Sunday, May 8, 2016

ఏమి సంబంధ మిది?



ఏమి సంబంధ మిది?


సాహితీమిత్రులారా!

కవితావినోదము (మొదటి సంపుటి)లో
విద్వాన్ కావ్యతీర్థ మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు
ఈ విధంగా రాసి ఉన్నారు.
1925నుండి 1934 వరకు నంద్యాల మునిసిపల్ హైస్కూల్ నందు ఉండేవారు.
తరువాత కర్నూల్, సెంటుజోసఫ్స్ గరల్స్ హైస్కూలులో
చేరినపుడు వారికి ఈ విధమైన ఆలోచన వచ్చిందట.
ఇప్పుడు ఈ పాఠశాలలో ఉద్యోగం దొరకుటకు కారణమేమి?
అని ఆలోచించగా
ఈ విధమైన శ్లోకం వచ్చిందట.
27-02-1960లో రాయబడింది.

రూపేణ వేణ్యా నను రోమరాజ్యా
నాగాంగంనా ఏవ హి బాలికా స్స్యు:
విద్యాలయే తాభి రభూ దత స్సు
బ్రహ్మణ్యనామ్నో మమ సాన్నిహిత్యమ్!

(ఇక్కడ చదువుకునే బాలికలందరు
రూపముచేతను, జడలచేతను, నూఁగారుచేతను
నాగాంగనలే అవుతారు. రూపంలో నాగకన్యలను పోలినవారు.
జడలు, నూగారు(నాగ = ) సర్పములవలె ఉన్నవి.
నేను సుబ్రమణ్యుడను. సుబ్రమణ్యస్వామి సర్పస్వరూపుడు కదా! )

కనుకనే మాకు మాకింత సన్నిహిత సంబంధం ఏర్పడినది.

No comments:

Post a Comment