Wednesday, May 10, 2017

ఎంతవారుగాని వేదాంతులైనగాని


ఎంతవారుగాని వేదాంతులైనగాని




సాహితీమిత్రులారా!



ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలుచూపు సోకగానె సోలిపోదురో -
అని ఒక సినీమాలో పాట

శివపల్లి సర్వోత్తమ కవి గారి
లక్షినారాయణ పరిణయములో
క్షీరసాగర మథనం తరువాత
అమృతాన్ని పంచే సమయంలో
అసురులను మోహిని ఏవిధంగా
మోహింప చేసిందో ఈ పద్యంలో
వర్ణించారు చూడండి -

వలుద గుబ్బలు సూపి వలపించుఁగొందఱిఁ
             జేసన్నఁ గొందఱి నాసకొల్పుఁ
జెక్కుల తళుకులఁ జొక్కించుఁ గొందఱి
             కనుగిల్పి కొందఱిఁ గాకు సేయు
వాతెఱ జిగిఁ జూపి వాకట్టుఁగొందఱి
             మాటలఁగొందఱి మరులు కొల్పు
జింక చూపులచేతఁ జిక్కించుఁగొందఱిఁ
             జేష్టలఁ గొందఱి జిక్కు వఱచుఁ
గలికి నగవునఁ గొందఱి వలలఁబెట్టు
కక్షకాంతులఁ గొందఱిఁ గరగఁజేయు
సురల కమృతంబు వడ్డించుచోఁ గడంగి
యసురపంక్తుల వంచించు నవసరమున

గుండ్రటి గుబ్బల్ని ప్రదర్శించి అసురులకొంరని
వలపించింది. చేతి సంజ్ఞలతో కొందరికి ఆశలు
పుట్టించింది. చెక్కిళ్ళకాంతులతో కొందరిని మై
మరిపించింది. కన్నుగీటి కొందరిని చికాకు పెట్టింది.
క్రిందిపెదవి మెరుపును చూపించి కొందరిని నోటమాట
రాకుండా చేసింది. మాటలతో కొందరిని మరులుకొనేట్టు
చేసింది. అమాయకమైన లేడిచూపులతో కొందరిని
చిక్కించుకొంది. ఇంకా ఏవేవో చేష్టలతో కొందరిని చిక్కుల్లో
పడగొట్టింది. గడసరి నవ్వులతో కొందరిని తన వలలో
చిక్కుకునేలా చేసింది. బాహుమూలరుచులతో కొందరిని
కరిగిపోయేలా చేసింది. మొత్తంమీద అసురులందరినీ
అవాక్కులను చేసింది.
అంతటి జగన్మోహనరూపమే వలపిస్తే
మరులుకొననివాడవడు.

No comments:

Post a Comment