Thursday, May 5, 2016

కవితా లక్షణం


కవితా లక్షణం


సాహితీమిత్రులారా!
విద్యా వివాదానికై విజయనగరానికి వెళ్ళినపుడు
అక్కడి ముమ్మకవితో శ్రీనాథుడు చెప్పిన పద్యంలో
ఒక గొప్ప విశేషముంది. ఆ పద్యం.......

పంపా విరూపాక్ష బహుజటాజూటికా రగ్వ ధప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా గంభీర ఘుమఘుమారంభములకు
కర్ణటకామినీ కర్ణహాటక రత్న తాటంక యుగధాళధళ్యములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫల స్తబకములకు
నిర్ణిబంధ నిబంధమై నెనయు కవిత తెలుగునను సంస్కృతంబున బలుక నేర్తు
ప్రౌఢ దేవేంద్రరాయ భూపాల వరుని సమ్ముఖంబున దయజూడు ముమ్మసుకవి

పై పద్యంలో పంపా విరూపాక్షుని జటలలో అలంకరించే రేలపూల వాసనలూ,
తుంగభద్రానదిలోని ఎత్తైన అలల ఘుంఘుమ నాదాలూ,
కన్నడ కామినుల చెవుల కమ్మల్లోని రత్నాల ధళధళలు,
కళసాపుర ప్రాంతంలోని అరటి తోటల్లోని ద్రాక్షపళ్ళ రుచులు
తన కవిత్వంలో ఉంటాయని
శ్రీనాథుడు ముమ్మకవికి చెప్పి
దయచేసి తనను ప్రౌఢదేవరాయల సమ్ముఖానికి
తీసుకు వెళ్ళమని చెప్పాడు.

అంటే మనం గమనించాల్సినది
కవిత్వానికి - తావి(వాసన), నాదం(శబ్దం), కాంతి, రుచి ఉంటాయని.
కవిత్వానికి ఇంత గొప్ప లక్షణాలుంటాయని -
చెప్పినకవి బహుశా శ్రీనాథుడేనేమో!

No comments:

Post a Comment