Monday, May 8, 2017

మానవుఁడేమి సుఖింపఁగల్గెడిన్


మానవుఁడేమి సుఖింపఁగల్గెడిన్




సాహితీమిత్రులారా!

ఈ చమత్కార పద్యం చూడండి-
ఇష్టములేనివానికి కవిత్వం చెప్పడం
ఎలాంటిదో ఒకకవి ఈ పద్యంలో వివరించాడు.

సరసులుగానివారియెడఁ జాలఁగవిత్వరసప్రసంగముల్
కఱచుట కంఠశోషణమెకాక రసజ్ఞతకల్గ నేర్చునే
స్మరశరజాలవేదనకుఁ జాలక భ్రాంతిని ఱాతి బొమ్మతో
మరఁగిరమింపఁగాఁదివిరి మానవుఁడేమిసుఖింపఁగల్గెడిన్

సరసులుకానివారికి కవిత్వం చెప్పటం
రసప్రసంగాలు చేయడం కంఠశోష తప్ప
మరేమీకాదట అవివినంగానే రసజ్ఞత
పుడుతుందాయేమి పుట్టదుకదా
మన్మథబాణాలదెబ్బకు భ్రాంతితో
కోరి రాతి బొమ్మతో కలిసినట్లుంది
ఆ మానవుడు ఏమిసుఖం పొందగలడు

కాబట్టి సరసుడైన వానికే కవిత్వం వినిపించడం
రసభాషణం చేటడం మంచిది అని భావం.

No comments:

Post a Comment