Wednesday, May 11, 2016

వాని తలదీయ సదాశివ సద్గురుప్రభూ!



వాని తలదీయ సదాశివ సద్గురుప్రభూ!


సాహితీమిత్రులారా!
కవిత్వాన్ని ఎవరికి వినిపించాలో ఎవరికి వినిపించగూడదో
ఈ క్రింది పద్యంలో కవి వివరించాడు.
చూడండి.

గొప్ప కవీంద్రుడైన వినగోరు కవిత్వము, తోచినంతలో
చెప్పును తప్పునొప్పు, నిరసింపక దిద్దును, శుంఠయయ్యెనా
తప్పులు పట్టు, యుక్తి పెడదారికిదీయు, "గరాసు", దాని దా
ద్రిప్పుట బెట్టుట, వాని తలదీయ, సదాశివ! సద్గురుప్రభూ!

సదాశివ సద్గురువర్యా దేశంలో గొప్పగొప్ప కవీశ్వరు లెందరో,
ఇతరుల కవిత్వాన్ని, దానిలోని ఇంపుసొంపులను వినాలనుకుంటారు.
విన్న తర్వాత వానిలోని మంచి చెడ్డలను,
అర్థనర్థాలను తనకుతోచినట్లు స్పష్టంగా, తెల్పుతారు.
తిరస్కరింపక, చొరవ తీసుకొని, ఇక్కడ ఇది ఇలా ఉంటే బాగుంటుందని,
దిద్దిచెబుతారు.
ఇక సరిగా,
చదువురాని మూర్ఖుడు(గరాసు), దుష్టుడైనచో,
వెదకి వెదకి ఆ కవిత్వంలోని ఒప్పులను విడచి
తప్పులను మాత్రమే పట్టుకొంటాడు.
విడిచి పెట్టక వానిమాటలకు, విపరీతార్థాలు,
పెడార్థాలు తీసి, క్రూరత్వం, గర్వం కూడా ప్రదర్శిస్తాడు,
వాని తస్సదియ్య అలాంటివాని
తలకాయ తీసివేసినా తప్పులేదు సుమా!

No comments:

Post a Comment