Friday, May 27, 2016

తప్పెవరిది?


తప్పెవరిది?


సాహితీమిత్రులారా!

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు
ఒకసారి చమత్కారంగా ఈ పద్యం చెప్పారు.
చూడండి.

తొలి నాళుల శబ్దార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి యీ నా
ళుల వ్రాసిన కవి దోషము
కలి ముదిరిన కొలది వింతగతులను వెలయున్

(వెనుకటి రోజుల్లో ఏదన్నా ఒక పద్యానికో,
పదానికో అర్థం తెలియకపోతే పాఠకుడు
అపండితుని కింద లెక్క తెలుసుకోవటానికి ప్రయత్నం జరిగేది.
ఈ రోజుల్లో అలా కాదు.
తమ కర్థం కాకుండా రాయటం కవి దోషమని
అధునాతనులు అంటున్నారు.
కలి ముదిరిన కొద్దీ వింతలు పుడుతున్నాయి సుమా!)

ఇది ఎన్ని ఏళ్ళనాటి పద్యమో కాని
ఇది నేటికీ అక్షరసత్యం కదా!

No comments:

Post a Comment