Sunday, May 15, 2016

కుకవి నింద


కుకవి నింద


సాహితీమిత్రులారా!

ప్రతి కావ్యంలో ప్రతికవి కుకవి గురీంచిన పద్యం రాయడం పరిపాటి.
ఇక్కడ క్రీ.శ. 1932లో అనంతపంతుల రామలింగస్వామి అనుకవి
రచించిన శుక్లపక్షము అనే హాస్య కావ్యం రాసి ముద్రింపిచారు.
అందులో కుకవి నింద
ఎంత
తమాషాగా
రాశారో
చూడండి.

రసము నే నెఱుంగనా? ప్రారబ్దమిదియేమి?
        ద్రవిడదేశాన్నసత్రముల నిడరె?
సముచితాలంకారసమితి నే నెఱుగనా?
       మగువలు ధరియించు నగలు కావె?
యతిని నే నెఱుగనా? క్షితిలోన
       కాషాయవస్త్రధారుండైనవాడు కాడె?
గురువు నే నెఱుగనా? సరిసరి! అక్షరా
       భ్యసనంబు సల్పిన యతడు కాడె?
శబ్దమన నే నెఱుంగనా? చప్పుడు గదె?
అనుచు వచియించు అజ్ఞాన జనములోన
అగ్రగణ్యుండవగు నీ వహా! కవిత్వ
మును రచించుట భాషకు ముప్పు గాదె?

No comments:

Post a Comment