Tuesday, May 3, 2016

పిల్లలవాణ్ణి కనికరించి కనికరించండి


పిల్లలవాణ్ణి కనికరించి కనికరించండి


సాహితీమిత్రులారా!

"సినీవాలి"లో "ఆరుద్ర"గారు "మృత్యువుతో మాట్లాడుతున్నట్లు"
 రాసిన కవిత(పుట.85-86) చూడండి.

"అయ్యా మృత్యువుగారూ!
పిల్లవాణ్ణి దయచేసి కనికరించండి
అద్దకుంటున్న ఈ జీవితం వాటాకి
నిజమే ఆదినుంచి బాడుగ బాకీ
అయ్యా వృత్యువుగారూ!
పండక్కి కోర్కెల గోడలకి వెల్ల వేయించండి
పడిపోయిన యౌవనం పెరటిగోడలు
ఈ ఏడైనా మరమ్మత్తు చేయించండి
ఇకమీదట సెక్సుపాపాల పిడకలతో
గోడలు ఖరాబు చెయ్యను ఖరారు
నిత్యనైమిత్తికాల వంటింట్లో
చూరునుంచి లేమికారుతూంది చూడండి
కలలపంచనుండికారే సంతృప్తిధార
నిద్దుర నిందెలలో పట్టుకోనీండి
అయ్యా మృత్యువుగారూ!
పరిస్థితుల పెంకులు తిరగ వేయించండి
ఆశయాల ధరలు మండిపోతున్నాయి
అద్దె కొద్దిగా తగ్గించండి
దయచేసి తక్కిన వాటాలవాళ్ళని
త్యాగాల ముగ్గులు పెట్టంమనండి
నుయ్యి కొంచెం లోతు చేయించండి
పోనీ బురదైనా తీయించండి
ఆ భయం మీకఖ్కర్లేదు
అందులో మట్టుకు పడి చావను
జ్ఢాపకాల సందుగులు అనుభవాల పరువులు
రోడ్డుమీద పారేయకండి
బాబ్బాబూ వచ్చేజన్మలో చూసుకుందాం
ఈసారికి ఊరుకోండి
అయ్యా మృత్యవుగారూ!
పిల్లలవాణ్ణి కనికరించి కనికరించండి"

No comments:

Post a Comment