Tuesday, May 10, 2016

"కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్"


"కుంభి కుంభములపై వాసించు తద్వాసనల్"


సాహితీమిత్రులారా!
శ్రీనాథుడు రామగిరిదుర్గపాలకుడైన తెలుగురాయడిని దర్శించినపుడు
తెలుగురాయని ఆశీర్వదించగా తెలుగురాయడు
శ్రీనాథుని కోరిక తెలుపుమనగా
ఈ పద్యంలో
తనకోరిక
వెలిబుచ్చాడు
శ్రీనాథుడు.

అక్షయ్యంబగు పాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
బిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక ప్వామికిన్
దక్షారామ చళుక్య భీమ వర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు తద్వాసనల్

(ఓ తెలుంగాధీశ కస్తూరి దానంగా ఇస్తే
దక్షారామంలోని
అప్సరసల
ఉన్నత స్తనాలమీదపూసి
అనుభవిస్తాను.)

అడిగేది దానం
అదీ కస్తూరి
వేశ్యా స్తనాలపైరాసి
అనుభవించటానికట.
ఎంత చిత్రమైన దానం
అడిగాడో
              చూడండి.

No comments:

Post a Comment