద్ధపడగానే 6 జానలవుతుంది.
ధనవంతుని యిల్లు చేరగానే 4 జానలవుతుంది.
అతనిని "దేహి" అని అర్థించగానే 2 జానలవుతుంది.
ధనాఢ్యుడు "నాస్తి"  అనంటే అర్థించిన వ్యక్తి(అభిమానవంతుడు) శూన్యమై పోవును.

చూడండి కవి ఎంత సత్యాన్ని పద్యంలో కళ్ళ ఎదుట చిత్రించాడో!

No comments:

Post a Comment