Monday, May 30, 2016

నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్


నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్


సాహితీమిత్రులారా!
ప్రపంచంలో కవులతో కృతులు రాయించుకొని చివర
చెప్పినది కాక వేరొకటి చేసెడివారు కొందరైతే,
మరికొందరు రిక్తహస్తములు చూపెడివారు.
గజనీ మహమ్మదు ఫిరదౌసికి బంగారునాణేలు ఇస్తానని
చివరికి వెండినాణేలు పంపాడు.
అవి తిరస్కరించినందుకు మరణదండన కూడ
విధించడానికి వెనుకాడలేదు సుల్తాను.
కూచిమంచి జగ్గకవికి చింతలపాటి నీలాద్రిరాజు
తన ఉంపుడుకత్తెను నాయికగను, తనను నాయకునిగాను
కృతి రాయమని చివరికి శూన్యహస్తాలు చూపాడు
దీనితో మండిన జగ్గకవి చంద్రరేఖావిలాసం పేరును
చంద్రరేఖావిలాపంగా మార్చాడు.
ప్రార్థనా పద్యంలో రాజును
ఈ విధంగా శపించాడు చూడండి.

శ్రీకంఠుండు, భుజంగ భూషణుడు, భస్మీభూత పంచాస్త్రు డ
స్తోకాటోప బలప్రతాప పురరక్షోదక్ష సంశిక్షణుం
డాకాశూజ్జ్వల కేశపాశుడు త్రిశూలాంకుండు రుద్రుండు తా
నీకన్ చింతలపాటి నీలనృపతిన్ వీక్షించు నేత్రత్రయిన్

(గరళము కంఠమునందుకలవాడు,
సర్పములను భూషణములుగా ధరించువాడు,
మన్మథుని భస్మము చేసినవాడు,
త్రిపురాలను నాశము చేసినవాడు అయిన
త్రశూలాంకుడు రౌద్రంగా రాజును
మూడునేత్రములతో చూచుగాక -
అని శాపము ఇచ్చాడు.)

No comments:

Post a Comment