Monday, May 16, 2016

సరససంభాషణలు



సరససంభాషణలు


సాహితీమిత్రులారా!
సామాన్యమానవులు పరిహాసాలాడడం, ఛలోక్తులు విసరడం
మనం గమనించేవే కాని దేవతలు సైతం పరిహాసాలాడడం
మనం ఇక్కడ గమనించ వచ్చు.
గంటి కృష్ణవేణమ్మగారు "గిరిజా కల్యాణము" -  అనే కావ్యంలో
 "బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు" వివాహభోజన సమయంలోని
సరససంభాషణలు ఇలా చిత్రించారు చూడండి.

విష్ణువు శివునితో-

విసము తిన్ననోట కసవయ్యె కాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారంబులు లే
వటంచు బల్కె విష్ణు డభవుతోడ-

అప్పుడు శివుడు-

నిక్కము నీవు పల్కినది నీరజనాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న తెత్తుమన చిక్కవు ఎంగిలి కాయలెందు నీ
కెక్కడఁ దెత్తుమయ్య అవి యిప్పుడటంచు శివుండు నవ్వినన్
అక్కడ పంక్తిభోజనమునందు పకాలున నవ్విరందఱున్


విష్ణువు బ్రహ్మతో-

వండి వడ్డింప దొకనాడు వనిత నీకు
అంటు తలవాకిటనెగాన - ఓ విధాత!
భుక్తి సలుపుమ యిపుడైన బొజ్జనిండ
అనుచు పరిహాసమాడె నా హరియు నపుడు

No comments:

Post a Comment