Wednesday, May 31, 2017

వ్రాలు - అందం


వ్రాలు - అందం




సాహితీమిత్రులారా!


అక్షరాలు గుండ్రంగా వ్రాయండం
అందరికి సాధ్యమయే విషయంకాదు
వ్రాతను బట్టి వారి మనస్తత్వమును
చెప్పే శాస్త్రమొకటి ఉంది దానిపేరు
గ్రాఫాలజీ అంటారు వారు వ్రాసే విధానాన్ని
బట్టి వారి మనస్తత్వము చెబుతారు.
పూర్వం ప్రతిదాన్ని వ్రాయడానికి వారికి ప్రత్యేక
వ్రాయసగాడు ఉండేవాడు. తిక్కనకు
కుమ్మరి గురునాథుడు అనే వ్రాయసకాడు ఉన్నట్లు
చెబుతుంటారు. ఇక మన కవిసామ్రాట్ విశ్వనాథ వారు
స్వయంగా తన చేత్తో వ్రాసినది వేయి పడగలు అనేదేనట
అంటే వారు చెబుతుంటే వ్రాసేవారు వ్రాస్తుండేవారు
అలాంటి వ్రాయసగండ్రలో ఒకాయన చెప్పిన ఈ పద్యం చూడండి-

వ్రాలివిగో కనుగొనుము వన్నియమీఱగ వ్రాలకేమి నా
వ్రాయు సుధారసాలు, కవిరాజుల కెల్లమనోహరాలు, వ
జ్రాలు, సరస్వతీ విమల చారుకుచాగ్రసరాలు, చూడచి
త్రాలు, మిటారి మోహనకరాలు, నుతింప తరంబె ఏరికిన్

ఒక వ్రాయసకాడు తన చేతి వ్రాత
సౌందర్యానికి మురిసిపోతూ
చెప్పుకొన్న పద్యం ఇది.
నా వ్రాలు ఎలావుందో చూడు-
అమృతధారలు, కవిశ్రేష్ఠులకు మనోహరమైనవి,
వజ్రాలు, సరస్వతీదేవి వక్షస్థలాన్ని అలంకరించే
ముత్యాల దండలు, చిత్రవిచిత్రాలు, అందమైన
అమ్మాయి హస్తాలు. ఇలా చెబుతున్నాడు.

No comments:

Post a Comment