Wednesday, May 18, 2016

ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్


ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్


సాహితీమిత్రులారా!

శ్రీ అనంత పంతుల రాలింగస్వామిగారు నేటి విమర్శకులు ముచ్చటగా
మూడు విధాలని హాస్యప్రాయంగా క్రింది పద్యంలో చెప్పారు.........
చూడండి.

ఉన్నది ఉన్నదంచనుచు నుఁడెడి వాడధముండు, తెల్వి మై
ఉన్నది లేదటంచనుచు నుండెడి నాతడు మధ్యముండు, లే
కున్నది యున్నదంచనుచు నుండు నతండిలనుత్తముండ యా,
నెన్నగ ముత్తెరంగులు మహింగల యట్టి విమర్శకుల్ వెసన్


1.ఆయా గ్రంథాలలో ఉన్న మంచిని విమర్శించువాడు
    అధమ విమర్శకుడు,
2. ఆధిక తెలివిని ప్రదర్శిస్తూ, ఆ గ్రంథాలలో ఉన్న మంచిని
     లేదంటూ పేర్కొనువాడు మధ్యముడు,
3. ఇక, ఆ పుస్తకాలలో చెప్పబడని, లేని, మంచిని, విషయాన్ని,
    ఉన్నదని ఉగ్గడించేవాడు ఉత్తమవిమర్శకుడు.......
    గా    ప్రపంచంలో చెలామణి అగుచున్నారు.

No comments:

Post a Comment